Bird Flu In Chickens: బర్డ్ ఫ్లూ సోకిన కోడి కూర తింటే.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?

బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను తింటే.. మనుషులకు బర్డ్ ఫ్లూ సోకుతుందా అనే సందేహం చాలామందిలో ఉండే ఉంటుంది. బర్డ్ ఫ్లూ సోకిన కోడి మాంసం తినడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అయినప్పటికీ మాంసం బాగా ఉడికించి తినవచ్చు.

New Update
bird flue

bird flue Photograph: (bird flue)

Bird Flu In Chickens: చికెన్ లవర్స్ వారానికి రెండుసార్లు కంటే ఎక్కువే నాన్‌ వెజ్ తింటుంటారు. గతంలో నాటు కోళ్లు మాత్రమే ఉండేవి. ఫౌల్ట్రీ పరిశ్రమ డెవలప్ అయిన తర్వాత చికెన్ తినేవారి సంఖ్య పెద్ద ఎత్తున పెరిగింది. అయితే ఈ ఫౌల్ట్రీ పరిశ్రమలో పెంచే కోళ్లను వ్యాక్సిన్స్ వేసి, స్టెరాయిడ్స్ ఇచ్చి పెంచుతుంటారు. వీటికి బ్లడ్ ఫ్లూ సోకే అవకాశాలు ఉన్నాయి. బర్డ్ ఫ్లూ సోకితే పౌల్ట్రీ ఫాంలో కోళ్లు చనిపోతాయి. కోట్లలో రైతులు నష్టపోతుంటారు. అయితే బర్డ్ ఫ్లూ ఎక్కువగా వేసవిలో సోకుతుంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పౌల్ట్రీ ఫాం రైతులు భారీ నష్టపోతున్నారు. 15వేలకు పైగా కోళ్లు చనిపోయాయి. ఇది పక్షుల నుంచి మనుషులకు కూడా వ్యాపిస్తోంది. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను తింటే.. మనుషులకు బర్డ్ ఫ్లూ సోకుతుందా అనే సందేహం చాలామందిలో ఉండే ఉంటుంది. ఈ విషయంలో డాక్టర్లు ఏం అంటున్నారో తెలుసుకుందాం..

Also Read: Cummins: కోహ్లీ ఇజ్జత్ తీసిన ఆసీస్ కెప్టెన్.. ఛాంపియన్ ట్రోఫీ నుంచి ఔట్!

బర్డ్ ఫ్లూ సోకిన కోడి మాంసం, గుడ్లు వల్ల ఈ వ్యాధి సోకుతుందేమోనని ప్రజలు భయందోళన చెందుతున్నారు. నిజానికి, బర్డ్ ఫ్లూను ఏవియన్ ఇన్‌ఫ్లూఎంజా అని కూడా పిలుస్తారు. ఇది పక్షులకే కాకుండా మనుషులకు, ఇతర జంతువులకు కూడా సోకే వైరస్. దీంతో బర్డ్ ఫ్లూ సోకిన కోడి మాంసం తినడం సురక్షితమేనా? అనే సందేహం అందరికీ వస్తుంది. బర్డ్ ఫ్లూ సోకిన కోడి మాంసం తినడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అయినప్పటికీ మాంసం బాగా ఉడికించి తినవచ్చు. సరిగా ఉడికించకపోతే వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి వంట చేసేటప్పుడు మరింత శుభ్రత పాటించాలి. పచ్చి చికెన్‌ని శుభ్రం చేసిన తర్వాత చేతులు, పాత్రలు శుభ్రం చేసుకోవాలి. అలాగే గుడ్లు వండేటప్పుడు కూడా ఈ జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. అనారోగ్యంతో ఉన్న పక్షులను లేదా కోళ్లను ముట్టుకోకూడదు. వీటికి వీలైనంత దూరంగా ఉండాలి.

Also Read: Delhi: ఢిల్లీ ఎన్నికల పోలింగ్  షురూ..కేజ్రీవాల్ పై హర్యానాలో ఎఫ్ ఐఆర్

బర్డ్ ఫ్లూ లక్షణాలు..

బర్డ్ ఫ్లూ వైరస్‌ సోకిన 2 నుండి 8 రోజుల తర్వాత దీని లక్షణాలు కనిపిస్తాయి. జలుబు వల్ల ముక్కు మూసుకుపోవడం, గొంతు నొప్పి, దగ్గు వంటి శ్వాసకోశ లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి తలనొప్పి, జ్వరం, అలసట, కండరాల నొప్పులు, వికారం, వాంతులు, విరేచనాలు వంటి జీర్ణ లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ తీవ్రం అధికంగ ఉంటే అవయవ వైఫల్యం, న్యుమోనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయి.

Also Read: పాపం పెళ్లై మూడు నెలలు కూడా కాలేదు..ఎంతకు తెగించార్రా!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vaishakha Amavasya వైశాఖ అమావాస్య రోజున.. ఈ రాశుల వారు ఇవి దానం చేస్తే అన్నీ శుభాలే !

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 27న వైశాఖ అమావాస్య వస్తుంది. ఈరోజు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అయితే వైశాఖ అమావాస్య రోజున రాశిచక్రం ప్రకారం కొన్ని చర్యలు  చేయడం ద్వారా  శుభ ఫలితాలను కలిగిస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.. 

New Update
Vaishakha Amavasya

Vaishakha Amavasya

Vaishakha Amavasya హిందూ మతవిశ్వాసాల ప్రకారం వైశాఖ అమావాస్య ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఏడాదిలో 12 అమావాస్య తిథులు ఉంటాయి. అందులో వైశాఖ మాసంలో వచ్చే అమావాస్యను వైశాఖ అమావాస్య అంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 27 ఉదయం 4: 28 గంటలకు మొదలై 28 తెల్లవారుజామున 1: 02 గంటలకు ముగుస్తుంది. ఈ ప్రత్యేకమైన రోజున విష్ణువును పూజిస్తారు. అలాగే దానధర్మాలకు కూడా ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. పితృదేవులకు పిండం, తర్పణం కూడా చేస్తారు. అయితే పితృదేవుల ఆత్మశాంతి కోసం  వైశాఖ అమావాస్య రోజున రాశిచక్రం ప్రకారం కొన్ని చర్యలు  చేయడం ద్వారా  శుభ ఫలితాలను కలిగిస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.. 

రాశి చక్రం ప్రకారం చేయాల్సిన పనులు 

మేష రాశి 

 మేష రాశి వారు వైశాఖ అమావాస్య రోజున  తమ పూర్వీకులకు నీరు, షర్బత్, చల్లని వస్తువులను దానం చేయడం శుభ ఫలితాలను కలిగిస్తుంది. 

వృషభ రాశి 

వైశాఖ అమావాస్య రోజున వృషభ రాశి వారు డబ్బు, ఆహారాన్ని దానం చేయడం ద్వారా తమ పూర్వీకులను ప్రసన్నం చేసుకుంటారు. అలాగే శుభఘడియలు కూడా మొదలవుతాయి. 

కర్కాటక రాశి 

ఈ ప్రత్యేకమైన రోజున కర్కాటక రాశి వారు తెల్లటి ఆహార పదార్థాలను, ధనాన్ని ఎక్కువగా దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శుభఫలితాలు కలగడంతో పాటు పూర్వీకుల ఆత్మ శాంతిస్తుంది. 

సింహరాశి 

సింహ రాశివారు బెల్లం, పప్పుదినుస్సులు, తేనే దానం చేయవచ్చు. వైశాఖ అమావాస్య రోజున ఈ దానాలు సింహరాశి వారికి శుభప్రదంగా పరిగణించబడతాయి. 

కన్య రాశి 

వైశాఖ అమావాస్య రోజున కన్య రాశి వారు పూర్వీకుల ఆనందం కోసం నెయ్యితో తయారు చేసిన ఆహార పదార్థాలను దానం చేయాలి. 

తులారాశి 

తులారాశిలో జన్మించినవారు బ్రాహ్మణులకు భోజనం పెట్టడం, తెల్లటి వస్త్రాలను దానం చేయడం ద్వారా శుభాలు చేకూరుతాయి. 

వృచ్చిక రాశి 

వృచ్చిక రాశివారు బెల్లం, ఎర్రటి బట్టలు దానం చేస్తే పూర్వీకుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

telugu-news | latest-news | life-style | zodiac-signs

Advertisment
Advertisment
Advertisment