Kate Middleton : అవును అది ఎడిట్‌ చేసిన ఫొటోనే.. తప్పు ఒప్పుకున్న రాజ కుటుంబం!

బ్రిటన్‌ రాజకుటుంబం ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కేట్‌ మిడిల్టన్ చిత్రంఒరిజినల్‌ ఫొటో కాదు..ఎడిట్‌ చేసిన ఫొటో అంటూ పెద్ద ఎత్తున దుమారం రేగింది.దీంతో బ్రిటన్‌ రాజకుటుంబం ఆ ఫొటో ఎడిట్ చేసిందే అని అంగీకరించింది. దీని గురించి క్షమాపణలు కోరింది.

New Update
Kate Middleton : అవును అది ఎడిట్‌ చేసిన ఫొటోనే.. తప్పు ఒప్పుకున్న రాజ కుటుంబం!

Edited Photo : బ్రిటన్‌(Britain) రాజకుటుంబం ఆదివారం మాతృదినోత్సవం(Mother's Day) సందర్భంగా విడుదల చేసిన ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కేట్‌ మిడిల్టన్(Princess Of Wales Kate Middleton) చిత్రం పై సోషల్‌ మీడియా(Social Media) పెద్ద రచ్చే జరిగింది. ఆ ఫొటో యువరాణి ఒరిజినల్‌ ఫొటో కాదు అని.. ఎడిట్‌ చేసిన ఫొటో అంటూ పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీంతో బ్రిటన్‌ రాజకుటుంబం దిగి వచ్చింది. వారు చేసిన తప్పును ఒప్పుకుంది.

ఆ ఫొటో ఎడిట్(Edited Photo) చేసిందే అని అంగీకరించింది. దీని గురించి క్షమాపణలు కూడా కోరింది. అసలేం జరిగిందంటే.. బ్రిటన్‌ రాజకుటుంబం ఆదివారం బ్రిటన్‌ మాతృదినోత్సవం నాడు కేట్‌ మిడిల్టన్‌ పిల్లలతో కలిసి ఉన్న ఓ ఫొటోను ఎడిట్‌ చేసి విడుదల చేసింది. ఆ ఫొటోలో యువరాణి తన ముగ్గురు పిల్లలతో కలిసి నవ్వుతున్నట్లు ఉంది.

కానీ ఆ చిత్రంలో కేట్‌ కుమార్తె ఎడమ చేయి సరైన అలైన్‌ మెంట్ లో లేకపోవడం వల్ల దానిని చూసిన వారికి అనుమానం వచ్చింది. అంతేకాకుండా యువరాణి చేతికి నిశ్చితార్ధపు ఉంగరం కూడా లేదు. దీంతో బ్రిటన్ పౌరులు ఒక్కసారిగా విమర్శలు చేయడం ప్రారంభించారు. అసలు యువరాణికి ఏమైంది అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు.

దీంతో జరిగిన తప్పును గుర్తించిన రాజ కుటుంబం క్షమించమని కోరింది. యువరాణి కేట్‌ గతేడాది జనవరి నుంచి కనిపించడం లేదు. దీంతో ఆమెకు కడుపులో శస్త్రచికిత్స జరిగిందని రాజ కుటుంబం తెలిపింది. ఆ తరువాత ఇప్పటి వరకు ఆమె ఎక్కడా కూడా కనిపించలేదు. దీంతో యువరాణి కేట్ కు సీరియస్‌ గా ఉందని కొందరు, ఇంకేదో అయ్యిందని మరి కొందరు రుమార్స్‌ పుట్టించడం మొదలు పెట్టారు.

ప్రజలు ఎంత ఎత్తున యువరాణి గురించి అడుగుతున్నప్పటికీ రాజ కుటుంబం మాత్రం దాని గురించి కనీసం నోరు కూడా విప్పలేదు. అసలు యువరాణి గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఆమె ఉన్న ఫొటోను ఎడిట్‌ చేసి విడుదల చేయడంతో ఆమె ఆరోగ్యం గురించి దేశ వ్యాప్తంగా మరోసారి చర్చ జరుగుతుంది. ఇంత జరిగినప్పటికీ కూడా యువరాణి మాత్రం బయటకు రాలేదు. దీంతో ఆమె కు ఏదో జరిగిందనే చర్చ జరుగుతుంది.

యువరాణికి సర్జరీ జరిగిన తరువాత ఆమె కోమాలోకి వెళ్లిపోయి ఉండొచ్చని ప్రచారం జరుగుతుంది. నిజానికి శస్త్రచికిత్స జరిగితే మూడు నాలుగు రోజుల్లోనే తిరిగి కోలుకోవచ్చని కొందరు అభిప్రాయ పడుతున్నారు. కానీ ఇలా ప్రపంచానికి కనిపించకుండా ఎందుకు ఉంటున్నారు అనే ప్రశ్నలు తలెత్తున్నాయి.

అసలు యువరాణి కేట్‌ కు ఏం జరిగిందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Also Read : యూరిక్‌ యాసిడ్‌ ని తగ్గించడంలో యాలకుల పాత్ర ఎలాంటిందంటే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన పుతిన్..!

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ దాడిలో దాడాపు 28 మంది పర్యాటకులు చనిపోయారు.ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఖండించారు. బాధితులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు

New Update
putin

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో మిని స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌లు స్పందిస్తూ.. తీవ్రంగా ఖండించారు. అలాగే, భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు కూడా దీనిపై విచారం వ్యక్తం చేశారు. పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఉగ్రదాడిలో దాదాపు 28 మంది పర్యాటకులు చనిపోయారు.

Also Read:Ap Weather Report:ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త మరి!

పహల్గాం ఉగ్రదాడిపై స్పందించిన  ట్రంప్.. ఈ ఉగ్రదాడి తనను తీవ్రంగా కలిచివేసిందని విచారం వ్యక్తం చేశారు. ‘కశ్మీర్ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు అమెరికా మద్దతుగా నిలుస్తుంది. దాడిలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. .గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. ప్రధాని నరేంద్ర మోదీ, భారత ప్రజలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది’ అని ట్రంప్  ట్రూత్ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read: J&K TerrorAttack:ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!

అటు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించారు. ‘ఈ క్రూరమైన నేరాన్ని సహించేది లేదు. ఈ దాడి వెనకున్న ఎంతటివారైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని ఆశిస్తున్నా. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్‌తో మా సహకారాన్ని మరింత పెంచుకోవడానికి ఎదురుచూస్తున్నాం. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నా" అని పుతిన్ అన్నారు.

భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు కూడా ఈ దాడి గురించి తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు. ఈ దాడిని వినాశకర ఉగ్ర దాడిగా అభివర్ణించారు. ‘భారత్‌లోని పహల్గాంలో ఉగ్ర దాడి ఘటనపై బాధిత కుటుంబాలకు నేను, ఉషా సంతాపం తెలుపుతున్నాం... కొన్ని రోజులుగా మేం ఈ దేశం అందాలు, భారతీయుల అభిమానానికి ఎంతో ముగ్దులయ్యాం.. ఈ భయానక దాడితో చనిపోయివారి కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తున్నాం’ ఈ మేరకు ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌పై వాన్స్ స్పందించారు.

కశ్మీర్ ఘటనపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కారోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. ‘జాతీయ భద్రతా సలహాదారు ద్వారా సమాచారం అందింది. దీనిపై ఎప్పటికప్పుడు అధ్యక్షుడికి సమాచారం అందిస్తున్నాం.. ఇప్పటివరకు తెలిసిన వివరాల ప్రకారం.. దక్షిణ కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతంలో జరిగిన భయానక ఉగ్రదాడిలో 28 మంది  చనిపోగా.. మరో 20 మంది తీవ్రంగా  గాయపడ్డారు. అధ్యక్షుడు ట్రంప్ తక్షణమే ప్రధాని మోదీతో మాట్లాడి ప్రాణాలు కోల్పోయినవారికి తన హృదయపూర్వక సంతాపం తెలియజేస్తారు.

 బాధితులకు, మా మిత్రదేశమైన భారత్‌కు మేము మద్దతుగా నిలుస్తాం.. ఇలాంటి భయానక ఉగ్రవాద దాడులే ప్రపంచంలో శాంతి, స్థిరత కోసం పనిచేస్తున్న మేమందరం మా కృషిని కొనసాగించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి..." అని పేర్కొన్నారు.

జమ్మూ అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాంలోని బైసరన్‌ లోయలో విహారయాత్రకు వచ్చిన పర్యాటకులే లక్ష్యంగా పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలు నిర్వహించే లష్కరే తొయిబా అనుబంధ విభాగం ది రెసిస్టెంట్ ఫ్రంట్ దాడికి పాల్పడింది. ఈ ఈ ఘటనలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో జమ్మూకశ్మీర్‌లో జరిగిన అతి పెద్ద ఉగ్రదాడి ఇదేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. ఈ ఘటనతో కశ్మీర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read: Ap: ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఆయనేనా?

Also Read: J&K TerrorAttack: పహల్గాం ఉగ్రదాడి.. ఇద్దరు ఏపీ వాసులు మృతి !

trump | putin | russia | america | Pahalgam attack | latest-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు