Sorghum: ఉదయాన్నే వీటిని తీసుకుంటే.. ఆరోగ్య ప్రయోజనాలన్నీ మీకే

ఉదయాన్నే జొన్నలు తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. అలాగే ఇందులోని పోషకాలు గుండె పోటు వంటి ప్రమాదకర వ్యాధులు రాకుండా కాపాడుతుంది. డైలీ వీటిని తీసుకుంటే ఆరోగ్యంగా కూడా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.

New Update
sorghum

sorghum Photograph: (sorghum)

ఉదయం పూట చిరు ధాన్యాలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. వీటిని ఎక్కువగా పూర్వ కాలంలో తీసుకునే వారు. కానీ ప్రస్తుతం రోజుల్లో వీటిని తీసుకునే వారి సంఖ్య తగ్గుతోంది. అయితే చిరుధాన్యాలను చాలా మంది మొలకలుగా చేసి తింటారు. దీనివల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందడంతో పాటు బలం కూడా చేకూరుతుంది.

ఇది కూడా చూడండి: Sourav Ganguly : సౌరవ్ గంగూలీకి తప్పిన ఘోర ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం!

జీర్ణ క్రియని కూడా ఆరోగ్యంగా..

చిరుధాన్యాల్లో జొన్నలను ఉదయం పూట తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ ఫిట్‌గా ఉండేలా చేస్తుంది. చాలా మంది గోధుమలను ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ జొన్నలను వాడటం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు అన్ని కూడా అందుతాయి. అలాగే జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది. 

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే..సూపర్‌ గా ముందుకు దూసుకుపోండి!

ఇందులోని కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. డైలీ జొన్నలను తీసుకుంటే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే గుండె పోటు వచ్చే ప్రమాదాలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు వీటిని డైలీ ఉదయం పూట తీసుకుంటో ఫలితం ఉంటుంది. జొన్నల వల్ల చర్మం కూడా కాంతివంతంగా మెరిసిపోతుంది. చర్మంపై ముడతలు రాకుండా యంగ్ లుక్‌లో కనిపిస్తారు.

ఇది కూడా చూడండి: Delhi: ఆర్థిక, రెవెన్యూ ఆమె దగ్గరే...ఢిల్లీ మంత్రుల శాఖల కేటాయింపులు ఇవే..

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు కోసం దీనికి సంబంధించిన నిపుణులను సంప్రదించగలరు.

ఇది కూడా చూడండి: Puri Jagannadh Golimaar Sequel: పదిహేనేళ్ల తర్వాత పూరీ సినిమాకి సీక్వెల్.. ఈసారి కొడితే బ్లాక్ బస్టరే..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Plants: షాంపూతో మొక్కలకు పట్టిన పురుగులు పరార్‌.. ఏం చేయాలంటే!!

కీటకాల నుంచి మొక్కలను కాపాడేందుకు క్రిమిసంహారక మందులు అవసరం లేదు. లీటరు నీటిలో రెండు మిల్లీ లీటర్ల షాంపూను కలిపి ఈ స్ప్రే బాటిల్‌లో మొక్కలపై చల్లితే మీలీబగ్స్ తగ్గుతాయి. వారానికి మూడుసార్లు పిచికారీ చేస్తే మెరుగైన ఫలితం ఉంటుంది.

New Update
Plants

Plants

Plants: ఇంటిలో చిన్న తోటను సృష్టించడం వలన అందం పెరగడమే కాదు మనకు మనశ్శాంతి, ఆరోగ్యకరమైన వాతావరణం కూడా లభిస్తుంది. అయితే మొక్కలు నాటడమే కాకుండా వాటిని కాపాడుకోవడంలోనూ మన బాధ్యత ఉంటుంది. మొక్కలకు హాని కలిగించే తెగుళ్లలో మీలీబగ్స్ చాలా ముఖ్యమైనవి. ఇవి చిన్న తెల్లటి పిండిలా కనిపించే పురుగులు. మొక్కల కాండం, ఆకులపై కనిపిస్తూ వాటి జీవరసాన్ని పీలుస్తూ ఉంటాయి. దీనివల్ల మొక్కలు బలహీనమవుతాయి. 

మందులు అవసరం లేదు:

ఆకులు పసుపు రంగులోకి మారి, ఎండిపోతూ చివరికి మొక్క నశిస్తుంది. ఇలాంటి కీటకాల నుంచి మొక్కలను కాపాడేందుకు ఖరీదైన క్రిమిసంహారక మందులు అవసరం లేదు. కేవలం రూపాయి విలువైన షాంపూ పౌచ్‌తోనే దీన్ని సమర్థవంతంగా నివారించవచ్చు. ఒక లీటరు నీటిలో రెండు మిల్లీ లీటర్ల షాంపూను కలిపి తయారు చేసే ఈ ద్రావణాన్ని స్ప్రే బాటిల్‌లో పెట్టి మొక్కలపై చల్లితే మీలీబగ్స్ తగ్గుతాయి. కానీ దీన్ని సూర్యరశ్మి ఉన్న సమయంలో కాకుండా సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. మొదటిసారి చేయగానే ఫలితం రాకపోవచ్చు. వారానికి మూడుసార్లు పిచికారీ చేస్తే మెరుగైన ఫలితాన్ని పొందవచ్చు.

ఇది కూడా చదవండి: పండ్లను చూసే తియ్యగా ఉన్నాయో లేదో చెప్పొచ్చు

దీంతో పాటు వేపనూనె కూడా ఒక మంచి సహజ పరిష్కారం. వేప నూనెను నీటిలో కలిపి పిచికారీ చేస్తే మీలీబగ్స్ నివారణకు తోడ్పడుతుంది. అంతేకాకుండా సేఫర్ సబ్బు లేదా సాదా వాషింగ్ సొప్పుతో తయారైన ద్రావణాలను ఉపయోగించవచ్చు. కొన్ని సందర్భాల్లో మీలీబగ్ తీవ్రత అధికంగా ఉంటే ప్రభావిత ఆకులను తొలగించడం ఉత్తమమైన చర్య. ఇలా ఇంట్లో చిన్న ప్రయత్నాలతోనే మొక్కలను కాపాడుకోవచ్చు. సహజ పద్ధతుల్లో క్రిమిసంహారక చర్యలు తీసుకోవడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

ఇది కూడా చదవండి: క్యాన్సర్‌ను తరిమికొట్టే అద్భుతమైన ఆహారాలు

( home-tips | home tips in telugu | latest-news | bedroom-plants | coconut-plants | Green Power Plants | houseplants)

Advertisment
Advertisment
Advertisment