Hyderabad : లాస్య నందితకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు జరిపించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈరోజు సాయంత్రం మారేడ్ పల్లి శ్మశానవాటికలో నందిత అంత్యక్రియలు జరగనున్నాయి.

New Update
Hyderabad : లాస్య నందితకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

MLA Lasya Nanditha : బీఆర్ఎస్(BRS) ఎమ్మల్యే లాస్య నందిత(Lasya Nanditha) పార్థివ దేహం ఇంటికి చేరుకుంది. ఆమెకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అదేశాలు జారీ చేశారు. మారేడ్ పల్లి స్మశాన వాటికలో ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు జరుగుతాయని.. ఈరోజు సాయంత్రం లోపు లాస్య నందిత అంత్యక్రియలు పూర్తి అవుతాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి సాయన్న(Sayanna) అంత్య క్రియలు జరిగిన స్మశాన వాటికలోనే లాస్య నందిత అంత్యక్రియలు కూడా జరుపతామని చెప్పారు.

లాస్య ఇంటికి నేతలు..

లాస్య నందిత ఇంటికి నేతలు వరుసగా వస్తున్నారు. ఆమె కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha), మాజీ మంత్రి హరీష్‌ రావు(Ex. Minister Harish Rao) లు లాస్య ఇంటికి చేరుకున్నారు. ఆమె కుటుంబసభ్యులను కవిత ఓదారుస్తున్నారు. మరికాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్‌ కూడా లాస్య ఇంటికి వెళ్ళనున్నారు. లాస్య భౌతికకాయానికి ఆయన నివాళులు అర్పించనున్నారు. అలాగే మధ్యాహ్నం తర్వాత ఎమ్మెల్యే లాస్య కుటుంబసభ్యలను సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించనున్నారు. మాజీ మంత్రి తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డిలు కూడా లాస్య ఇంటికి చేరుకున్నారు. మరోవైపు లాస్య నందిత ఇంటి వద్దకు అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో లాస్య ఇంటి దగ్గర పోలీసులు భద్రతను పెంచారు. లాస్య నందిత ఇంటికి చుట్టు పక్కల రోడ్లు క్లోజ్ చేశారు.

Also Read : America : హైపోథర్మియాతోనే చనిపోయాడు..భారత విద్యార్ధి మృతికి కారణాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: 90 రోజులు టారీఫ్ లకు బ్రేక్..అంతా ఒట్టిదే..వైట్ హౌస్

ట్రంప్ టారీఫ్ ల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు సుంకాలను ఆపేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే వాటిని వైట్ హౌస్ కొట్టిపడేసింది. టారీఫ్ లను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 

New Update
us

White House

 ప్రతీకార సుంకాలను ఆపేది లేదని తేల్చి చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వైట్ హౌస్. ఏది ఏమైనా టారీఫ్ లను కొనసాగిస్తామని చెప్పారు. మా విధానంలో ఎటువంటి మార్పూ ఉండదు అన్నారు. అయితే ఏ దేశమైనా టారీఫ్ ల మీద చర్చకు వస్తే తాము సుముఖంగా ఉన్నామని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేయాలని ఆలోచిస్తున్నారనే వార్తలను వైట్ హౌస్ ఖండించింది. దానిపై వస్తున్న వార్తలన్నీ నకిలీవి అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. 

 

ఒక్క పోస్ట్ తో అంతా తారుమారు..

నిన్న ఎక్స్ లో వాల్టర్ బ్లూమ్ బెర్గ్, నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హాసెట్,  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా మినహా అన్ని దేశాలకు 90 రోజుల సస్పెన్షన్ గురించి ఆలోచిస్తున్నారని పోస్ట్ లు వచ్చాయి. దీంతో మార్కెట్లో గందరగోళం మొదలైంది.  ఈ ఒక్క పోస్ట్ తో స్టాక్ మార్కెట్ హెచ్ థగ్గులకు గురైంది. దీని గురించే ఈరోజు వైట్ హౌస్  మాట్లాడింది. హాసెట్ చెప్పినదాన్ని జనాలు తప్పుగా అర్ధం చేసుకున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ట్రంప్ కు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే అసలు ఈ చర్చ అంతా బిలియనీర్ హెడ్జ్ ఫండ్ పెట్టుబడిదారుడు, ట్రంప్ మద్దతుదారుడు అయిన బిల్ అక్మాన్ ఆదివారం ట్రంప్ అసమాన సుంకాల ఏర్పాట్లను పరిష్కరించడానికి, దేశానికి గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించడానికి "90 రోజుల గడువు" అమలు చేయాలని సూచించిన తర్వాత చర్చ ప్రారంభమైంది.

 today-latest-news-in-telugu | usa | donald trump tariffs | white-house

Also Read: RCB VS MI: ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే...బెంగళూరు తన్నుకుపోయింది

Advertisment
Advertisment
Advertisment