అత్యంత సేఫ్ సిటీగా కోల్ కతా.. హైదరాబాద్ కు ఎన్నో స్థానం తెలుసా?

భారతదేశంలో అత్యంత సురక్షిత నగరంగా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతా నిలిచింది. భారత్ దేశంలో నేరాలకు సంబధించి ‘క్రైమ్ ఇన్ ఇండియా 2022' విడుదల చేసిన జాబితాలో కోల్ కతా మొదటి స్థానం దక్కించుకోగా.. పుణె రెండు, హైదరాబాద్ మూడో ప్లేస్ లో నిలిచాయి.

New Update
అత్యంత సేఫ్ సిటీగా కోల్ కతా.. హైదరాబాద్ కు ఎన్నో స్థానం తెలుసా?

NCRB : దేశవ్యాప్తంగా నగరాల్లో జరుగుతున్న నేరాలు, ఘోరాలపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (National Crime Records Bureau NCRB) ‘క్రైమ్ ఇన్ ఇండియా 2022 (Crime in India 2022)' ఒక నివేదిక రిలీజ్ చేసింది. 2022లో దేశంలో అత్యంత సేఫ్ నగరంలో కోల్ కతా అని తేల్చింది. ఎన్సీఆర్బీ రికార్డ్స్ లో కోల్ కతా అత్యంత సురక్షిత నగరంగా నిలవడం వరుసగా ఇది మూడో సంవత్సరం. కాగా 34 మర్డర్ కేసులు, 11 రేప్ కేసులు నమోదైనట్లు తెలిపింది.

Also read :ఒక పోస్ట్..లక్షలు, కోట్లలో ఆదాయం-సోషల్ మీడియా మహారాణులు

మహిళలపై నేరాలు కోల్ కతాలో 2022 లో పెరిగాయి. ఈ నగరంలో ప్రతీ లక్ష జనాభాకు 2022 లో మహిళలపై 1890 నేరాలు జరగగా, 2021 లో 1783 నేరాలు జరిగాయి. అలాగే, కోల్ కతాలో 2022 లో 34 మర్డర్ కేసులు, 11 రేప్ కేసులు నమోదయ్యాయి. కోల్ కతా లో 2022 లో ప్రతీ లక్ష జనాభాకు 86.5 కేసు వేయదగిన నేరాలు (Cognisable Crimes) జరిగాయి. ఈ కాగ్నిజబుల్ క్రైమ్స్ అంటే ఐపీసీ, లేదా ప్రత్యేక, లేదా స్థానిక చట్టాల ప్రకారం కేసు వేయదగ్గ నేరాలని అర్థం. కోల్ కతాలో 2021 లో ప్రతీ లక్ష జనాభాకు 103.4 నేరాలు, 2020లో ప్రతీ లక్ష జనాభాకు 129.5 నేరాలు చోటు చేసుకున్నాయి. 2022లో పుణెలో ప్రతీ లక్ష జనాభాకు 280.7 కేసు వేయదగిన నేరాలు జరగగా, హైదరాబాద్ లో ప్రతీ లక్ష జనాభాకు 299.2 కేసు వేయదగిన నేరాలు (Cognisable Crimes) జరిగాయి. పుణెలో 2021 లో ప్రతీ లక్ష జనాభాకు 256.8 నేరాలు, హైదరాబాద్ (Hyderabad)లో 2021 లో ప్రతీ లక్ష జనాభాకు 259.9 నేరాలు చోటు చేసుకున్నాయి. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న మొత్తం 19 నగరాల్లోని నేరాలను పరిగణించి, ఎన్సీఆర్బీ (NCRB) ఈ జాబితాను విడుదల చేసింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tenth wife Murder: 9మంది భార్యలు వదిలేస్తే, పదో భార్యను భర్తే చంపేశాడు.. ఎందుకంటే?

ఛత్తీస్‌గఢ్‌ జాష్‌పూర్ జిల్లాలో ధులు రామ్‌కు 10మంది మహిళలతో వివాహమైంది. వివిధ కారణాలతో 9మంది భార్యలు అతనితో ఉండలేక వదిలేసి పోయారు. చివరి భార్య బసంతి బాయిని భర్త రాయితో కొట్టి చంపాడు. ఆమె తనని వదిలేస్తోందేమో అనే అనుమానంతో చంపానని రామ్ పోలీసులకు చెప్పాడు.

New Update
Tenth wife Murder

ధులు రామ్ పది మందిని మహిళలను వివాహం చేసుకున్నాడు. ఏ భార్య తనతో ఉండలేదు. పెళ్లైన కొన్నిరోజులకే అతన్ని వదిలేసి వెళ్లిపోయారు. కానీ పదో సారి పెళ్లి చేసుకున్న మహిళను భర్త ధులు రామ్ హత్య చేశాడు. ఛత్తీస్‌గఢ్‌లోని జాష్‌పూర్ జిల్లాలో భార్యను భర్త కిరాతకంగా చంపాడు. సులేసా గ్రామంలో నాలా దగ్గరున్న ఆదివారం ఓ గొయ్యిలో దుర్వాసన రావడం స్థానికులు గమనించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఫోరెన్సిక్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుళ్ళిపోయిన మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ డెడ్‌బాడీ అదే గ్రామానికి చెందిన బసంతిగా బాయిదిగా గుర్తించారు. ఆమె తలకు బలమైన గాయం కావడంతో మరణించినట్లు పోస్టుమార్టంలో తేలింది. పోలీసుల విచారణలో ఆమె చివరిసారిగా తన భర్తతో కనిపించిందని కూడా తెలిసింది.

Also read; BIG BREAKING: గుజరాత్‌లో కూప్పకూలిపోయిన విమానం.. భారీ పేలుడు

ఆ అనుమానంతోనే హత్య..

నిందితుడిని ధులు రామ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం బయటపడింది. రామ్ చెప్పిన విషయాలు పోలీసులను ఆశ్చర్యానికి గురిచేశాయి. అతనికి గతంలో 9సార్లు పెళ్లి అయ్యిందట. ఏదో కారణం చేత వారంత అతన్ని వదిలేసి వెళ్లారు. దీంతో బసంతి కూడా అతన్ని వదిలేసి వెదిలేసి వెళ్లిపోతుందేమో అని అనుమానం అతనికి వచ్చింది. పదే పదే అదే ఆలోచనతో రామ్‌కు 10వ భార్య బసంతిపై ఆందోళన ఎక్కువైంది. భార్య వదిలేసే కంటే ముందే ఆమెను హత్య చేయాలని రామ్ నిర్ణయించుకున్నాడు. మద్యమత్తులో బాక్సైట్ రాయితో భార్య తలపై కొట్టి చంపాడు. నేరాన్ని ఒప్పుకున్న రామ్‌ను అరెస్ట్ చేశారు. బసంతి మానసిక పరిస్థితి కూడా సరిగా ఉండేది కాదని పోలీసులు తెలిపారు.

Also read: New Pope: కొత్త పోప్ ఎన్నికలో కీలకంగా నలుగురు ఇండియన్ కార్డినల్స్

(Chhattisgarh Jashpur district | Husband Ki*ll*s Wife | husband-killed-wife | husband-killed-his-wife | chhattisgarh | crime news | latest-telugu-news | tenth wife)

Advertisment
Advertisment
Advertisment