Cars Recall : లక్ష కార్లను వెనక్కి తీసుకుంటున్న కియా, టెస్లా కంపెనీలు.. ఎందుకో తెలుసా!

కియా,టెస్లాతోపాటు మరో రెండు కార్ల కంపెనీలు లక్షకు పైగా కార్లను వెనక్కి తీసుకోనున్నట్లు సమాచారం.కార్లలో లోపాల వల్ల కంపెనీలు ఆ కార్లను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.రీకాల్‌ చేస్తున్న నాలుగు కంపెనీల్లో టెస్లా, కియాతో పాటు ఫోర్డ్‌ మోటార్‌, జీఎం ఏసియా పసిఫిక్‌ కూడా ఉన్నాయి.

New Update
Cars Recall : లక్ష కార్లను వెనక్కి తీసుకుంటున్న కియా, టెస్లా కంపెనీలు.. ఎందుకో తెలుసా!

KIA - TESLA : కియా,టెస్లాతోపాటు మరో రెండు కార్ల కంపెనీలు లక్షకు పైగా కార్లను వెనక్కి తీసుకోనున్నట్లు సమాచారం. ఆ కంపెనీల కార్లలో లోపాల వల్ల కంపెనీలు ఆ కార్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ విషయాన్ని దక్షిణ కొరియా (South Korea) రవాణా మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. కార్లను రీకాల్‌ చేస్తున్న నాలుగు కంపెనీల్లో టెస్లా, కియాతో పాటు ఫోర్డ్‌ మోటార్‌, జీఎం ఏసియా పసిఫిక్‌ కూడా ఉన్నాయి.

నాలుగు కంపెనీలకు సంబంధించిన ఏడు మోడల్స్‌లో 1,03,543 కార్లలో లోపాలు ఉన్నట్లు కంపెనీలు గుర్తించాయి. టెస్లా (TESLA) కంపెనీ కార్లలోని మోడల్‌ Y లో సాఫ్ట్‌వేర్ లోపం ఉందని నిపుణులు గుర్తించారు. కియా ప్రైడ్‌ కాంపాక్ట్‌ కారులోని హైడ్రాలిక్‌ ఎలక్ట్రిక్‌ కంట్రోల్‌ యూనిట్‌లో డ్యూరెబిలిటీ లేకపోవడంతో వాటిని వెనక్కి తీసుకుంటున్నారు.

అదేవిధంగా ఫోర్డ్‌ కంపెనీకి చెందిన Lincoln MKX SUV కారులో బ్రేక్‌ బూస్టర్‌లో లోపం ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. జీఎం ఏసియా పసిఫిక్‌ కంపెనీకి చెందిన Cadillac Lyriq All-Electric Sedan కారులో ఎలక్ట్రిక్‌ బ్రేక్‌ కంట్రోల్‌ మాడ్యూల్‌లో లోపం నిర్థారణ అయ్యింది. వాహన యజమానులు www.car.go.kr వెబ్‌సైట్‌ ద్వారాగానీ, 080-357-2500 నెంబర్‌కు కాల్‌ చేయడం ద్వారాగానీ తమ కారు రీకాల్‌ లిస్టులో ఉందో.. లేదో తెలుసుకోవచ్చని దక్షిణ కొరియా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల ఆరంభంలో కూడా బీఎండబ్ల్యూ కొరియా, హుందాయ్‌ మోటార్‌, రెండు ఇతర కంపెనీలు తయారీ లోపాల కారణంగా స్వచ్ఛందంగా 1,72,000 వాహనాలను వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.

Also Read: ఓటు కు నోటు కేసులో చంద్రబాబు కు భారీ ఊరట

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ట్రంప్ టారిఫ్‌లకు బ్రేక్.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1500 పాయింట్ల లాభం, నిఫ్టీ 23వేల మార్క్‌పైన ట్రేడింగ్‌తో స్టార్ట్ చేశాయి. నేడు టాటా మోటార్స్‌, లార్సెన్‌, శ్రీరామ్ ఫైనాన్స్, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

New Update
Stock Markets Today:మంచిరోజు...లాభాల్లో స్టాక్ మార్కెట్

ట్రంప్ టారిఫ్‌లకు కాస్త బ్రేక్ పడినట్లే. దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. వీటితో పాటు ఆర్‌బీఐ రెపో రేటును కూడా తగ్గించడం వల్ల సెన్సెక్స్ 1500 పాయింట్ల లాభం.. నిఫ్టీ 23వేల మార్క్‌పైన ట్రేడింగ్‌తో స్టార్ట్ చేశాయి. మార్నింగ్ 9.30 గంటల టైంలో సెన్సెక్స్‌ 1564 పాయింట్లతో 76,700 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 462 పాయింట్లతో 23,288 దగ్గర కొనసాగుతోంది. నేడు టాటా మోటార్స్‌, లార్సెన్‌, శ్రీరామ్ ఫైనాన్స్, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌యూఎల్‌, నెస్లే షేర్లు నష్టాల్లో ట్రేడ్‌వుతున్నాయి.

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

ఇది కూడా చూడండి: AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు