Lasya Nandita : వెంటాడిన వరుస ప్రమాదాలు..మూడోసారి మృత్యుఒడిలోకి

ఔటర్ రింగ్ రోడ్డు మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఆమెను వరుస ప్రమాదాలు వెంటాడాయని...రెండు సార్లు తప్పించుకున్న లాస్య మూడోసారి మాత్రం తప్పించుకోలేకపోయిందని చెబుతున్నారు కుటుంబసభ్యులు.

New Update
Lasya Nandita : వెంటాడిన వరుస ప్రమాదాలు..మూడోసారి మృత్యుఒడిలోకి

Series of Accidents : అతివేగం(Over Speed), నిద్రమత్తు, సమయానికి ఎయిర్ బ్యాగ్స్(Air Bags) తెరుచుకోకపోవడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం... ఇలా చాలా కారణాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLA) లాస్య నందిత(Lasya Nanditha) మృతికి దారి తీశాయి. ఈ రోజు తెల్లవారు ఝామున 5.15 కు లాస్య వెళుతున్న కారు ఓఆర్ఆర్‌(ORR) లో ప్రమాదానికి గురైంది. ముందు సీటుకు ఆమె తల బలంగా తాకడంతో... ఇన్నర్ ఇంజ్యురీస్ అయి అక్కడిక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని కారులోంచి బయటకు తీసి పటాన్ చెరు అమేథా ఆసుపత్రికి తరలించారు. దీని తరువాత పోస్ట్ మార్టం నిమిత్తం లాస్య మృతదేహాన్ని గాంధీ హాస్పటల్‌కు తరలించనున్నట్టు సమాచారం.

వెంటాడిన వరుస ప్రమాదాలు..

ఎమ్మెల్యే లాస్య నందితను వరుస ప్రమాదాలు వెంటాడాయి. అంతకు ముందు రెండు ప్రమాదాల నుంచి ఆమె తప్పించుకున్నారు. కానీ మూడోసారి మాత్రం మృత్యువుకు బలయ్యారు. ఈ ప్రమాదాలు కూడా వరుసగా మూడునెలల్లోనే జరగడం విచారకరం. మొదటిసారి డిసెంబర్ 24న బోయిన్‌పల్లి దగ్గర లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు ఎమ్మెల్యే లాస్య. బోయినపల్లి వీఆర్ ఆసుపత్రి వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళుతుండగా ఎమ్మెల్యే లాస్యతో పాటూ పలువురు లిఫ్ట్‌లో ఉండిపోయారు. చాలాసేపు డోర్ తెరుచుకోకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. కాసేపటి తర్వాత ఆసుపత్రి సిబ్బంది లిఫ్ట్ డోర్ పగులకొట్టి లాస్య నందితను, మిగతావారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

రెండోసారి...

దీని తరువాత ఫిబ్రవరి 13న నల్లగొండ దగ్గర లాస్య కారు ప్రమాదానికి గురయ్యింది. నల్లగొండ(Nalgonda) బీఆర్ఎస్ సభకు హాజరయి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే లాస్య చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. కానీ ఆమె హోంగార్డు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు కూడా లాస్య వెళుతున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీస్‌కు కూడా తీవ్రగాయాలయ్యాయి.

ఈరోజు మాత్రం...

మూడోసారి మాత్రం ఎమ్మెల్యే లాస్య నందిత తప్పించుకోలేకపోయారు. నిన్న సదాశివ పేట్లో ఓ ప్రైవేటు పార్టీకి హాజరయి వస్తున్న లాస్య కారు ఓఆర్ఆర్‌లో ప్రమాదానికి గురయ్యింది. కారును ఆమె పీఏ ఆకాష్ నడుపుతున్నారు. లాస్య కారు మధ్య సీటులో కూర్చున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆమె అక్కడిక్కడే మరణించగా...పీఏ ఆకాష్ పరిస్థితి కూడా విషమంగా ఉంది.

Also Read : Telangana : ఎమ్మెల్యే లాస్యనందిత మృతి..సీఎం రేవంత్, నేతలు దిగ్భ్రాంతి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment