AP Congress: వైసీపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన మరో మాజీ ఎమ్మెల్యే కర్నూలు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కోడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళి కృష్ణ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. By Jyoshna Sappogula 20 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి EX MLA Parigela Murali Joined in Congress: ఏపీలో ఎన్నికల వేళ వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నిన్ననే నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. తాజాగా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ పాలక మండలి సభ్యుడు పరిగెల మురళీకృష్ణ తన అనుచరులు కలిసి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila) కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. Also read: పవన్ కళ్యాణ్ తో పోటీలో ఉండేది ఇందుకే.. ఆర్టీవీతో వంగా గీత సంచలన వ్యాఖ్యలు..! మురళీకృష్ణ 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం వైసీపీలో (YCP) చేరారు. అనంతరం టీటీడీ పాలక మండలి సభ్యుడిగా కూడా పనిచేశారు. 2019లో వైసీపీ సీటు ఆశించినప్పటికీ అప్పటి సమీకరణాల కారణంగా ఆయనకు సీటు దక్కలేదు. కనీసం 2024 ఎన్నికలలో అయినా సీటు వస్తుందని ఆశించినప్పటికీ జగన్ తనకు మొండి చేయి చూపడంతో తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. #ap-elections-2024 #ycp #former-mla-parigela-murali #congress #ys-sharmila సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి