Kerala Express: కేరళ ఎక్స్‌ప్రెస్‌ కు తప్పిన పెద్ద ప్రమాదం...!

కేరళ ఎక్స్‌ ప్రెస్‌ కు తృటిలో పెద్ద ప్రమాదమే తప్పింది. ఖమ్మంరఘునాథపాలెం మండలం పాపటపల్లి రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫాం వద్ద ఓ యువకుడు బైక్‌ ను పట్టాలకు అడ్డంగా వదిలేయడం వల్ల రైలు బైక్‌ ని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. దీంతో కొద్దిగా మంటలు వ్యాపించాయి.

New Update
Kerala Express: కేరళ ఎక్స్‌ప్రెస్‌ కు తప్పిన పెద్ద ప్రమాదం...!

Kerala Express: కేరళ ఎక్స్‌ ప్రెస్‌ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలం పాపటపల్లి రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫాం వద్ద ఈ ఘటన జరిగింది. వృద్దుల కోసం నిర్మించిన చిన్న వంతెన మీద నుంచి బైక్‌ మీద వెళ్లేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. కానీ అదే సమయంలో కేరళ ఎక్స్‌ ప్రెస్‌ వస్తుండటం చూసి బక్‌ ను వదిలి పారిపోయాడు.

అదే సమయంలో కేరళ ఎక్స్‌ప్రెస్ వేగంగా వచ్చి వాహనాన్ని ఢీకొట్టింది. వాహనాన్ని రైలు చాలా దూరం ఈడ్చుకెళ్లింది. బైకులోని ట్యాంకు పగలి పెట్రోలు అంటుకోవడంతో మంటలు కూడా చెలరేగాయి. దీంతో కేరళ ఎక్స్‌ప్రెస్ కు పెద్ద ప్రమాదమే తప్పింది. అయితే బైక్ నెంబరు సాయంతో బైక్‌ ఎవరిదో పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు.

బైక్‌ వదిలి పారిపోయిన వ్యక్తిని ధరావత్ వీరన్నగా గుర్తించారు. కేవలం నిర్లక్ష్యం కారణంగా తనకు ప్రాణాపాయం తప్పినా... కేరళ ఎక్స్‌ప్రెస్ కు కూడా అదే సమయంలో ముప్పు తప్పింది.

Also Read: మోడీకి అమెరికా అధ్యక్షుడి నుంచి ఫోన్‌.. ఏ అంశాల గురించి చర్చించారంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు