Mahashivratri 2025: లింగాకారంలోనే శివుడు ఎందుకు.. వెనుకున్న శాపం ఏంటీ?

హిందువులకు మహాశివరాత్రి అత్యంత ప్రీతికరమైన,  శ్రేష్ఠమైన పర్వదినం. అయితే ఎంతో కాలంగా శివుడిని లింగరూపంలోనే కొలుస్తున్నారు. అసలు శివుడిని లింగరూపంలో పూజించాడనికి కారణమేంటి? దీని వెనుక ఉన్న కథేంటి? అనే విషయాలు తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.

author-image
By Archana
New Update
SHIVA LINGAM

SHIVA LINGAM

Mahashivratri 2025: హిందువులకు మహాశివరాత్రి అత్యంత ప్రీతికరమైన,  శ్రేష్ఠమైన పర్వదినం. ఈ ప్రత్యేకమైన రోజున భోలే నాథుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం, జాగారాలు, పూజలు చేస్తారు భక్తులు.  మాఘమాసంలోని  కృష్ణ పక్షం చతుర్థశ  తిథిని మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈ ఏడాది 26-02-2025 బుధవారం నాడు మహాశివరాత్రి వచ్చింది. అయితే కొన్ని దశాబ్దాలుగా ఏ ఆలయంలో చూసిన శివుడిని లింగరూపంలోనే పూజిస్తారు. ఫొటోలు తప్పా పరమశివుడి విగ్రహాలు ఎక్కడా కనిపించవు. అసలు శివుడిని లింగరూపంలోనే ఎందుకు పూజిస్తారు? దీని వెనుక ఉన్న కథేంటి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకోండి. 

 Also Read: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?

లింగం వెనుక శాపం ? 

వరాహపురాణం ప్రకారం.. ఒకరోజు భృగుమహర్షి పరమశివుడి దగ్గరకు వస్తాడు. అయితే ఆ సమయంలో శివుడు  తాండవం చేస్తూ భృగుమహర్షిని పట్టించుకోడు. దీంతో కోపంతో రగిలిపోయిన మహర్షి శివుడిని శపిస్తాడు. ఇకపై భూలోకంలోని భక్తులు నిన్ను లింగాకారంలోనే కొలుస్తారు. నీ శివలింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు, నీ ప్రసాదం నింద్యం అవుతుంది అంటూ శివుడిని శపించి వెళ్ళిపోతాడు భృగుమహర్షి. అప్పటి నుంచి భక్తులు భోలేనాథుడిని లింగరూపంలో ఆరాధిస్తారు. శివలింగాన్నే శివుడి ప్రతిరూపంగా భావిస్తారు. శివం అంటే శుభప్రదమైనది,  లింగం అంటే ఆకారం.. శివ లింగం అంటే శివుని ఆకారం అని అర్ధం. 

Also Read: Kiccha Sudeep: హైదరాబాద్ మెట్రోలో హీరో కిచ్చా సుదీప్.. అక్కడ ఏం చేశారో చూడండి?

లింగాలు ఎన్ని రకాలు 

  • బాణ లింగం
  • స్వయం భూ లింగం
  • దైవిక లింగం
  • రుష్య లింగం
  • మానుష లింగం

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.  

Also Read: AR Rahman: నోరు తెరిస్తే ఏమౌతుందో తెలిసిందా.. యూట్యూబర్ అల్లాబాడియాకు రెహ్మాన్ చురకలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఇంట్లోనే ఎండు ద్రాక్షను తయారు చేసుకోవడం ఎలాగంటే?

ఒక పాత్రలో నీళ్లు తీసుకుని మరిగించాలి. ఇందులో కేజీ ద్రాక్ష పండ్లను వేసి ఉబ్బినంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత వడబోసి కాటన్ క్లాత్‌లో వేసి ఎండలో ఆరబెట్టాలి. ఇలా నాలుగు రోజుల పాటు ఆరబెడితే హోమ్ మేడ్ కిస్‌మిస్ రెడీ.

New Update
raisins making

raisins making Photograph: (raisins making)

కిస్‌మిస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. అయితే వీటిని స్వీట్లు, తీపి పదార్థాలు ఇలా ప్రతీ దాంట్లో కూడా వేస్తారు. మరికొందరు వీటిని నానబెట్టి పరగడుపున తింటారు. అయితే మార్కెట్‌లో దొరికే కిస్‌మిస్‌లో కల్తీ ఉంటుంది. వీటివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎలాంటి కల్తీ లేకుండా సహజంగా ఇంట్లోనే కిస్‌మిస్‌ను ఈజీగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం.

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

ద్రాక్ష పండ్లు మునిగేంత వరకు..

కిస్‌మిస్‌ను తయారు చేయడానికి కేజీ ద్రాక్ష, నీరు ఉంటే సరిపోతుంది. ఒక వెడల్పు ఉన్న గిన్నెలో ద్రాక్ష పండ్లు వేసి, మునిగేంత వరకు నీళ్లు, ఉప్పు వేసి ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత వాటిని శుభ్రం చేసి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి సగానికి పైగా నీళ్లు వేయాలి. నీరు మరుగుతున్నప్పుడు శుభ్రం చేసుకున్న ద్రాక్ష వేసుకుని ఓ 5 నిమిషాల పాటు ఉడికించాలి. 

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

అవి కాస్త ఉబ్బిన వెంటనే స్టవ్​ ఆఫ్​ చేసి వెంటనే వడకట్టాలి. వీటిని కాటన్ క్లాత్‌లో వేసుకుని ఎండలో ఉంచాలి. రెండు లేదా ఆరు రోజుల వరకు ఎండలో ఉంచితే అవి ఎండుతాయి. వీటిపై ఎలాంటి దుమ్ము, ధూళీ పడకుండా ఉండటానికి పల్చటి క్లాత్ కప్పాలి. ​అంతే ఇక కిస్‌మిస్ రెడీ అయినట్లే.

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment