/rtv/media/media_files/2026/02/13/nipah-2026-02-13-08-44-56.jpg)
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రాణాంతకమైన నిఫా వైరస్ బారిన పడి, దానిపై పోరాడి గెలిచిన ఓ నర్సు, దురదృష్టవశాత్తు గుండెపోటుతో మరణించారు. పూర్బబర్ధమాన్ జిల్లా కట్వా ప్రాంతానికి చెందిన ఒక నర్సు జనవరి చివరి వారంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వైద్య పరీక్షల్లో ఆమెకు జనవరి 31న నిఫా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అప్పటి నుండి బరాసత్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు మెరుగైన చికిత్స అందించారు. వైద్యుల కృషి ఫలితంగా ఆమె నిఫా వైరస్ నుండి పూర్తిగా కోలుకున్నారు.
#WestBengal: A 25-year-old female nurse passes away at a private hospital in Barasat, North 24 Parganas district due to #Nipahvirus infection.
— All India Radio News (@airnewsalerts) February 12, 2026
According to the Ministry of Health and Family Welfare, it is the first death from the virus in West Bengal in recent history.… pic.twitter.com/A2Hvu4aqsD
అయితే, వైరస్ నుండి కోలుకున్నప్పటికీ, ఆమె ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా కోమాలోకి వెళ్లారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో పోరాడుతున్న ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తుండగానే, గురువారం మధ్యాహ్నం తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆమె మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. నిఫా వైరస్ను జయించినా, ఇతర అనారోగ్య కారణాలు ఆమెను బలితీసుకోవడం పట్ల తోటి వైద్య సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, గత ఏడాది డిసెంబర్లో నిఫా బారిన పడిన ఒక వ్యక్తి ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నారని, అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. నిఫా వైరస్ సోకినప్పుడు అది మెదడు, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది.
Follow Us