Kurchi Madathapetti : యూట్యూబ్ ను మడతపెట్టేసిన 'గుంటూరు కారం' సాంగ్.. నెట్టింట సెన్షేషనల్ రికార్డ్!

'గుంటూరు కారం' సినిమాలో 'కుర్చీ మడత పెట్టి' అనే పాట ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో ఓ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో 300 మిలియన్లకు పైగా వ్యూస్‌ అందుకున్న సాంగ్ గా అరుదైన ఘనత సాధించింది.

New Update
Kurchi Madathapetti : యూట్యూబ్ ను మడతపెట్టేసిన 'గుంటూరు కారం' సాంగ్.. నెట్టింట సెన్షేషనల్ రికార్డ్!

Guntur Kaaram Kurchi Madathapetti Song Rare Feet : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన 'గుంటూరు కారం' మూవీ ఈ ఏడాది సంక్రాతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తమన్ (Thaman S) ఈ సినిమా కోసం కంపోజ్ చేసిన సాంగ్స్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా సినిమాలో 'కుర్చీ మడత పెట్టి' అనే పాట ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించడమే కాకుండా సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో బాగా ట్రెండ్ అయింది. ఇప్పటికీ ఎక్కడో చోట ఈ సాంగ్ వినిపిస్తూనే ఉంటుంది. ఇక తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో ఓ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో 300 మిలియన్లకు పైగా వ్యూస్‌ అందుకున్న సాంగ్ గా అరుదైన ఘనత సాధించింది.

Also Read : ఫ్యాన్స్ కి బిగ్ షాక్ ఇచ్చిన ‘పుష్ప’!

సాంగ్ రిలీజైన డే వన్ నుంచి నేటి వరకు యూట్యూబ్‌, ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్.. ఇలా సోషల్ మీడియాలో ఉన్న అన్ని ప్లాట్ ఫామ్స్ లో మిలియన్స్ కొద్దీ రీల్స్ చేసారంటే.. ఈ సాంగ్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కుర్చీ మడతపెట్టి సాంగ్ యూట్యూబ్ లో రేర్ ఫీట్ అందుకోవడంతో ఈ విషయం తెలిసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Kurchi Madathapetti Song

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది! అంటూ ఆ కవిత సాగుతుంది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అందమైన ప్రదేశాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు సాక్ష్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

అమాయక ప్రజల మృతిపై ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు సంతాపం తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని అస్సలు వదలకూడదని.. కఠినంగా శిక్షించాలంటూ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఒక కవితతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

కన్నీటి కవిత

కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది!
అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దై పోతుంది. 

సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి- రుధిరం బైటికొస్తుంది.

అక్కడ రేపు పల్లకీ లెక్కి ఊరేగాల్సిన పెళ్ళికొడుకులు ఇవాళే పాడెక్కుతారు...

ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైధవ్యాల్లా ఉంటాయ్

భరతమాత కిరీటం వొరుసుకునీ నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది !

బుద్ధుడు కూడా కళ్ళూ నోరూ మూసుకుని మళ్ళీ అంతర్ముఖుడౌతాడు !!

ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! అంటూ తనికెళ్ల భరణి ఒక కవితను పంచుకున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. 

 

pahalgam | Pahalgam attack | pahalgam breaking news | tanikella-bharani | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment