Air Pollution: వాయు కాలుష్యంతో కూడా మధుమేహం వస్తుందా?

చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వలన మధుమేహం వేగంగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న కాలుష్యం ఆరోగ్యాన్ని అనేక విధాలుగా దెబ్బతీయటంతోపాటు మధుమేహ కొన్ని అధ్యయనాల్లో తేలిందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Air Pollution

Air Pollution

Air Pollution: ఢిల్లీతో పాటు పలు పరిసర ప్రాంతాల్లో కాలుష్య స్థాయి ప్రమాదకర స్థాయిలో ఉంది. AQI 400 కంటే ఎక్కువగా నమోదవుతోంది. కాలుష్యం వల్ల శరీరంలో అనేక వ్యాధులు వస్తాయి. కానీ కాలుష్యం వల్ల మధుమేహం కూడా వస్తుందని అంటున్నారు నిపుణులు. దీనిపై ఓ పరిశోధన కూడా చేశారు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం కారణంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఉంది. కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆస్పత్రుల్లోని ఓపీడీలో శ్వాసకోశ రోగుల రద్దీ నెలకొంది. పెరుగుతున్న కాలుష్యం ఆరోగ్యాన్ని అనేక విధాలుగా దెబ్బతీస్తుంది. ఇది ఆస్తమా, ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. చెడు గాలి కారణంగా గుండెపోటు కేసులు కూడా పెరుగుతాయని వైద్యులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: Heart Healthy: చలికాలంలో గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పని చేయండి

వ్యాధికి ప్రధాన కారణం:

అయితే ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే కాలుష్యం కారణంగా ప్రజలు మధుమేహ బాధితులుగా కూడా మారవచ్చని కొన్ని అధ్యయనాల్లో తేలింది. మధుమేహం అనేది జీవనశైలికి సంబంధించదిన వ్యాధి. ఇది శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు సంభవిస్తుంది. ICMR ప్రకారం భారతదేశంలో 10 కోట్ల మందికిపైగా ఈ వ్యాధి ఉన్న రోగులు ఉన్నారు. ఈ వ్యాధిలో రెండు రకాలు ఉన్నాయి. జన్యుపరమైన కారణాల వల్ల రెండు రకాల మధుమేహాలు వస్తాయి. చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వలన కలుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో మధుమేహం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యాధి చిన్న వయసులోనే వస్తోంది. ఊబకాయం పెరగడం కూడా ఈ వ్యాధికి ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. థెరప్యూటిక్ అడ్వాన్సెస్ ఇన్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం ప్రచురించిన ఒక అధ్యయనంలో వాయు కాలుష్యంతో మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని అంటున్నారు.

ఇది కూడా చదవండి: జ్ఙాపకశక్తిని 10 రెట్లు పెంచే అద్భుతమైన ఆహారాలు

పర్టిక్యులేట్ మ్యాటర్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలు శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇవి రక్తంలో కలిసిపోతాయని, ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుందని, దీంతో శరీరం చక్కెర స్థాయిని నియంత్రించడం కష్టతరం చేస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఇది టైప్-2 మధుమేహం ముప్పును పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. కాలుష్యంలో ఉన్న PM 2.5 కణాలు ఊపిరితిత్తులలోకి వెళ్లి అక్కడ స్థిరపడతాయి. ఇది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుందని వైద్యులు అంటున్నారు. కాలుష్యంలోని కర్బన సమ్మేళనాలు రక్తంలో కరిగిపోవడం ద్వారా ఇన్సులిన్ నిరోధకతను కూడా కలిగిస్తాయని, ఇది కూడా షుగర్ లెవెల్ పెరగడానికి కారణం కావచ్చని చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: జీవితాంతం కళ్లు మూసుకోని జీవి ఏదో తెలుసా?

 

ఇది కూడా చదవండి:  Maoist: మావోయిస్టుల రివేంజ్.. ఇన్ఫార్మర్లను గొడ్డలితో నరికి చంపి..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Cracked heels: వేసవిలో పగిలిన మడమలకు చక్కటి పరిష్కారం

అధిక వేడి, పొడి బారిన చర్మం, తగిన మాయిశ్చరైజింగ్ లేకపోవడం, సరైన పాదరక్షలు ధరించకపోతే మడమలు పగులుతాయి. మడమలు పగలకుండా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను రాస్తే మంచిది. కొబ్బరి నూనెను మసాజ్, కాటన్ సాక్స్ ధరించడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.

New Update
Cracked heels

Cracked heels

Cracked heels: వేసవి కాలంలో చర్మానికి ప్రత్యేక సంరక్షణ అవసరం. ముఖ్యంగా ముఖం, చేతుల్ని శుభ్రంగా ఉంచే ప్రయత్నంలో పాదాలను నిర్లక్ష్యం చేయడం వల్ల మడమల పగుళ్ల సమస్య ఎదురవుతుంది. ఇది శీతాకాలంలో మాత్రమే కాదు వేసవిలో కూడా సాధారణంగా కనిపిస్తుంది. అధిక వేడి, పొడి బారిన చర్మం, తగిన మాయిశ్చరైజింగ్ లేకపోవడం, సరైన పాదరక్షలు ధరించకపోవడం వంటివి ప్రధాన కారణాలు మడమలు పగలడానికి దారితీస్తాయి. మడమలు పగలకుండా ఉండేందుకు రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను రాయడం ఎంతో మంచిది. 

చర్మం మృదువుగా..

గోరు వెచ్చని నీటితో పాదాలను శుభ్ర పరిచిన తర్వాత కొబ్బరి నూనెను మసాజ్ చేసి, కాటన్ సాక్స్ ధరించడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే మాయిశ్చరైజింగ్ లక్షణాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. ఇక తేనెను కూడా పాద సంరక్షణంలో ఉపయోగించవచ్చు. గోరు వెచ్చని నీటిలో తేనె కలిపి పాదాలను 15-20 నిమిషాలు నానబెట్టడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. తర్వాత స్క్రబ్ చేసి, క్రీమ్ రాస్తే మడమల పరిస్థితి మెరుగవుతుంది.

ఇది కూడా చదవండి: ప్రోటీన్ పెరగడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయా?

కలబంద జెల్‌, గ్లిజరిన్‌ను కలిపి రాత్రిపూట అప్లై చేయడం వల్ల మడమల నొప్పి తగ్గి, చర్మం నయం అవుతుంది. కలబందలోని సహజ హీలింగ్ లక్షణాలు చర్మాన్ని లోపలి నుంచి పోషిస్తాయి. ఇంకా పండిన అరటిపండును కొబ్బరి నూనెతో కలిపి మడమలపై అప్లై చేస్తే అది సహజ మాయిశ్చరైజర్‌లా పని చేస్తుంది. వారానికి 2-3 సార్లు ఇలా చేస్తే పగుళ్లు తగ్గిపోతాయి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు వేసవిలో మడమలను ఆరోగ్యంగా, మృదువుగా ఉంచడానికి ఎంతో ఉపయోగపడతాయి. మడమల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వీటిపై కూడా ముఖం లాగా శ్రద్ధ చూపడం అవసరం.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: వేసవిలో చర్మ సమస్యలకు వేప ఆకులతో చెక్‌


( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )

Advertisment
Advertisment
Advertisment