AP: నేడు ఏపీ టెట్ ఫలితాల విడుదల!
ఏపీ టెట్ ఫలితాలను ఇవాళ అధికారులు విడుదల చేయనున్నారు. ఫలితాలతో పాటు తుది కీని కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. టెట్ పరీక్షలు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు జరిగాయి.
ఏపీ టెట్ ఫలితాలను ఇవాళ అధికారులు విడుదల చేయనున్నారు. ఫలితాలతో పాటు తుది కీని కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. టెట్ పరీక్షలు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు జరిగాయి.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)లో 17,727 కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్(CGL) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నుంచి జులై 24 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టైర్-1 పరీక్ష సెప్టెంబర్ - అక్టోబర్, టైర్-2 పరీక్ష డిసెంబర్లో నిర్వహించనున్నారు.
ఏపీలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఫ్రీ అడ్మిషన్స్ ఇవ్వాలంటూ గత ప్రభుత్వం జారీ చేసి జీవోను హైకోర్టు కొట్టివేసింది. ఇది ప్రభుత్వ తొందరపాటు చర్య అని పేర్కొంది. అలాగే విద్యాహక్కు చట్టంలో ఉన్న ప్రొసీజర్లను ప్రైవేట్ శాఖ కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించాయి. సీఎం రేవంత్ నిరుద్యోగులను పట్టించుకోవట్లేదని, ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్ధానాలు చేసిందంటూ పది డిమాండ్లతో నిరసన చేపట్టారు.
నిరుద్యోగులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. పదో తరగతి అర్హతతో 484 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. అప్లికేషన్ ప్రక్రియ జూన్ 21-27 వరకు కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.
నీట్, యూజీసీ పరీక్షల అవకతవకల ఇష్యూపై కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్ నిర్వహణ ప్రక్రియలో సంస్కరణల కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీకి ఇస్రో మాజీ చీఫ్ కె.రాధాకృష్ణన్ నేతృత్వం వహించనున్నారు.
జూన్ 24నుంచి గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్లను అందుబాటులో ఉంచబోతున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. సాయంత్రం 5 గంటల నుంచి అధికారిక వెబ్సైట్లో వివరాలను ఎంటర్ చేసి తమ ఓఎంఆర్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది.
గ్రూప్-2 పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. జులై 5-31 వరకూ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచితంగా ఆన్లైన్ గ్రాండ్ టెస్టులు నిర్వహించనున్నట్లు తెలిపింది. జులై 5వరకూ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
నిరుద్యోగులకు మరో తీపి కబురు అందింది. పది అర్హతతో రాత పరీక్ష లేకుండా 40 వేల ఉద్యోగాలకు పోస్టల్ డిపార్ట్ మెంట్ జనవరిలో విడుదల చేసిన నోటిఫికేషన్ కు లైన్ క్లియర్ అయింది. త్వరలోనే ధరఖాస్తుల ప్రక్రియ మొదలవనుండగా పూర్తి వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.