Bird Flu: కరోనా కంటే డేంజరెస్‌ బర్డ్‌ ఫ్లూ..కొత్త వేరియంట్‌ గుర్తింపు

బర్డ్‌ ఫ్లూను ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌గా పిలుస్తారు. కరోనా కంటే డేంజరెస్‌ బర్డ్‌ ఫ్లూ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వ్యక్తిని పరీక్షించిన వైద్యులు హెచ్5ఎన్1 వైరస్ డీ1.1 జన్యురూపానికి చెందినదని గుర్తించారు.

New Update
Australia: భారత్‌ నుంచి ఆస్ట్రేలియాకు బర్డ్‌ఫ్లూ కేసు-డబ్ల్యూహెచ్‌వో

Bird Flu

Bird Flu: కరోనా మానవాళిని వణికించింది. కొత్త కొత్త వేరియంట్లతో విరుచుకుపడింది. ఎంతో మంది ఈ మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం దీని నుంచి కోలుకుంటుండగా మరో పిడుగులాంటి వార్త భయభ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా కంటే డేంజరెస్‌ బర్డ్‌ ఫ్లూ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని లూసియానాలో ఒక రోగికి ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా (బర్డ్ ఫ్లూ) తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించారు. ఇది అమెరికాలో గుర్తించిన తొలి తీవ్రమైన కేసు అని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్-సీడీసీ ప్రకటించింది. ఈ కేసుతో కలిపి అమెరికాలో బర్డ్ ఫ్లూ సోకిన వారి సంఖ్య 2024 సంవత్సరంలో 61కి చేరింది.

ఇది కూడా చదవండి: చలికాలంలో ముఖంపై దుప్పటి కప్పుకుని నిద్రపోతే ఏమవుతుంది?

జన్యురూపానికి చెందినదని..

ప్రస్తుతం ఈ బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వ్యక్తిని పరీక్షించిన వైద్యులు హెచ్5ఎన్1 వైరస్ డీ1.1 జన్యురూపానికి చెందినదని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇక ఈ H5N1 వైరస్ డీ1.1 రకం జన్యురూపం ఇటీవల అమెరికాలోని అడవి పక్షులు, ఫౌల్ట్రీ ఫామ్‌లలో కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. వాషింగ్టన్ రాష్ట్రంతో పాటు కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లో మానవ కేసుల్లో ఈ జన్యురూపాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. అయితే బర్డ్ ఫ్లూ మానవుడి నుంచి మానవుడికి వ్యాపించడాన్ని సూచించే తగిన ఆధారాలు ఇప్పటివరకు లభ్యం కాలేదని అధికారులు చెప్పడం కొంత ఊరట ఇచ్చే అంశం. బర్డ్‌ ఫ్లూను సాధారణంగా ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌గా పిలుస్తారు. 

ఇది కూడా చదవండి: రోజులో ఎన్ని వాల్‌నట్‌లు తినాలి?..ప్రయోజనమేంటి?

ఈ ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా సాధారణంగా పక్షులు, కోళ్లకు వస్తుంది. ఇన్‌ఫ్లూయంజా టైప్‌-ఏలో 12 కుపైగా వైరస్‌లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో హెచ్5ఎన్8, హెచ్5ఎన్1 రకాలకు చెందిన బర్డ్‌ ఫ్లూ మాత్రం పౌల్ట్రీ ఉత్పత్తులైన కోళ్లు, బాతులతో పాటు టర్కీ కోళ్లకు వస్తాయని అంటున్నారు. పక్షుల్లో ప్రాణాంతకంగా ఉన్న ఈ H5N1 వేరియంట్‌ను డబ్ల్యూహెచ్‌వో 1997లో తొలిసారి గుర్తించింది. ఇక భారత్‌లో మాత్రం 2006లో ఈ బర్డ్ ఫ్లూ వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత 2019లో తొలిసారి మనుషుల్లో గుర్తించారు. భారత్‌లో ప్రతి సంవత్సరం వచ్చే విదేశీ వలస పక్షుల ద్వారా బర్డ్‌ ఫ్లూ వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇది కూడా చదవండి: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Summer Tips: సమ్మర్ లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే డేంజర్

వేసవి కాలంలో ఎండ తీవ్రత వల్ల డీహైడ్రేషన్, అలసట, చర్మ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇలాంటి సమయంలో కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.

New Update
summer tips

summer tips

Summer Tips: వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరగడం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎండ తీవ్రత వల్ల డీహైడ్రేషన్, అలసట, చర్మ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు.  అందుకే ఈ కాలంలో సరైన జీవనశైలి అలవాటు చేసుకోవాలి.

సరైన జీవనశైలి అలవాట్లు

  • వేసవిలో నీటిని ఎక్కువగా తీసుకోవడం చాలా అవసరం. రోజుకు కనీసం 3–4 లీటర్లు నీళ్లు తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచవచ్చు. మజ్జిగ, కొబ్బరి నీరు, తాటిపండు, దోసకాయ వంటి తండ్రీ ఆహార పదార్థాలు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. 
  • బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తెలుపు లేదా లేత రంగుల దుస్తులు ధరించడం మంచిది. టోపీలు, గ్లాసెస్ వంటివి వాడడం వలన ఎండ నుంచి రక్షణ లభిస్తుంది. సూర్యుడి కిరణాలు ఎక్కువగా ఉండే మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉండటం ఆరోగ్యానికి మంచిది. ఉదయం లేదా సాయంత్రం మాత్రమే అవసరమైన పనుల కోసం బయటకు వెళ్లడం ఉత్తమం. 
  • వేసవిలో ఆహారం మితంగా తీసుకోవడం, పచ్చి కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు. వేసవిని సురక్షితంగా, ఆరోగ్యంగా గడపాలంటే ఈ మార్పులు అనుసరించడం అవసరం.

Summer Tips: శరీరంలో నీటి కొరత ఉంటే ఈ రోగాలు చుట్టుముడతాయి.. జాగ్రత్త!

 నిద్ర, విశ్రాంతి 

  • వేసవిలో వేడి ప్రభావం శరీర శక్తిని తగ్గిస్తుంది. ఎక్కువ ఉష్ణోగ్రతల కారణంగా శరీరం  త్వరగా అలసిపోతుంది.  అలాంటి సమయంలో శరీరానికి తగిన విశ్రాంతి చాలా ముఖ్యం. ప్రతిరోజూ కనీసం 7–8 గంటల నిద్ర తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. 
  • తీవ్ర మైన ఎండల  సమయంలో ఎయిర్ కండిషనర్ లేదా ఫ్యాన్ ఉపయోగించడం వల్ల నిద్రలో అంతరాయం కలగదు. మధ్యాహ్న సమయంలో 15–30 నిమిషాలు విశ్రాంతి తీసుకోవడం శరీరాన్ని ఫ్రెష్‌గా ఉంచుతుంది. 
  • వేసవిలో ఎక్కువ పని చేయడం వల్ల తలనొప్పులు, నీరసం వంటి సమస్యలు ఎదురవుతాయి. వాటిని నివారించాలంటే తగినంత నిద్ర చాలా అవసరం. 
  • శరీరం మానసికంగా, శారీరకంగా రిఫ్రెష్ అవ్వాలంటే విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి. వేడి ప్రభావం తగ్గించడానికి గది శుభ్రంగా ఉంచడం,   ప్రాపర్ వెంటిలేషన్  ఉండేలా చూసుకోవాలి.  వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర,   విశ్రాంతిని నిర్లక్ష్యం చేయకూడదు.

latest-news | telugu-news | summer-tips | life-style

Advertisment
Advertisment
Advertisment