Telangana: కిడ్నాప్ ముఠాల కలకలం.. అమాయకులను కొడితే జైలుపాలే!

రాష్ట్రవ్యాప్తంగా చిన్నపిల్లల కిడ్నాప్ వార్తలు సంచలనం రేపుతున్నాయి. స్కూల్ పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందున్నారు. కొత్తగా కనిపించిన వ్యక్తులను దాడులు చేస్తుండగా పోలీసులు ప్రజలను హెచ్చరించారు. అమాయకులను కొడితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

New Update
Telangana: కిడ్నాప్ ముఠాల కలకలం.. అమాయకులను కొడితే జైలుపాలే!

Telangana: రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాలు సంచరిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో పిల్లల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఉదయం పిల్లలను స్వయంగా తల్లిదండ్రులే స్కూళ్లలో దింపి.. సాయంత్రం వారే ఇంటికి తీసుకొస్తున్నారు.

కొత్తగా కనిపిస్తే దాడులు..
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో చిన్నారులను కిడ్నాప్ చేసే ముఠాలు ప్రవేశించాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.. ఈక్రమంలో హనుమకొండ , ములుగు, నిజామాబాద్ , సిద్ధిపేట, వరంగల్, కామారెడ్డి సహా పలు జిల్లాల్లో పిల్లల కిడ్నాప్ ముఠాలు సంచరిస్తున్నాయన్న వార్తలు వైరల్ కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇక చిన్న పిల్లలను కిడ్నాప్ పై సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాలు, పట్టణాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనపడితే చాలు జనం వారిపై దాడికి పాల్పడుతున్న సంఘటనలు సైతం జరుగుతున్నాయి.

ఇది కూడా చదవండి : AP And TS: తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఎన్ఐఈఎల్ఐటీ సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం

వదంతులు నమ్మొద్దు..
ఇలాంటి ఘటనే ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. పట్ణణంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఓ వ్యక్తిపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. తీరా అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే.. అమాయకుడని తెలిసింది. మరోవైపు ఒక వ్యక్తి సూడీదార్ ధరించి పట్టణంలో హాల్ చల్ చేయగా అతన్ని పట్టుకొన్న స్థానికులు చేయి చేసుకున్నారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడున్న వారికి సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేశారు. మరోవైపు పిల్లల కిడ్నాప్ కు సంబంధించిన వీడియోలు ఫేక్ అని.. వీడియోల్లో కొన్ని పాతవని క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత పోలీసుల విచారణలో విషయం తెలిసి అవక్కయ్యారు. అతను ఒక గ్రామ కార్యదర్శి అని తరుచుగా ఆడవారి దుస్తులు ధరించి ప్రాంక్ వీడియోలు చేస్తాడని తేలింది. కాగా ఒక ఉద్యోగి అయి ఉండి ఇలాంటి వీడియోలు చేయడాన్ని పోలీసులు మందలించి వదిలిపెట్టారు.

కాగా ఇలాంటి ఘటనల్లో నిజాలు గ్రహించకుండా దాడికి పాల్పడుతుండటం వల్ల.. ప్రాణాలు కూడా కోల్పోయిన వారున్నారు. కాబట్టి ఎవరి మీద అయిన అనుమానం వస్తే.. ముందుగా పోలీసులకు సమాచారం అందించాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో చేసే దాడుల్లో అమాయకులు మరణిస్తే కేసులు నమోదవుతాయని వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు