Sabarimala: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్.. అయ్యప్ప దర్శనానికి ఇకపై కొత్త రూల్

శబరిమల అయ్యప్ప స్వామి దర్శన మార్గంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం కొన్ని మార్పులు చేసింది. ఎక్కువ సమయం అయ్యప్పను దర్శించుకోవడం కోసం కొత్త మార్గాన్ని అమలు చేయనుంది. మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభించే ఈ రూట్ ద్వారా ఎక్కువ నిమిషాలు స్వామిని దర్శించుకోవచ్చు.

New Update
sabarimala Temple

sabarimala Temple

శబరిమల వెళ్లే భక్తులకు ఇది శుభవార్త. దేవస్థానం బోర్డు చేయబోతున్న ఓ మార్పు వల్ల భక్తులు ఎక్కువ సెకన్ల పాటు అయ్యప్ప స్వామిని దర్శించుకోవచ్చు. అయ్యప్ప స్వామిని దర్శించుకునే మార్గాన్ని మార్చాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంది. దేవుని సన్నిధిలోని పవిత్రమైన 18 మెట్లు ఎక్కిన భక్తులు డైరెక్ట్‌గా దేవుని దర్శనానికి వెళ్తారని ట్రావెన్‌కోర్ దేవస్థానం తెలిపింది. అయితే ఈ కొత్త రూట్ దర్శనం మార్చు​15వ తేదీ నుంచి అమలు అవుతుంది.

ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారికి అసలు బాలేదు..కాస్త జాగ్రత్తగా ఉండండి!

12 రోజుల పాటు కొత్త మార్గంలో..

విషుపూజ సందర్భంగా 12 రోజుల పాటు కొత్త మార్గంలోనే అయ్యప్ప దర్శనం కొనసాగుతుందని టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ ప్రకటించారు. ఇది కనుక విజయవంతమైతే శాశ్వతంగా అమలు చేస్తామని తెలిపారు. పవిత్రమైన మెట్లు ఎక్కిన తర్వాత దర్శనం మంచిగా దర్శనం కావాలని భక్తుల నుంచి బోర్డుకు అభ్యర్థనలు వచ్చాయి. ఈ క్రమంలోనే అయ్యప్ప స్వామి దర్శన మార్గాన్ని మారుస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

ఇది కూడా చూడండి: Elan Musk: ఎక్స్‌ సేవల్లో అంతరాయం..ఇది భారీ సైబర్‌ దాడే అంటున్న మస్క్‌!

ప్రస్తుతం 18 మెట్లు ఎక్కిన తర్వాత దర్శనం కోసం వంతెన దగ్గరకు పంపించి క్యూలైన్‌లో కూర్చోబెడతారు.  ఆ తర్వాత దర్శనం కోసం అవతలి వైపుకు పంపుతారు. ఈ పద్ధతి వల్ల ఐదు సెకన్లు మాత్రమే దర్శనం భాగ్యం కలుగుతుంది. దీనివల్ల 80 శాతం మంది అయ్యప్ప భక్తులు సంతృప్తి చెందడం లేదని అభ్యర్థనలు రావడంతో మార్పులు చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ulcers: మధుమేహం ఉన్నవారు అల్సర్లను నిర్లక్ష్యం చేస్తే కాలి వేలికి ప్రమాదం

డయాబెటిస్‌ను నియంత్రించకపోతే రక్త నాళాలు, నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. డయాబెటిస్ ఉన్నవారిలో పాదాల అల్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. దీనిని విస్మరిస్తే చికిత్స చేయడం కష్టమవుతుంది. ఇది చీము, క్షయం, గ్యాంగ్రీన్‌కు దారితీస్తుంది.

New Update

Ulcers: డయాబెటిస్ శరీరంలోని అన్ని అవయవాలను బాగా ప్రభావితం చేస్తుంది. ఇది కళ్ళ నుండి పాదాల వరకు వివిధ అవయవాలను ప్రభావితం చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు పాదాలపై ఏదైనా గాయం అయితే నిరంతరం బాధపడాల్సి ఉంటుంది. మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారు లక్ష మంది షుగర్‌ పేషెంట్లకు వేళ్లు, కాలి వేళ్లను కత్తిరించాల్సి వస్తుందని అంచనా. డయాబెటిస్ ఉన్నవారిలో దాదాపు 15 నుండి 20 శాతం మందికి పాదాల అల్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. పెద్ద సమస్య ఏమిటంటే చాలా మంది వీటిని విస్మరిస్తారు. అల్సర్లు పెద్దవి అయ్యే వరకు వైద్యుడిని సంప్రదించరు.  

నరాలు దెబ్బతినే ప్రమాదం:

కొన్ని నెలల తర్వాత పాదాల వేళ్లను తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా మందికి మరిన్ని కాళ్ళ భాగాలను తొలగించాల్సిన అవసరం మూడు రెట్లు పెరుగుతోంది. డయాబెటిక్ అల్సర్లు త్వరగా నయమైన వారి కంటే బొటనవేలు తొలగించబడిన వారికి అన్ని కారణాల వల్ల మరణించే ప్రమాదం మూడు రెట్లు ఎక్కువ. ముందుగానే అల్సర్లను గుర్తించి చికిత్స చేస్తే కాలి వేళ్ల నరికివేతను నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. డయాబెటిస్‌ను నియంత్రించకపోతే రక్త నాళాలు, నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇవి పాదాల పూతలకు ప్రధాన కారణాలు.  

ఇది కూడా చదవండి: మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉందా..?

ఇది కాళ్ళకు రక్త సరఫరాను తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. నరాలకు స్పర్శ భావాన్ని కోల్పోవడానికి దారితీస్తుంది. చెప్పులో లేదా బూటులో రాయి ఉన్నా కూడా రోజంతా అలా నడవవచ్చు. పుండు ఉందని మీకు తెలియకపోవచ్చు. ప్రారంభ దశలో చర్మం ఎర్రగా మారుతుంది. జ్వరం, వాపు ఉండవచ్చు. కొంతమందికి చీమలు తమ చర్మంపై పాకుతూ కొరుకుతున్నట్లు అనిపించవచ్చు. కొన్ని చోట్ల తిమ్మిరి ఉండవచ్చు. చాలామంది వీటిపై పెద్దగా దృష్టి పెట్టరు. క్రమంగా పుండుగా మారుతుంది. చర్మంపై గీతలు పడినా పుండు దానంతట అదే ఏర్పడుతుంది. కొంతమందిలో ఇది ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది.  

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: మందులు లేకుండా సహజంగా బీపీ ఇలా తగ్గించుకోండి

( mouth-ulcers | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )

Advertisment
Advertisment
Advertisment