Karnataka : హెచ్‌డీ రేవణ్ణపై కిడ్నాప్ కేసు..

కర్ణాటక సెక్స్ స్కాండల్‌లో నిందితులుగా ఉన్న హెచ్‌డీ రేవణ్ణ మరిన్ని చిక్కుల్లో ఇరుక్కున్నారు. సెక్స్ టేప్ బాధితుల్లో ఒకరి కుమారుడు...తన తల్లిని కిడ్నాప్ చేశాంటూ రేవణ్ణపై కంప్లైంట్ చేశారు. మైసూరులోని కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆయన మీద కిడ్నాప్ కేసు నమోదైంది.

New Update
Karnataka : హెచ్‌డీ రేవణ్ణపై కిడ్నాప్ కేసు..

Karnataka Sex Scandal : కర్ణాటకలో ప్రస్తుతం కలకలం రేపుతున్న అంశం సెక్స్ స్కాండల్. జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna), అతని తండ్రి హెచ్‌డీ రేవణ్ణలు చాలా మంది మహిళల మీద లైంగిక దాడులు చేయడమే కాక వాటిని వీడియోలు తీశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాదాపు 3వేల వీడియోలు దొరికాయని చెబుతున్నారు. ఇందులో ప్రధాన నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణ. ప్రస్తుతం ఇతను పరారీలో ఉన్నాడు. లైగింక ఆరోపణలు రాగానే ప్రజ్వల్ జర్మనీ పారిపోయాడు. కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం అతని మీద లుక్‌ అవుట్ నోటీసు కూడా జారీ చేసింది.

ఈ కేసులో మరో రిందితుగు హెచ్డీ రేవణ్ణ(HD Revanna). ఇతను కూడా జేడీ(ఎస్) నేత. ఒకప్పుడు మంత్రిగా కూడా పని చేశారు. హెచ్‌డీ రేవణ్ణ మీద అతని ఇంట్లో పని చేసిన బంధువుల మహిళే కంప్లైంట్ చేశారు. అతను తన మీద చాలాసార్లు లైంగిక దాడులకు(Sexual Scandal) పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు తాజాగా మరో బాధితురాలి కొడుకు తన తల్లి కనిపించడం లేదంటూ కిడ్నాప్ కేసు నమోదు చేశారు. మైసూరులోని కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు(Kidnap Case) నమోదైంది. దీంతో హెచ్డీ రేవణ్ణ మీద ఇప్పుడు కిడ్నాప్ కేసు కూడా నమోదయింది.

ఫిర్యాదు చేసిన బాలుడు తల్లి ఆరు ఏళ్ళు రేవణ్ణ ఇంట్లో పని చేసింది. మూడేళ్ళ క్రితం అక్కడ పని మానేసి కూలిగీ చేరింది. అయితే ఇప్పుడు ఎన్నికలకు మూడు రోజుల ముందు సతీష్ అనే వ్యక్తి తమ ఇంటికి వచ్చి రేవణ్ణ భార్య భవానీ రేవణ్ణ పిలుస్తారని తీసుకెళ్ళాడని చెప్పారు. ఏప్రిల్ 29న సతీష్ తన తల్లిపై పోలీసు కేసు పెడతామని..హెచ్డీ రేవణ్ణ పిలుస్తున్నారని తన తల్లిని బైక్‌ మీద ఎక్కించుకుని వెళ్ళాడు. అలా వెళ్ళిన తన తల్లి ఇప్పటి వరకు రాలేదని పిల్లాడు రాజు చెప్పాడు. తల్లిని విడిచిపెట్టమని సతీష్‌ బాబును కోరినప్పటికీ ఫలితం లేకుండ ఆపోయిందని చెప్పాడు. తన తల్లికి ప్రాణ హాని ఉందని..రేవణ్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు. సెక్స్ టేప్‌లో తన తల్లి ఉండడం..ప్రజ్వల్ రేవణ్న ఆమెను బుతూలు తిట్టడం తన స్నేహితులు, బంధువులు అందరూ చూశారని చెప్పుకొచ్చాడు రాజు.

Also Read:West Bengal: వెస్ట్ బెంగాల్ గవర్నర్ మీద లైగింక వేధింపు ఆరోపణలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?

దుబాయ్ నుంచి వచ్చిన భర్తను ప్రియుడితో కలిసి భార్య రజియా చంపేసింది. బాడీని ముక్కలు చేసి భర్త తెచ్చిన బ్యాగ్‌లోనే ప్యాక్ చేసి ఊరికి 55KM దూరంలో పడేశారు. ఎయిర్‌పోర్ట్‌లో QRకోడ్‌ స్టికర్ బ్యాగ్‌పై ఉంది. దానితోనే పోలీసులు కేసు చేధించారు. వారిని అరెస్ట్ చేశారు.

New Update
Uttar Pradesh Deoria

Uttar Pradesh Deoria

విదేశాల నుంచి తిరిగొచ్చిన భర్తను భార్య చంపి ముక్కలు ముక్కలు చేసింది. చివరికి అతను తెచ్చిన బ్యాగ్‌లో ప్యాక్ చేసి 55 కిలో మీటర్ల దూరంలో వేసింది. ఎంత పెద్ద క్రైమ్ చేసిన ఏదో ఓ చిన్న తప్పుతో దొరికిపోతారనే పోలీసుల మాట నిజమైంది. రజియా తన అక్రమ సంబంధానికి కొనసాగించేందుకు భర్త అడ్డు తొలగించుకోవాలని చూసింది. పక్కా ప్లాన్‌తో లవర్, అతని మేనల్లుడితో కలిసి భర్త నౌషాద్ అహ్మద్‌‌ను చంపి సూట్‌కేస్‌లో పెట్టింది. దాన్ని ఊరికి 55 కిలో మీటర్ల దూరంలో పడేశారు.

Also read: Woman kills husband: భర్తకు ఛాయ్‌లో ఎలుకల మందు.. పింటూతో నలుగురు పిల్లల తల్లి లవ్ ట్రాక్

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఇది చోటుచేసుకుంది. పది రోజుల క్రితం దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తిని అతని భార్య, ఆమె లవర్ హత్య చేశారు. బాధితుడి మృతదేహాన్ని ముక్కలుగా చేసి ట్రాలీ బ్యాగ్‌లో ప్యాక్ చేశారు. దాన్ని ఇంటి నుండి 55 కిలోమీటర్ల దూరంలో పడేశారు. తార్కుల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్ఖౌలి గ్రామంలో ఏప్రిల్ 21న తన పొలంలో అనుమానాస్పద బ్యాగ్ చూసి రైతు జితేంద్ర గిరి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి బ్యాగ్‌ తెరిచి చూస్తే.. ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టిన మొండెం, కాళ్ల కనిపించాయి. తలపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు ఉంది. మృతదేహం గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది. ఆ బ్యాగ్‌కు ఒక క్యూర్ కోడ్ ఉంది. అది ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ చెక్కింగ్ సమయంలో వేసింది. ఈ క్యూఆర్ కోడ్‌తో పోలీసులు కేసు ఛేదించారు. 

Also read: ACB caught: అడ్డంగా బుక్కైన మణుగూరు CI.. ఏసీబీకి ఎలా దొరికాడంటే?

విమానాశ్రయ అధికారులతో బార్‌కోడ్‌ను ట్రాక్ చేస్తే మృతుడు మెయిల్ పోలీస్ స్టేషన్‌లోని భటౌలి గ్రామానికి చెందిన నౌషాద్ అహ్మద్‌(38)గా గుర్తించారు. పోలీసులు అతని ఇంటికి వెళ్లినప్పుడు భార్య పోలీసుల ముందే భర్త కనిపించడం లేదని ఏడ్చింది. పోలీసులు ఇంట్లో వెతికగా.. రక్తపు మరకలతో ఉన్న మరో సూట్‌కేస్ దొరికింది. ఆమె ఆస్కార్ ఫర్మామెన్స్‌పై పోలీసులకు అనుమానం వచ్చి వారి స్టైల్లో విచారించారు. దీంతో రజియా, ఆమె ప్రేమికుడితో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. భర్తకు స్కెచ్ వేసిన రజియా అతను దుబాయ్ నుంచి తెచ్చిన అదే బ్యాగ్‌ వాడి దొరికిపోయింది. ఆమె మేనల్లుడు రుమాన్‌లో వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా వస్తు్న్నాడని హత్య చేసినట్లు పోలీసుల విచారణ తేలింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

అసలు ఏం అయ్యింది ఈ భార్యలకు.. మానవ విలువలు మట్టికలిసిపోతున్నాయా? నెల వ్యవధిలోనే ఇది ఐదో హత్య. మీరట్‌లో సౌరభ్, అమిత్ కశ్యప్, బరేలీలో కేహర్ సింగ్, హర్యానాలో ప్రవీణ్.. ఇప్పుడు నౌషాద్ అహ్మద్‌. వీరంతా భార్యల  వివాహేతర సంబంధానికి బలైన బాధితులు. ఈ వార్తలు విని పెళ్లీడుకు వచ్చిన యువకులు వివాహం చేసుకోవాలంటే భయంతో వణుకుతున్నారు. బతికుంటే జీవితాంతం.. ఇలా సింగిల్‌గానైనా ఉండొచ్చని అనుకుంటున్నారు.

Also read: Hydrogen Bomb: ప్రపంచానికి మరో విధ్వంసాన్ని పరిచయం చేసిన చైనా

(latest-telugu-news | crime news | wife cuts husband dead body)

 

 

Advertisment
Advertisment
Advertisment