IT Jobs: ఐటీలో చేరాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. 90 వేల కొత్త ఉద్యోగాలు

2024-2025 ఆర్థిక ఏడాదిలో దాదాపు 90 వేల మంది కొత్తవారిని పలు దిగ్గజ ఐటీ కంపెనీలు చేర్చుకోనున్నాయి. టీసీఎస్‌ 40 వేలు, ఇన్ఫోసిస్‌ 15-20 వేలు, HCL 10 వేలు, విప్రో 10-12 వేలు, టెక్‌ మహింద్ర 6 వేల మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగ అవకాశాలివ్వనున్నాయి.

New Update
IT Jobs: ఐటీలో చేరాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. 90 వేల కొత్త ఉద్యోగాలు

ప్రస్తుతం ఐటీ రంగంలో ఆర్థికమాంద్యం కొనసాగతున్న సంగతి తెలిసిందే. చాలా కంపెనీలు కొత్తవారిని ఎక్కువగా చేర్చుకోవడం లేదు. పలు కంపెనీలు ఉన్న ఉద్యోగాలు కూడా తీసేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఐటీలో చేరాలనుకునేవారికి పలు కంపెనీలు గుడ్‌న్యూస్ తెలిపాయి. ఈ ఆర్థిక ఏడాది పలు దిగ్గజ ఐటీ కంపెనీలు 90 వేల మంది కొత్తవారికి ఉద్యోగాలు కల్పించనున్నాయి.

Also Read:  భారీ వర్షాలు.. ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న 50 మంది యాత్రికులు

టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ (TCS) 2024-25 ఆర్థిక ఏడాదిలో 40 వేల మంది కొత్తవారికి ఉద్యోగ అవకాశాలివ్వాలని ప్లాన్ చేస్తోంది. అలాగే ఇన్ఫోసిస్‌ కూడా ఈ ఆర్థిక ఏడాది 15 వేల నుంచి 20 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. హెచ్‌సీఎల్‌ టెక్‌ కంపెనీ 10 వేల మంది కొత్తవారిని క్యాంపసెస్‌ నుంచి తీసుకోనుంది. అలాగే విప్రో కంపెనీ కూడా ఈ ఆర్థిక ఏడాది 10 వేల నుంచి 12 వేల మంది ఫ్రెషర్స్‌ను చేర్చుకోనుంది. మరోవైపు టెక్‌ మహింద్రా కూడా ఈసారి 6 వేల మంది ఫ్రెషర్స్‌ను తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించింది. దీంతో 2024-2025 ఆర్థిక ఏడాదికి దాదాపు 90 వేల మంది కొత్తవారికి ఐటీలో ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

Also Read: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మృతి..

ఈ ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికంలో టీసీఎస్‌ 5,452 మందికి మాత్రమే ఉద్యోగ అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం ఈ కంపెనీలో 6,06,998 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇక ఇన్ఫోసిస్‌ 2023-2024 ఆర్థిక ఏడాదిలో 11,900 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకుంది. 2022-23లో 50 వేల మందికిపైగా తమ కంపెనీలో చేర్చుకోగా.. 2023-2024 ఏడాదికి ఏకంగా 76 శాతం తగ్గించింది. అయితే ఈసారి తాము 20 వేల మంది వరకు కొత్తవారిని తీసుకుంటామని ఇన్ఫోసిస్ చీఫ్‌ ఫైనాన్షిల్ అధికారి జయేష్‌ సంగ్‌రాజ్క తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

All India Civil Services ఇప్పటివరకు ఫోన్ వాడలేదు.. ఆల్ ఇండియా సివిల్స్ లో తెలంగాణ అమ్మాయికి 11వ ర్యాంకు

వరంగల్ కి చెందిన సాయి శివాని అనే విద్యార్థిని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవలే తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లోనూ సాయిశివాని రాష్ట్రస్థాయిలో 21వ ర్యాంకు, జోనల్ 1లో 11వ ర్యాంకు సాధించింది.

New Update

All India Civil Services సాధారణంగా చాలామంది సివిల్స్ క్లియర్ చాలా కష్టమని భావిస్తారు. కానీ కస్టపడి చదివితే సాధ్యం కానిది ఏదీ ఉండదు అని మరో సారి నిరూపించింది ఈ అమ్మాయి. తెలుగు తేజం సాయిశివాని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. 

Also Read: Viral News: ఫోన్ తీసుకుందని.. టీచర్‌ను చెప్పుతో కొట్టి, ల*జే అంటూ దాడిచేసిన విద్యార్థిని: (వీడియో)

సివిల్స్ లో ఆల్ ఇండియా 11వ ర్యాంకు 

వరంగల్ కి చెందిన సాయి శివాని ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తిచేసిన సాయి శివాని.. ఆ తర్వాత సివిల్స్ కోసం ప్రిపేర్ అవడం మొదలు పెట్టింది. కలెక్టర్  కలతో అహర్నిశలు కష్టపడింది. ప్రణాళికతో రోజుకు 12 గంటలు చదివింది. మొదటి సారి విఫలమైనా.. నిరాశ చెందలేదు. మళ్ళీ కష్టపడి చదివింది. రెండో ప్రయత్నంలో ఆల్ ఇండియా స్థాయిలో  11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది.  2023లో ఐదు మార్కులతో సాయిశివాని ప్రిలిమ్స్ మిస్సయింది. తిరిగి 2025లో తన కల నెరవేర్చుకుంది. 

Also Read: Pahalgam Attack: పహల్గాంలో నా బర్త్ డే వేడుకలు, షూటింగ్ కూడా.. విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్!

ఈ సందర్భంగా సాయిశివాని మాట్లాడుతూ.. ఇంతవరకు ఫోన్ వాడకపోవడం.. సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే తన కల నెరవేరడానికి కారణమని తెలిపింది. కలెక్టర్ కావాలనే లక్ష్యంతో కఠోర సాధన చేశాను. రోజుకు 12 గంటలు చదివాను. ఒత్తిడిని జయించడానికి యోగా, భగవద్గీత చదివేదాన్ని. ఈ విజయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సహకారం మరువలేనిది అని చెప్పింది. 

latest-news

Also Read: AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

Also Read: Viral Video అందరి ముందు భుజం పై నుంచి విజయ్ చేయి తీసేసిన విద్యార్ధి.. ఏం జరిగిందంటే

Advertisment
Advertisment
Advertisment