Komati Reddy: కేసీఆర్‌కు మా బుల్లెట్ బలంగా దిగింది.. ఎప్పటికైనా బీజేపీలో బీఆర్ఎస్ విలీనమే!

మాజీ సీఎం కేసీఆర్ సభకు ఎందుకు రావట్లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. సభకు రాకుండా ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తున్నారని మండి పడ్డారు. కేసీఆర్‌కు తమ బుల్లెట్ బలంగా దిగిందని, ఆయన రాజకీయాలను వదులుకోవడం బెస్ట్ అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తప్పదన్నారు.

New Update
Komati Reddy: కేసీఆర్‌కు మా బుల్లెట్ బలంగా దిగింది.. ఎప్పటికైనా బీజేపీలో బీఆర్ఎస్ విలీనమే!

Telangna: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడుతున్న మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యా్ఖ్యలు చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో ప్రతిపక్ష నాయకుడు కుడా అంతే అన్నారు. సభకు హాజరుకాకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని అగౌరవించనట్టేనన్నారు. 83 ఏండ్ల ఖర్గే, సోనియా ఆరోగ్యం బాగాలేకపోయినా పార్లమెంటుకు హాజరవుతున్నప్పుడు కేసీఆర్ కు ఏమైందని ప్రశ్నించారు.

బుల్లెట్ దిగిందా లేదా..
ఈ మేరకు కేసీఆర్ సభకు ఎందుకు హాజరవ్వడం లేదు. సభకు రాకపోతే కేసీఆర్ రాజకీయాలు వదులుకున్నట్లుగానే భావించాల్సివస్తుంది. కాంగ్రెస్ 2వసారి రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రేవంత్ ఆధ్వర్యంలో మేము ఎన్నికలకు వెళ్ళాం. అధికారంలోకి వచ్చాం. కానీ హరీష్ రావు, కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం లేదు. సభలో మీకు మేము చాలు అంటున్న కేటీఆర్, హరీష్ ఎన్నికల్లో రేవంత్ ను ఎందుకు ఓడించలేదన్నారు. అలాగే 'ఎప్పుడొస్తే ఏంటీ బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా లేదా రాష్ట్రంలో' అన్నారు. అలాగే తాము దింపిన బుల్లెట్ కేసీఆర్ కు బలంగా దిగిందని, సీఎం సీటు పోయిన కేసీఆర్ వైఖరి చూస్తుంటే ఏ క్షణమైనా బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసేటట్టు ఉన్నాడని ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇంటర్నల్ పాలిటిక్స్ చేస్తున్నారని, అందుకే బండ్ల కృష్ణ మోహన రెడ్డి వెళ్ళాడన్నారు. త్వరలోనే మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తున్నారని జోష్యం చెప్పారు.

ఇది కూడా చదవండి: Wayanad landslides: వయనాడ్‌ అతలాకుతలం.. భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య!

ఇక కేసీఆర్ ఛాంబర్ కు వెల్లినంత మాత్రానా పార్టీలో చేరినట్లు కాదన్నారు. కేటీఆర్ కూడా నా ఛైర్ దగ్గరకు వచ్చి మాట్లాడిండు. ఆయన కాంగ్రెస్ లో చేరినట్లేనా? బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అలాగే కలిసి ఉంటాడు. ఆయన ఎక్కడికి వెల్లడు. జగదీష్ రెడ్డి నేను అన్న మాటలకు ఒప్పుకున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి ఫారెన్ వెల్తే నేను ఉన్నగా చూసుకోవడానికి. బీఆర్ఎస్ కు నేను చాలు. త్వరలో ప్రధానిని కలుస్తా. రాష్ట్ర రహదారుల కోసం నిధులు అడుగుతా. బీఆర్ఎస్ ఎత్తేసిన అన్ని వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇస్తాం. ఉప్పల్- నారపల్లి ఫ్లై ఓవర్ కు త్వరలోనే రీ టెండర్ నిర్వహిస్తాం. వర్షాకాలంలో ప్రయానికులకు ఇబ్బంది కలగకుండా రోడ్డు మరమ్మతులు చేపడతామన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Anemia: రక్తహీనతతో బాధపడేవారు ఇవి తప్పక తినాలి

రక్తహీనత, హిమోగ్లోబిన్ లేక పిల్లలు, మహిళలు బాధపడుతూ ఉంటారురు.మొలకెత్తిన పప్పులలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతతో పోరాడటానికి సహాయపడతాయి. ఇది శరీరంలో హిమోగ్లోబిన్, ఎర్రరక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Anemia

Anemia

Anemia: భారతదేశంలో రక్తహీనత ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. చాలా మంది రక్తహీనత, హిమోగ్లోబిన్ లేకపోవడంతో బాధపడుతున్నారు. దీని వల్ల రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. రక్తహీనత ముఖ్యంగా పిల్లలు, మహిళలు, బలహీనులను ప్రభావితం చేస్తుంది. ఒక నివేదిక ప్రకారం 6 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల 67శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. దాదాపు 52శాతం గర్భిణీలు రక్తహీనతతో బాధపడుతున్నారని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: కిడ్నీలో రాళ్లు ఉంటే ఈ ఆహారాలు ముట్టుకోకూడదు

సరైన ఆహారం తీసుకోకపోవడం..

ప్రసవ సమయంలో సమస్యలను కలిగిస్తుందని, శిశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. శాకాహారులు తరచుగా సలాడ్ లేదా పండ్లను మాత్రమే తినడం వల్ల రక్తహీనత ప్రమాదాన్ని పెంచుతుందని అంటున్నారు. రక్త కణాలలు తగ్గడానికి శరీరంలో ఐరన్ లోపం వల్ల హిమోగ్లోబిన్ లేదా ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయలేకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, జీర్ణవ్యవస్థలో సమస్యలు, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ లేకపోవడం, ఏదైనా రకమైన గాయం, అధిక ఋతు రక్తస్రావం కారణం అవుతుందని వైద్యులు అంటున్నారు.

Also Read:  బ్రో..'లక్కీ భాస్కర్' ఓటీటీ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?

మొలకెత్తిన పప్పులలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతతో పోరాడటానికి సహాయపడతాయి. ఇది శరీరంలో హిమోగ్లోబిన్, ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. మొలకలు నాన్-హీమ్ ఐరన్ మంచి మూలం. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

Also Read  రోజూ గుడ్డు తింటే వృద్ధాప్యంలోనూ మతిమరుపు ఉండదు

( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)

Advertisment
Advertisment
Advertisment