Susheela: లెజండరీ సింగర్‌ సుశీలకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

లెజండరీ సింగర్ పి. సుశీల అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఆమెకు తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సుశీల పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.

New Update
Susheela: లెజండరీ సింగర్‌ సుశీలకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

లెజండరీ సింగర్, పద్మభూషన్ గ్రహీత పి. సుశీల అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఆమెకు తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. 86 ఏళ్ల వయసున్న సుశీల గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. సుశీల పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

Also Read: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకనుంచి ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు

మందులతో ఆమెకు కడుపు నొప్పి తగ్గిపోతుందని పేర్కొన్నారు. సుశీల త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలాఉండగా.. సుశీల ఎన్నో అద్భుత గీతాలను ఆలపించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు మొత్తం 9 భాషాల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. సావిత్రి, పద్మిని, సరోజాదేవి వంటి దిగ్గజ నటీమణులకు పాటలకు పాడారు. ఉష్రేష్ మన్మాన్ సినిమాలోని లైక్‌ పాల్ అనే పాటకు ఆమె తొలిసారిగా ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్‌గా జాతీయ అవార్డు గెలుచుకున్నారు.

Also Read: గుడ్‌న్యూస్.. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించే అవకాశం\

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG News: రేవంత్ సర్కార్ ను కూల్చడానికి రంగం సిద్ధం.. BRS ఎమ్మెల్యే సంచలన ప్రకటన!

రేవంత్ సర్కార్‌ను కూల్చేందుకు రంగం సిద్ధమైందంటూ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగు చెందారన్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొని గవర్నమెంట్ కూల్చాలని కోరుతున్నారంటూ దుమారం రేపారు.

New Update

TG News: రేవంత్ సర్కార్‌ను కూల్చేందుకు రంగం సిద్ధమైందంటూ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిల్డర్లు, పారిశ్రామి కవేత్తలు కాంగ్రెస్ పాలనతో విసుగు చెందారని, వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని అన్నారు. అంతేకాదు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తాము భరిస్తామంటున్నారంటూ దుమారం రేపారు. 

కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది..

ఈ మేరకు పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్ గా ఉంటే కుదరడం లేదు. దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ తనదైన స్టైల్ లో విరుచుకుపడ్డారు. సర్పంచులకు బిల్లులు రాక లబో దిబోమని మొత్తుకుంటున్నారని, ఇళ్లు, డ్రైనేజీలు కట్టినవారు బిల్లులు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారన్నారు. తెలంగాణ పది జిల్లాల్లో దుబ్బాక అంత దారుణంగా ఏదీ లేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

పొంగులేటి కౌంటర్..

అయితే ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ పై ఘాటుగా స్పందించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 'ప్రభుత్వాన్ని కూల్చాలన్నదే తండ్రీకొడుకుల ఆలోచన. గవర్నమెంట్ కూల్చి తండ్రీకొడుకులు ఆ కుర్చీలో కూర్చోవాలన్నదే ఆలోచన. ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్‌ఎస్ నేతలు పదేపదే అంటున్నారు. దమ్ముంటే ఎంతమంది ఎమ్మెల్యేలను కొంటారో కొనండి. కేసీఆర్ ఆత్మ కొత్త ప్రభాకర్ రెడ్డి. తాటాకు చప్పుళ్లకు ప్రభుత్వం భయపడదు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా భూభారతి అమలు చేసి తీరుతాం' అని పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. 

kotta-prabhakar | cm revanth | brs | congress | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment