కేసీఆర్ కు కిషన్ రెడ్డి మరో బహిరంగ లేఖ.. ఎవరిమాట వినడంటూ సెటైర్లు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్రమంత్రి, బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి రెండోసారి బహిరంగ లేఖ రాశారు. మాట తప్పితే కేసీఆర్ తల నరుక్కుంటానని ప్రగల్భాలు పలికి అధికారంలోకి రాగానే ఎందుకు ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కారంటూ పలు ప్రశ్నలు లేవనెత్తారు.

New Update
కేసీఆర్ కు కిషన్ రెడ్డి మరో బహిరంగ లేఖ.. ఎవరిమాట వినడంటూ సెటైర్లు

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రెండోసారి బహిరంగ లేఖ రాశారు. ఇందులో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఉద్యమ సమయంలో దళిత వర్గాలను మభ్యపెట్టి దారుణంగా మోసం చేశాడని కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. మాట తప్పితే కేసీఆర్ తల నరుక్కుంటానని ప్రగల్భాలు పలికారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ఎందుకు ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 20శాతానికి పైగా ఉన్న దళిత, అణగారిన వర్గాలను మభ్యపెట్టి పబ్బం గడుపుకోవాలనే కుట్ర ఎలా చేయగలిగారని పలు ప్రశ్నలు లేవనెత్తారు.

అప్రజాస్వామికం మీ మనస్తత్వం!
ప్రజాస్వామ్యం తోకలేని పక్షిలా మారిందని ఎవరు అన్నారో గానీ.. దాని తోకల్ని, ఈకల్ని, రెక్కల్ని పీకేసి మీలాంటి నియంతలు వాటిని తమ మకుటాలకు అలంకరించుకుంటారు. ఉద్యమనాయకుడిగా చెలామణి అయి 2014లో అధికారంలోకి వచ్చాక ‘కేసీఆర్ ఎవరిమాటా వినడు’ అన్నట్లు తయారయ్యారు. ఉద్యమకాలంలో అన్ని పార్టీల గడపలు తొక్కిన మీరు.. అధికారం చేపట్టాక ఆ పార్టీల అస్తిత్వాలను తొక్కేసేలా వ్యవహరిస్తున్న విషయం వాస్తవం కాదా? ఉద్యమంలో ఉన్న రాజకీయ జేఏసీలోని ప్రజాసంఘాలు, ఉద్యోగ, కార్మిక సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు, విద్యావంతులు, మేధావులను ఒక్కరొక్కరిగా దూరం పెట్టింది మీరు కాదా? ఈ విషయం తన కొంప మునిగేంతవరకు చాలామంది ఉద్యమకారులకు అర్థం కాలేదు. మీ ఆలోచన తెలిసిన వారికి ఇదేం కొత్త విషయం కాదు. మీతో కలిసున్న వారిలోనూ చాలా మందికి ఇప్పుడిప్పుడే మీ మనస్తత్వం పూర్తిగా బోధపడుతోంది.

ఈ మనస్తత్వం వెనక ఉన్నది మీలోని అహంకారం, మీ నియంతృత్వ ధోరణి. ‘అంతా నేనే’ అన్న హిరణ్యకశ్యపుని స్వభావం. మీ దృష్టిలో ప్రజలంటే మీరు చెప్పింది వినే అమాయకులు. మీ సమావేశాల్లో వారిని కసురుకునే స్వభావం చూస్తేనే అంతా అర్థమైపోతుంది. మీ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు.. మీరు చెప్పింది విని తలూపే ‘డూడూ బసవన్న’లు. టీవీలను, పత్రికలను 10 కిలోమీటర్ల లోతులో పాతిపెడతానన్న తర్వాత వాళ్లలో కొందరు మీకు వ్యతిరేకంగా రాయడం లేదు. ఉద్యమంలో నచ్చిన రాతలు ఆ తర్వాత పునరుద్ఘాటిస్తే.. మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజాసమస్యల గుండె చప్పుడుకు, తెలంగాణ గొంతుకకు, భావస్వేచ్ఛకు వేదికైన ధర్నాచౌక్‌ను మీరు ఎత్తేస్తారు. గొంతెత్తిన వారిని సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించి మీ దార్లోకి తెచ్చుకుంటారు. మీ మనసులో వచ్చేదే ‘రాష్ట్ర ప్రజలందరి ఆలోచన’, దాన్ని అమలుచేయడమే ‘రాష్ట్ర సంక్షేమం’ అని భావించే కొత్త తరహా నియంతృత్వ ప్రజాస్వామ్యమే మీ నేతృత్వంలో ఇప్పుడు తెలంగాణలో నడుస్తోంది.

Also read :అందమైన అమ్మాయిని ఎరగావేసి నిర్మాతను నిండా ముంచిన డైరెక్టర్.. చివరికి ఏమైందంటే

ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాల్సిన ముఖ్యమంత్రిని ఎప్పుడు? ఎక్కడ? ఎలా? కలవాలో తెలియక జనం, వారు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అయోమయం అవుతున్నారు. మిమ్మల్ని కలిశామని మీ పార్టీ ఎమ్మెల్యేలు గానీ, మంత్రులు గానీ ధైర్యంగా చెప్పగలరా? గతంలో ఎందరోమంది పాలకులు అమలు చేసిన ప్రజాదర్బార్ స్థానంలో అత్యద్భుతంగా ప్రగతి భవన్‌ను ఆధునిక నిజాం భవనంగా నిర్మించి, వందిమాగధుల పొగడ్తలతో.. ప్రజాభీష్టంతో పనిలేకుండా మీకు నచ్చిన నిర్ణయం తీసుకోవడం మరెవరికైనా సాధ్యమా? అనవసర ప్రకటనలు చేస్తూ.. టైంపాస్ చేయడం మీకు అలవాటైపోయింది. దీనికితోడు పదేళ్లుగా.. అవినీతి, అక్రమాలు, అశ్రిత పక్షపాతంతో ప్రజలను ఇబ్బందులు పెట్టారు. మీ పాలనలో ఎన్ని కుంభకోణాలు? ఎన్నెన్నో దౌర్జన్యాలు? ‘బంగారు తెలంగాణ’ పేరుతో మీరు చేస్తున్న పాలన.. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా ఉంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వంటి పెద్దలెందరో.. సచివాలయం, అసెంబ్లీ వంటివి ప్రజలకు సౌలభ్యాన్ని కలిగించేలా నిర్ణయాలు తీసుకోవాలని సంకల్పించారు. కానీ మీ దృష్టిలో దీనికి పూర్తి భిన్నమైన అర్థం ఉందని తెలంగాణ ప్రజలకు తెలిసేందుకు పదేళ్ల సమయం పట్టింది.

మీరెలాగూ సచివాలయానికి రారని తెలిసి.. అన్నిరకాల ఫైళ్లే ప్రగతి భవన్‌కు రావడమే మీ దృష్టిలో రాజ్యాంగం. ఇలాంటి నియంతృత్వ మనస్తత్వమే.. మీ రూపాన్ని యాదాద్రి దేవాలయ రాతిస్తంభాలపై చెక్కించుకునేంత వరకు వెళ్లింది. ప్రజాగ్రహానికి లొంగి మీరు వాటిని తొలగించాల్సి వచ్చింది లేదంటే.. ఆగమశాస్త్రపు చిత్రాలు కాకుండా మీ చిత్రాలు ఆలయంలో ఉండేవి. స్పీకర్ దగ్గర జరిగే బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశంలో తప్ప అఖిలపక్షం నేతల ముఖాలు కూడా చూడటం మీకు ఇష్టముండదు. ఎవరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వనంత ‘ఇరుకైన’ ఆలోచనతో, పోలీసు వ్యవస్థను, అధికార యంత్రాగాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్న మీ అప్రజాస్వామిక మనస్తత్వాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ.. మీ కుటుంబ ఆలోచనలే సర్వస్వంగా వ్యవహరిస్తున్న మీకు, మీ పార్టీకి రానున్న ఎన్నికల్లో సరైన బుద్ధి చెబుతారని కిషన్ రెడ్డీ అన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News Updates: నేడే కేబినెట్ భేటీ

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu

🔴Live News Updates: 

Cabinet Meeting: నేడే కేబినెట్ భేటీ

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఆర్డీయే 46 అథారిటీ సమావేశంలో ఆమోదించిన అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది.

chandrababu

Also Read: RRB ALP Jobs 2025: రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు.. వీరందరూ అర్హులే?

Also Read: Vivo T4 5G: మరొకటి వచ్చేస్తుంది మావా.. వివోతో మామూలుగా ఉండదు- కొత్త ఫోన్ భలే ఉందిరోయ్!

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరపనున్నారు. సీఆర్డీయే 46 అథారిటీ సమావేశంలో ఆమోదించిన అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. అలాగే అమరావతి నిర్మాణం కోసం అవసరమైన నిధులు సమీకరించుకునేందుకు సీఆర్డీయే కమిషనర్‌కు అనుమతి ఇస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు.

Also Read: Ap Weather Alert: ఏపీలో వచ్చే మూడు రోజులు పిడుగులు,మెరుపులతో వానలు..!

Also Read: Layoffs: ఫార్మా రంగంలో కూడా లేఆఫ్స్‌.. రూ.కోటిపైగా వేతనాలు ఉన్నవారు ఔట్

 

  • Apr 15, 2025 08:46 IST

    ట్రంప్‌ సరికొత్త రూల్స్.. పెళ్లైన వారు అమెరికా వెళ్లడం కష్టమే..

    ట్రంప్‌ ప్రభుత్వం పెళ్లైన కొత్త జంటల్లో కూడా కఠిన విధానాన్ని కొనసాగిస్తోంది. అమెరికా పౌరుడు లేదా పౌరురాలిని పెళ్లి చేసుకున్నవారు అక్కడికి రావాలంటే నెలలు కాదు, ఏకంగా ఏళ్లు పట్టే ఛాన్స్ ఏర్పడింది. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

    USA immigration
    USA immigration

     



  • Apr 15, 2025 06:53 IST

    CSK VS LSG: ఎట్టకేలకు చైన్నైను వరించిన విజయం..దగ్గరుండి గెలిపించిన కెప్టెన్ మహీ

    హమ్మయ్య పాయింట్ల పట్టికలో అట్టుగ ఉండి విజయం కోసం తపిస్తున్న జట్టును కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ విజయతీరాలకు నడిపించాడు. చివర్లో వరుసగా ఫోర్లు, సిక్స్ లు కొడుతూ మ్యాచ్ గెలిచేలా చేశాడు. ఐదు వరుస ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఈరోజు ఎల్ఎస్జీ మీద గెలిచింది.

    ipl
    CSK VS LSG

     



  • Apr 15, 2025 06:52 IST

    Ap Weather Alert: ఏపీలో వచ్చే మూడు రోజులు పిడుగులు,మెరుపులతో వానలు..!

    ఏపీలో రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.శ్రీకాకుళం,విజయనగరం,ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి.

    weather Updates



  • Apr 15, 2025 06:51 IST

    America-South Korea: అమెరికా పొమ్మంటుంది... దక్షిణ కొరియా రమ్మంటోంది!

    విద్యార్థులు, ఉద్యోగులను అమెరికా వెళ్లిపోమని చెబుతుండగా.. మరోవైపు దక్షిణ కొరియా రమ్మని పిలుస్తోంది.టాప్ టైర్ వీసాలను అందుబాటులోకి తెచ్చి.. మూడేళ్లకే అక్కడున్న విదేశీయులకు శాశ్వత నివాసం హోదాను కల్పించబోతుంది.

    VISA
    VISA Photograph: (VISA)

     



Advertisment
Advertisment
Advertisment