Indian Navy Jobs: ఇండియన్ నేవీలో టెన్త్ అర్హతతో జాబ్స్.. మొత్తం 910 ఖాళీలకు నోటిఫికేషన్.. వివరాలివే!

ఇండియన్‌ నేవీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ, బీఎస్సీ అర్హతతో మొత్తం 910 ఖాళీలను భర్తీ చేయనుండగా ఆసక్తిగల అభ్యర్థులు 2023 డిసెంబర్ 31 వరకూ ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించింది.

New Update
Indian Navy Jobs: ఇండియన్ నేవీలో టెన్త్ అర్హతతో జాబ్స్.. మొత్తం 910 ఖాళీలకు నోటిఫికేషన్.. వివరాలివే!

Indian Navy : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ నేవీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు తమ శాఖలో ఉన్న ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 910 ఛార్జ్ మ్యాన్, సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్, మేట్ తదితర ఖాళీలను భర్తీ చేయనుండగా కింద చూపిన విధంగా ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవాలని సూచించింది.

ఈ మేరకు ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఐఎన్ సెట్ -01/2023) ప్రకారం పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
1. ఛార్జ్ మ్యాన్ (అమ్యూనిషన్ వర్క్ షాప్) : 22
2. ఛార్జ్ మ్యాన్ (ఫ్యాక్టరీ) : 20
3. సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ (ఎలక్ట్రికల్) : 142
4. సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ (మెకానికల్) : 26
5. సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ (కన్ స్ట్రక్షన్) : 29
6. సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ (కార్టో గ్రాఫిక్) : 11
7. సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ (ఆర్మమెంట్) : 50
8. జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ సీ, నాజ్ గెజిటెడ్ ఇండస్ట్రీయల్, ట్రేడ్స్ మ్యాన్ మేట్ : 610

అలాగే ఇందులో కార్పెంటర్, ఇండస్ట్రియల్ పెయింటర్, ప్లంబర్, సర్వేయర్ సీవోపీఏ, డ్రెస్ మేకింగ్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫౌండ్రీ మ్యాన్, ఎలక్ట్రోప్లేయర్ తదితర పోస్టులున్నాయి.

ఇది కూడా చదవండి : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రూ.500కే సిలిండర్ ఎప్పటినుంచంటే

ఇక అర్హతల విషయానికొస్తే.. పోస్టును అనుసరించి 10వ తరగతి పాసై ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ, బీఎస్సీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. వయో పరిమితి 2023 డిసెంబర్ నాటికి ఛార్జ్ మ్యాన్,ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టులకు 25 ఏళ్లు మించదారు. సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ పోస్టులకు 27 ఏళ్లుండాలి.

అప్లికేషన్ ఫీజు.. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థలు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. జనరల్ కేటగిరి అభ్యర్థులు రూ.295 దరఖాస్తు ఫీజు కట్టాలి.అసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా 2023 డిసెంబర్ 18 నుంచి 2023 డిసెంబర్ 31 వరకూ అప్లై చేసుకోవాలి.

ఈ ఉద్యోగాల ప్రక్రియ అప్లికేషన్ స్ర్కీనింగ్, రాత పరీక్ష, డ్యాక్యూమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఉద్యోగంలో అర్హత సాధించినవారికి నెలకు బెసిక్ శాలరీ రూ.18,000తో మొదలవగా రిటైర్ మెంట్ నాటికి 56,900 వరకూ చెల్లిస్తారు.

అధికారిక వెబ్ సైట్ : https://www.joinindiannavy.gov.in/#

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

All India Civil Services ఇప్పటివరకు ఫోన్ వాడలేదు.. ఆల్ ఇండియా సివిల్స్ లో తెలంగాణ అమ్మాయికి 11వ ర్యాంకు

వరంగల్ కి చెందిన సాయి శివాని అనే విద్యార్థిని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవలే తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లోనూ సాయిశివాని రాష్ట్రస్థాయిలో 21వ ర్యాంకు, జోనల్ 1లో 11వ ర్యాంకు సాధించింది.

New Update

All India Civil Services సాధారణంగా చాలామంది సివిల్స్ క్లియర్ చాలా కష్టమని భావిస్తారు. కానీ కస్టపడి చదివితే సాధ్యం కానిది ఏదీ ఉండదు అని మరో సారి నిరూపించింది ఈ అమ్మాయి. తెలుగు తేజం సాయిశివాని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. 

Also Read: Viral News: ఫోన్ తీసుకుందని.. టీచర్‌ను చెప్పుతో కొట్టి, ల*జే అంటూ దాడిచేసిన విద్యార్థిని: (వీడియో)

సివిల్స్ లో ఆల్ ఇండియా 11వ ర్యాంకు 

వరంగల్ కి చెందిన సాయి శివాని ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తిచేసిన సాయి శివాని.. ఆ తర్వాత సివిల్స్ కోసం ప్రిపేర్ అవడం మొదలు పెట్టింది. కలెక్టర్  కలతో అహర్నిశలు కష్టపడింది. ప్రణాళికతో రోజుకు 12 గంటలు చదివింది. మొదటి సారి విఫలమైనా.. నిరాశ చెందలేదు. మళ్ళీ కష్టపడి చదివింది. రెండో ప్రయత్నంలో ఆల్ ఇండియా స్థాయిలో  11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది.  2023లో ఐదు మార్కులతో సాయిశివాని ప్రిలిమ్స్ మిస్సయింది. తిరిగి 2025లో తన కల నెరవేర్చుకుంది. 

Also Read: Pahalgam Attack: పహల్గాంలో నా బర్త్ డే వేడుకలు, షూటింగ్ కూడా.. విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్!

ఈ సందర్భంగా సాయిశివాని మాట్లాడుతూ.. ఇంతవరకు ఫోన్ వాడకపోవడం.. సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే తన కల నెరవేరడానికి కారణమని తెలిపింది. కలెక్టర్ కావాలనే లక్ష్యంతో కఠోర సాధన చేశాను. రోజుకు 12 గంటలు చదివాను. ఒత్తిడిని జయించడానికి యోగా, భగవద్గీత చదివేదాన్ని. ఈ విజయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సహకారం మరువలేనిది అని చెప్పింది. 

latest-news

Also Read: AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

Also Read: Viral Video అందరి ముందు భుజం పై నుంచి విజయ్ చేయి తీసేసిన విద్యార్ధి.. ఏం జరిగిందంటే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు