JK Union Territory Status: జమ్ము రాష్ట్ర హోదాను ఎప్పుడు పునరుద్దరిస్తారు.... కేంద్రానికి సుప్రీం కోర్టు ప్రశ్న....!

జమ్ము కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం కేవలం తాత్కాలిక చర్యేనని కేంద్రం పేర్కొంది. భవిష్యత్ లో జమ్ముకు మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్రం వెల్లడించింది. జమ్ములో అన్ని పరిస్థితులు చక్కదిద్దిన తర్వాత ఆ మేరకు నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. జమ్ములో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు విచారణ చేపట్టింది.

author-image
By G Ramu
New Update
Year Ender 2023: ఈ ఏడాది సుప్రీంకోర్టు తీసుకున్నఈ చారిత్రాత్మక నిర్ణయాలు..అందరి దృష్టిని ఆకర్షించాయి..అవేవంటే..!!

JK Union Territory Status: జమ్ము కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం కేవలం తాత్కాలిక చర్యేనని కేంద్రం పేర్కొంది. భవిష్యత్ లో జమ్ముకు మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్రం వెల్లడించింది. జమ్ములో అన్ని పరిస్థితులు చక్కదిద్దిన తర్వాత ఆ మేరకు నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. జమ్ములో ఆర్టికల్ 370 (Article 370)ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు విచారణ చేపట్టింది.

విచారణ సందర్బంగా సుప్రీం కోర్టు ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. జమ్ము కశ్మీర్ పై ఈ తాత్కాలిక చర్య ఎంత కాలం అమలులో వుంటుందని ప్రశ్నించింది. జమ్ములో ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారని ఈ సందర్బంగా ధర్మాసనం అడిగింది. దీనికి కేంద్రం తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహత వివరణ ఇచ్చారు. అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు కేంద్ర చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

జమ్ము కశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ పార్లమెంట్ తీసుకున్న నిర్ణయానికి అనుమతి ఇచ్చేందుకు సుప్రీం కోర్టు కొంత ఆసక్తిగా కనిపించింది. అయితే జమ్ము కశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్దరణకు ఎంత సమయం పడుతుందని కేంద్రం భావిస్తుందో చెప్పాలని ధర్మాసనం అడిగింది. జమ్ములో ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు పునరుద్దరిస్తారని ప్రశ్నించింది.

అంతకు ముందు జమ్ము కశ్మీర్ లో 370 ని రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉందని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహత అన్నారు. రాజ్యాలు దేశంలో విలీనం అయిన సమయంలో అవి తమ విశేష అధికారాలను కోల్పోతాయని ఆయన వాదనలు వినిపించారు. అనంతరం ఆర్టికల్ 35 ఏ (Article 35 A) కశ్మీరేతరుల హక్కులను దూరం చేసిందరి సీజేఐ వెల్లడించారు. దీని ద్వారా కశ్మీర్ లో భూములు కొనుగోలు చేసే హక్కును వారు కోల్పోయారన్నారు.

Also Read: ఇమ్రాన్ ఖాన్ కు బిగ్ రిలీఫ్…. ట్రయల్ కోర్టు తీర్పును రద్దు చేసిన హైకోర్టు….!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Nainar Nagendran: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్

బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పార్టీ నేత, తిరునల్వేలి ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ ఎన్నికయ్యారు. చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు.

New Update
Nainar Nagendran declared BJP Tamil Nadu unit president

Nainar Nagendran declared BJP Tamil Nadu unit president

బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పార్టీ నేత, తిరునల్వేలి ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ ఎన్నికయ్యారు. చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే అధ్యక్ష పదవికి నాగేంద్రన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏకపక్షంగా పదవి ఆయనకే ఖరారైపోయింది. ఈ ఎన్నిక వెనుక అమిత్ షా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

Also Read: రేయ్ పాపం రా.. 13 కుక్కలను రేప్ చేసిన దుర్మార్గుడు- లైవ్ వీడియో వైరల్?

1960లో కన్యాకుమారి జిల్లా వడివీశ్వరంలో నాగేంద్రన్ జన్మించారు. 2001, 2011, 2021 ఎన్నికల్లో తిరునల్వేలి స్థానం నుంచి ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2001- నుంచి 2006 సమయంలో ఏఐడీఎంకే పార్టీలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 2017లో ఏఐడీఎంకేను వీడి బీజేపీలో చేరారు. 2020 జులై నుంచి పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉంటున్నారు. జయలలిత, పన్నీరుసెల్వం ప్రభుత్వాల్లో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. 

Also Read: సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ బిగ్ షాక్..

ప్రభుత్వ పాలనలో అనుభవం, ప్రజాధారణ, రాజకీయ వ్యూహాలపై పట్టుఉండటంతో అధిష్ఠానం ఆయన వైపే మొగ్గు చూపిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏఐడీఎంకే, బీజేపీలను సమన్వయం చేసుకోవడంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తారని అంటున్నారు. అయితే ఇటీవల రామేశ్వరంలో పాంబన్ వంతెన ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వేదికపై ప్రధాని మోదీతో పాటు నాగేంద్రన్ కనిపించారు. వాస్తవానికి బీజేపీలో రాష్ట్ర అధ్యక్షులు కావాలంటే పదేళ్ల పాటు ప్రాథమిక సభ్యత్వం ఉడాలి. కానీ పార్టీ అభివృద్ధికి నాగేంద్రన్ కృషి చేయడం వల్ల  ఆయనకు మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. 

telugu-news | rtv-news | national-news | bjp

Advertisment
Advertisment
Advertisment