Dhruv Rathee : బీజేపీకి చుక్కలు చూపిస్తున్న ధ్రువ్ రాఠీ.. అసలెవరితను?

అతను మోదీని అయినా అమిత్‌షాని అయినా కడిగిపడేస్తాడు. అసలు భయపడడు. య్యూటుబ్‌ ప్రజెంటేషన్‌ కూడా నెక్ట్స్‌ లెవల్‌లో ఉంటుంది. అందుకే అతనికి ఫాలోయింగ్ ఎక్కువ.. అతనెవరో ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది. మోదీని కొవార్డ్‌ అంటూ అందరి ముందే కుండబద్దలు కొట్టిన ఆ యూట్యూబర్ పేరు ధృవ్ రాఠీ!

New Update
Maharashtra: అది ధ్రువ్ రాఠీది కాదు..పేరడీ అకౌంట్

BJP :  ధృవ్ రాఠీ(Dhruv Rathee) కొన్ని వారాలుగా ట్విట్టర్‌(X) లో ట్రెండింగ్‌లో ఉన్నాడు. ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు(Supreme Court) ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) ను కొట్టివేసిన వెంటనే అతను ఓ వీడియోను అప్‌లోడ్ చేశాడు. ఇది పెను ప్రకంపనలు సృష్టించింది. ఎలక్టోరల్‌ బాండ్లతో బీజేపీ ఎలా స్కామ్‌ చేసిందో వివరిస్తూ ధృవ్ రాఠీ చేసిన వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. మీడియా ఏకపక్షంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్న కాలంలో ధృవ్ రాఠీ చేస్తున్న వీడియోలు ఓ సెక్షన్‌కు ఫేవరెట్‌గా మారాయి. బీజేపీ ప్రత్యర్థుల రాజకీయ ప్రసంగాల కంటే యూట్యూబ్‌లో ధృవ్ వీడియోలు హిందీ-బెల్ట్ రాష్ట్రాల్లోని పట్టణాలలో వైరల్ అవుతున్నాయి. 29 ఏళ్ల యువకుడు 'భారతదేశం నియంతృత్వంగా మారుతోందా?' అనే శీర్షికతో రూపొందించిన అరగంట వ్లాగ్‌ సంచలనం రేపింది. ఈ వీడియోలో ధృవ్ ఎన్నికల సంఘం(Election Commission) పని తీరుపై కూడా ప్రశ్నలు సంధించారు. భారతదేశ ప్రస్తుత ప్రజాస్వామ్య పరిస్థితిని కూడా అతను నిలదీశారు.

సోషల్ మీడియా యాక్టివిస్ట్..

29 సంవత్సరాల వయస్సు ఉన్న ధృవ్ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌. అతను సామాజిక, రాజకీయ, పర్యావరణ సమస్యలపై వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యారు. అతనకు మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. డిజిటల్ స్పేస్‌లో దాదాపు అందరికి తెలిసిన వాయిస్ తెలిసిన వాయిస్‌గా ధృవ్ రాఠీది. 2016 ఉరీ దాడి, భారత నియంత్రణ రేఖ సమ్మె, 2016 నోట్ల రద్దు, గుర్మెహర్ కౌర్ వివాదం, మోర్బి వంతెన కూలిపోవడం, 2019 పుల్వామా దాడి, 2023 మణిపూర్ హింస లాంటి అంశాలపై అతని వీడియోలు నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కొట్టాయి.

బెర్లిన్ ఉంటున్న ధ్రువ్..

హర్యానాలోని రోహ్‌తక్‌లో జన్మించిన ధృవ్ రాఠీ తన స్కూల్‌ విద్యను ఢిల్లీ పబ్లిక్ స్కూల్, RK పురంలో చదివాడు. హైస్కూల్ చదువును పూర్తి చేసిన తర్వాత జర్మనీలోని ఓ ఇన్‌స్టిట్యూట్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ చదివాడు. ఆ తర్వాత మాస్టర్స్ డిగ్రీని కూడా పూర్తి చేశాడు. జర్మనీ పౌరుడైన జూలీను వివాహం చేసుకున్న ధృవ్ రాఠీ జర్మనీలోని బెర్లిన్‌లో నివసిస్తున్నాడు.

ధ్రువ్ యూట్యూబ్ కెరీర్..

ధృవ్ రాఠీ తన ట్రావెల్ వీడియోలను అప్‌లోడ్ చేస్తూ 2013లో తన యూట్యూబ్ కెరీర్‌ను ప్రారంభించాడు. అయితే వెంటనే రాజకీయ, సామాజిక అంశాలను కవర్ చేయడం స్టార్ట్ చేశాడు.యూట్యూబ్‌ను రాజకీయ వేదికగా ఉపయోగించిన మొదటి భారతీయ వినియోగదారులలో రాఠీ కూడా ఒకరు. 2023లో ధృవ్ రాఠీ యూట్యూబ్ డైమండ్ ప్లే బటన్‌ను అందుకున్నాడు. T- సిరీస్, ప్యూడీ పై, మిస్టర్ బీస్ట్ లాంటి ప్రసిద్ధ యూట్యూబర్‌ల జాబితాలో చేరాడు. ధృవ్ రాఠీ దేశంలో అత్యధికంగా చెల్లించే యూట్యూబర్‌లలో ఒకరు. జాగ్రన్ వెబ్‌సైట్‌లోని ఒక నివేదిక ప్రకారం, ధృవ్ రాతీ నికర విలువ రూ. 27 కోట్లు. అతని నెలవారీ ఆదాయం దాదాపు రూ.48 లక్షలు. 2023లో టైమ్స్ మ్యాగజైన్ ప్రచురించిన తదుపరి తరం నాయకుల జాబితాలో ధృవ్ రాఠీ ఉన్నారు.

Also Read:Dhruv Rathee On PM Modi: మోదీ పిరికివాడు, నియంత..యూట్యూబర్ ధ్రువ్ రాఠీ సెన్సేషనల్ కామెంట్స్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Stock Market: నిన్న అధ:పాతాళానికి..ఈరోజు లాభాల్లో..

ట్రంప్ టారీఫ్ ల దెబ్బతో కుదేలైపోయిన స్టాక్ మార్కెట్ ఈరోజు కాస్త కోలుకుంది. ఉదయం మార్కెట్ ప్రారంభ సమయం నుంచే లాభాల బాటలో పయనిస్తోంది. సెన్సెక్స్ 1100  పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్లు పెరిగి 22,550 స్థాయిలో ట్రేడవుతున్నాయి.

New Update
stock market

stock market

 స్టాక్ మార్కెట్లో ఇంతలా డైనమిక్ ఛేంజ్ లు ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండరేమో. నిన్న మార్కెట్లు అధ:పాతాళానికి వెళ్ళి కోట్ల రూపాయలు కరిగిపోయాయి. భారత స్టాక్ మార్కెట్ ఈ ఏడాదిలో రెండవ అతిపెద్ద పతనాన్ని చూసింది. సెన్సెక్స్ 2226 పాయింట్లు (2.95%) పడిపోయి 73,137 వద్ద ముగిసింది. నిఫ్టీ 742 పాయింట్లు (3.24%) పడిపోయి 22,161 వద్ద ముగిసింది. అంతకుముందు జూన్ 4వ తేదీ 2024లో మార్కెట్ 5.74% పడిపోయింది. మరోవైపు ప్రపంచ మార్కెట్ పరిస్థితి కూడా అలానే ఉంది. 

Also Read :  మియాపూర్‌లో లారీ బీభత్సం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి.. మరో ఇద్దరికి సీరియస్!

Also Read :  అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు.. కాళ్లు, చేతులకు గాయాలు!

ఆసియా మార్కెట్లలో వృద్ధి..

కానీ ఈరోజు ఉదయానికి పరిస్థితి అంతా మారిపోయింది. నష్టాల్లో ఉన్న సూచీలు ఈరోజు మార్కెట్ ప్రారంభం నుంచే లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 1100 (1.60%) పాయింట్లకు పైగా లాభంతో 74,300 స్థాయిలో ట్రేడవుతోంది. అదే సమయంలో, నిఫ్టీ కూడా దాదాపు 400 (1.70%) పాయింట్లు పెరిగి 22,550 స్థాయిలో ట్రేడవుతోంది. సెన్సెక్స్‌లోని అన్ని స్టాక్స్ అంటే  30 స్టాక్స్ లాభాల్లో పయనిస్తున్నాయి. ముఖ్యంగా మెటల్, ఆటో షేర్లు బాగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లలో పెరుగుదల వల్లనే భారతీయ మార్కెట్ లాభాలు చూస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఆసియా మార్కెట్లలో.. జపాన్ నిక్కీ ఇండెక్స్ దాదాపు 6% పెరిగింది. అలాగే హాంకాంగ్ ఇండెక్స్ కూడా 2% పెరిగింది. వీటితో పాటూ NSE అంతర్జాతీయ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడవుతున్న నిఫ్టీ కూడా 1.5% పెరిగింది. ఇది మార్కెట్లో అప్‌ట్రెండ్‌ను సూచిస్తుంది.  అలాగే నిఫ్టీ 50, సెన్సెక్స్ చార్టులు ఓవర్‌సోల్డ్ RSI స్థాయిలను చూపుతున్నాయి. ఇది షార్ట్-కవరింగ్ , కొత్త కొనుగోళ్లకు దారితీస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Also Read: Bengaluru: బెంగళూరులో లైంగిక వేధింపులు కామన్..హోంమంత్రి పరమేశ్వర వివాదాస్పద కామెంట్స్!

Also Read: Trump Tariffs: ట్రంప్ సుంకాల దెబ్బకు పడిపోయిన చమురు ధరలు..కంగారులో రష్యా

 

nifty | sensex | today-latest-news-in-telugu | Stock Market Today | business news telugu | telugu business news | telugu-news | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment