Kitchen Hacks: ఉడకబెట్టిన గుడ్లు పగిలిపోతున్నాయా? ఇలా చేస్తే గుడ్లు అస్సలు పగలవు..!

చాలా మంది ప్రతి రోజూ ఒక గుడ్డును తింటారు. అయితే, గుడ్డును ఉడకబెట్టేటప్పుడు కొన్నిసార్లు పగిలిపోతుంది. అలా కాకుండా ఉండేందుకు పెద్ద గిన్నెల గుడ్లను ఉడకబెట్టాలి. నీటిలో ఉప్పు వేస్తే పెంకు త్వరగా వస్తుంది. మీడియం మంటపై గుడ్లను ఉడికించాలి.

New Update
Kitchen Hacks: ఉడకబెట్టిన గుడ్లు పగిలిపోతున్నాయా? ఇలా చేస్తే గుడ్లు అస్సలు పగలవు..!

Egg Boiling Tips: కోడిగుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే.. రోజూ ఒక గుడ్డును తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా రోజూ బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్ సమయంలో గుడ్లు తింటారు. అల్పాహారంగా గుడ్లు తింటే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అయితే, చాలా మంది గుడ్లు ఉడకబెట్టేటప్పుడు పలిగిపోతుండటం చూస్తుంటారు. పొట్టు సరిగా రాకపోవడం, మధ్యలోనే చిట్లిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. దీంతో అవి పాడైపోయానని భావించి.. పడేస్తుంటారు. అయితే, ఈ సమస్యకు కారణం ఉడకబెట్టే విధానమే అని చెబుతున్నారు నిపుణులు. ఉడకబెట్టడంలో చేసే చిన్న పొరపాట్లు గుడ్డు పగుళ్లకు దారితీస్తాయి. మరి గుడ్డు పగలకుండా సరిగా ఉడకాలంటే ఏం చేయాలో ఇవాళ మనం తెలుసుకుందాం..

గుడ్లు పగలకుండా ఉడికించడానికి సింపుల్ చిట్కాలు..

వెడల్పాటి పాన్‌లో ఉడికించాలి: రెండు గుడ్లు ఉడకబెడుతున్నట్లయితే.. కాస్త వెడల్పుగా ఉన్న బౌల్‌ను వినియోగించాలి. రెండు లేదా అంతకంటే ఎక్కువ గుడ్లు ఉడికించేందుకు చిన్న బౌల్‌ను వినియోగిస్తే.. అవి ఒకదానికొకటి తాకి పగిలిపోయే అవకాశం ఉంది. గుడ్లు ఒకదానికొకటి తాకకుండా వెడల్పాటి పాన్‌లో ఉడికించాలి.

ఫ్రిజ్ నుండి తీసివేసిన వెంటనే ఉడికించవద్దు: కోడి గుడ్డును శీతల వాతావరణం, ఫ్రిజ్ నుంచి బయటకు తీసి నేరుగా ఉడబకబెట్టినట్లయితే.. అది పగిలిపోయే అవకాశం ఉంది. వీటిని ఫ్రిజ్ నుంచి నేరుగా నీళ్లలో వేసి మరిగిస్తే కచ్చితంగా పగుళ్లు వస్తాయి. అందుకే మొదట ఫ్రిజ్ నుండి గుడ్లను తీసి, గది ఉష్ణోగ్రత వద్ద 10 లేదా 15 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత ఉడకబెట్టడం మంచిది.

మరిగే నీటిలో ఉప్పు కలపండి: కొన్నిసార్లు గుడ్డు సరిగ్గా ఉడకబెట్టిన తర్వాత కూడా పొట్టు తీయడం కష్టంగా ఉంటుంది. అలాంటి సమయంలో గుడ్లు ఉడికించే నీటిలో కొంచెం ఉప్పు కలపాలి. ఉప్పు నీటిలో గుడ్లను ఉడకబెట్టడం వల్ల వాటి పెంకు తొలగించడం చాలా సులభం అవుతుంది.

మీడియం మంట మీద ఉడికించాలి: గుడ్లు ఉడకబెట్టేటప్పుడు మంట ఎక్కువగా ఉండకూడదు. గుడ్డు ఎప్పుడూ మీడియం మంట మీద ఉడికించాలి. ఇలా చేయడం వల్ల గుడ్డు పగలదు. దాని పెంకు కూడా సులభంగా తొలగించబడుతుంది.

Also Read:

బండి సంజయ్‌కు మళ్లీ అధ్యక్ష పదవి?

తెలంగాణ సీఏంగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. హాజరవనున్న ప్రముఖులు..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Omar Abdullah: పాక్‌ ప్రధానిపై ఒమర్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ ప్రధానిపై జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్‌ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ విమర్శించారు. ఈ దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
They didn't even recognise, Omar Abdullah on Pak's probe offer into Pahalgam

They didn't even recognise, Omar Abdullah on Pak's probe offer into Pahalgam

పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం దీనిపై తటస్థ, పారదర్శక దర్యాప్తునకు తాము రెడీగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్‌ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. '' పహల్గాంలో చోటుచేసుకున్న దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదు.

Also read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఈ ఘటన వెనుక భారత్ ఉందని వాళ్లే మొదటగా ఆరోపించారు. మనపై ఎప్పుడూ ఆరోపణలు చేసేందుకు ముందుండే వాళ్లకు ఇప్పుడు మనమేమి చెప్పలేం. వాళ్లు చేసిన ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాలని అనుకోవడం లేదు. ఈ ఘటన జరిగి ఉండాల్సింది కాదని'' సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఇదిలాఉండగా పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ దీనిపై స్పందించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడాన్ని ఆయన ఖండించారు.  

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

ఇదిలాఉండగా.. పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌లోని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ భారత్.. పాకిస్థాన్‌పై ఎప్పుడు దాడి చేస్తుందో చెప్పారు. '' భారత్‌ నుంచి కచ్చింతగా ప్రతీకార చర్య ఉంటుందని నాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకుంటే భారత ప్రధాని మోదీ కూడా బిహార్‌లో చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు. గతంలో పరిశీలిస్తే యూరీ, పుల్వామా దాడుల తర్వాత భారత్‌ చర్యలకు దిగిన సందర్భాలున్నాయి. యూరీ దాడి తర్వాత 89లో భారత్‌ చర్యలకు దిగింది. పుల్వామా దాడి తర్వాత 12 రోజుల్లోనే సర్జికల్‌ స్ట్రేక్ చేసింది. ఏప్రిల్ 22న పహల్గాంలో దాడి జరిగింది కాబట్టి.. మే మొదటి వారంలో లేదా మధ్యన భారత్‌ దాడి చేసే అవకాశం ఉందని'' అబ్దుల్ బాసిత్ అన్నారు.

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

telugu-news | rtv-news | national-news | Omar Abdullah 

Advertisment
Advertisment
Advertisment