Maha Shivaratri: మహా శివరాత్రి నాడు ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే.. పుణ్యమే

దేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. వీటిని మహా శివరాత్రి నాడు దర్శించుకోవడం వల్ల పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మొత్తం 12 జ్యోతిర్లింగాల్లో శివరాత్రి నాడు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.

author-image
By Kusuma
New Update
Jyotirlinga

Jyotirlinga Photograph: (Jyotirlinga )

Maha Shivaratri: దేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. వీటిని దర్శించుకుంటే పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతుంటారు. ఎందుకంటే ఈ 12 జ్యోతిర్లింగాలపై ప్రత్యేకంగా శివుని ఆశీస్సులు ఉంటాయట. అయితే 12 జ్యోతిర్లింగాలు ఏవేవి? ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని తెలుసుకుందాం. 

Also Read: TS: నిర్మల్ కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీస్ స్వాధీనం..కోర్టు ఆదేశాలు

Also Read: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే

సోమనాథ జ్యోతిర్లింగం

గుజరాత్‌లోని సౌరాష్ట్రంలో సోమనాథ జ్యోతిర్లింగం ఉంది. దీన్ని మొదటి జ్యోతిర్లింగంగా గుర్తిస్తారు. ఇక్కడ శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు.

మల్లికార్జున జ్యోతిర్లింగం
ఏపీలోని శ్రీశైలం పర్వతంపై మల్లికార్జున జ్యోతిర్లింగం ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి ఎక్కువగా వెళ్తుంటారు. మహా శివరాత్రి నాడు ఈ ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. 

మహాకాలేశ్వర జ్యోతిర్లింగం
మూడవ జ్యోతిర్లింగమైన మహాకాలేశ్వరం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది. దక్షిణాభిముఖంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగంగా మహాకాలేశ్వరం బాగా ప్రసిద్ధి పొందింది. 

ఓంకారేశ్వర జ్యోతిర్లింగం
నర్మదా నది ఒడ్డున ఇండోర్ సమీపంలో ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఉంది. 

భీమాశంకర జ్యోతిర్లింగం
మహారాష్ట్రలోని పూణేలో సహ్యాద్రి పర్వత శ్రేణులపై ఈ భీమాశంకర జ్యోతిర్లింగం ఉంది. 

కేదార్‌నాథ్ జ్యోతిర్లింగం
ఉత్తరాఖండ్‌లో కేదార్ పర్వతంపై హిమాలయాల్లో కేదార్‌నాథ్ జ్యోతిర్లింగం ఉంది. దేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడికి ఏటా భక్తులు భారీ సంఖ్యలో వెళ్తుంటారు. 

కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం పసిద్ధి చెందింది. ఇక్కడ శివుని ప్రత్యేకంగా పూజిస్తారు. 

త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఉంది. ఈ ఆలయం ఎంతో విశిష్టమైనది. 

వైద్యనాథ జ్యోతిర్లింగం
జార్ఖండ్‌లోని దేవఘర్లో వైద్యనాథ జ్యోతిర్లింగం ఉంది. ప్రధానమైన జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి. 

నాగేశ్వర జ్యోతిర్లింగం
గుజరాత్‌లోని ద్వారకాపురి సమీపంలో నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంది. శివుడు స్వయంగా ఇక్కడ వెలిసాడని చెబుతుంటారు. 

రామేశ్వర జ్యోతిర్లింగం
తమిళనాడులోని రామనాథంలో రామేశ్వర జ్యోతిర్లింగం ఉంది. 

ఘృష్టేశ్వర జ్యోతిర్లింగం
మహారాష్ట్రలోని సంభాజీనగర్‌లో ఘృష్టేశ్వర జ్యోతిర్లింగం ఉంది. జ్యోతిర్లింగ్లాలో ఇదే చివరిది. 

Also Read: CBSE: 2026 నుంచి రెండుసార్లు సీబీఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు కోసం దీనికి సంబంధించిన నిపుణులను సంప్రదించగలరు.

Also Read: TG JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 50 వేల ఉద్యోగాలకు సీఎం గ్రీన్ సిగ్నల్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Health:,వేసవిలో సపోటా తింటే ఎన్ని లాభాలో తెలుసా!

సపోటాలో ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైన కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం మంచి మొత్తంలో ఉంటాయి. దీన్ని తినడం వల్ల ఎముకలు బలపడతాయి.బలమైన ఎముకల కోసం, ఆహారంలో సూర్యరశ్మి సపోటాను కూడా చేర్చుకోవచ్చు.

New Update
chikoo

chikoo

 

తీపి సపోటాలా సీజన్ వచ్చేసింది. ఈ సమయంలో మార్కెట్లలో సపోటాలు పెద్ద మొత్తంలో అమ్ముడు అవుతున్నాయి. దీని జ్యూసీ,   రుచి అందరికీ ఇష్టం. సపోటా పోషకాలకు నిలయం. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. మరి వేసవిలో సపోటా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం?

సపోటా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: వేసవిలో చాలా మంది జీర్ణక్రియ సరిగా లేకపోవడంతో బాధపడుతుంటారు. అటువంటి పరిస్థితిలో, సపోటా వినియోగం ప్రయోజనకరంగా ఉంటుంది. సపోటాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఫైబర్ ప్రేగు కదలికలను నియంత్రించడం ద్వారా ప్రేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. యాసిడ్ రిఫ్లక్స్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఇతర జీర్ణశయాంతర పరిస్థితులకు ఫైబర్ కంటే ఎక్కువ అవసరం.

ఎముకలు దృఢంగా మారుతాయి: సపోటాలో ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైన కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం మంచి మొత్తంలో ఉంటాయి. దీన్ని తినడం వల్ల ఎముకలు బలపడతాయి. కాల్షియం, విటమిన్ డి, మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారం బలమైన ఎముకలను నిర్మించడంలో సహాయపడుతుందని పోషకాహార నిపుణులు విశ్వసిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, బలమైన ఎముకల కోసం,  ఆహారంలో సూర్యరశ్మి, పాల ఉత్పత్తులు,బలవర్థకమైన ఆహారాలతో పాటు సపోటాను కూడా చేర్చుకోవచ్చు.

కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి: సపోటాలో విటమిన్ ఎ ఉంటుంది, ఇది కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ ఉంటాయి. ఈ పోషకాలు రాత్రి అంధత్వాన్ని నివారించడానికి, మంచి దృష్టిని నిర్వహించడానికి,  వయస్సు సంబంధిత కంటి క్షీణత నుండి రక్షించడానికి సహాయపడతాయి. వయసు పెరిగే కొద్దీ దృష్టిని కాపాడుకోవడంలో సపోటా సహాయపడుతుంది. చీకూలో ఉండే విటమిన్ ఎ , బీటా కెరోటిన్ రాత్రి అంధత్వాన్ని నివారించడంలో సహాయపడతాయి.

చర్మం ఆరోగ్యంగా ఉంటుంది: సపోటాలో విటమిన్లు E, A , C ఉంటాయి, ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. సపోటాలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉండటం వల్ల చర్మానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది ముడతలను తగ్గించడం, ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడం , కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా యవ్వన రూపాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్ E కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది చర్మాన్ని లోపలి నుండి తేమగా ఉంచడంలో సహాయపడుతుంది, ఇది ప్రకాశవంతమైన , ఆరోగ్యకరమైన రంగుకు దారితీస్తుంది.

health | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips

Advertisment
Advertisment
Advertisment