Mobile Tariff : జియో.. ఎయిర్‌టెల్ కస్టమర్లకు ఎలర్ట్.. ఛార్జీలు పెరుగుతున్నాయ్!

జియో, ఎయిర్‌టెల్ తమ 5జీ సర్వీసుల ధరలను పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏడాది కాలంగా 4జీ సర్వీసుల ధరల్లోనే 5జీ సర్వీసులను కూడా అందిస్తూ వస్తున్నాయి. అయితే, ఈ సంవత్సరం 5జీ కోసం ప్రత్యేకంగా టారిఫ్ తీసుకువచ్చే అవకాశం ఉంది  

New Update
Airtel: Airtel వినియోగదారులకు షాక్..భారీగా పెరగనున్న టారిఫ్‌లు..!!

SIM Card Holders Alert : రిలయన్స్ జియో(Reliance Jio), ఎయిర్‌టెల్(Airtel) కస్టమర్లకు చేదువార్త. నిజానికి, ఈ  రెండు కంపెనీలు త్వరలో 5G సర్వీసుల  ఛార్జీలను పెంచబోతున్నాయి. దీని వల్ల వినియోగదారులు గతంలో కంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది. Jio -  Airtel  2024 సంవత్సరంలో  ప్రీమియం కస్టమర్ల కోసం తమ అపరిమిత 5G డేటా ప్లాన్‌లను తీసివేయవచ్చు. 4G కంటే 5G సర్వీసులకు కనీసం 5-10% ఎక్కువ ఛార్జీ విధించవచ్చు.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, రెండు టెలికాం కంపెనీలు ఛార్జీలు(Mobile Tariff) పెంచడం ద్వారా అధిక పెట్టుబడి- అధిక కస్టమర్ సముపార్జన ఖర్చుల మధ్య తమ RoCE (మూలధనంపై రాబడి)ని మెరుగుపరచాలనుకుంటున్నాయి. అందుకే 2024 సెప్టెంబర్ త్రైమాసికంలో మొబైల్ టారిఫ్‌లను కనీసం 20% పెంచవచ్చు. ఎయిర్‌టెల్ -  జియో ఒక సంవత్సరంగా  4G సర్వీస్ ధరతో వినియోగదారులకు 5G సేవలను అందిస్తున్నాయి. ఈ ఆఫ‌ర్‌తో క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. కానీ ఇప్పుడు ఇందులో మార్పులు చేయాల‌ని కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. వాస్తవానికి, రెండు కంపెనీలు దేశవ్యాప్తంగా తమ 5G సేవలను ప్రారంభించడంతో పాటు లాభాలు(Mobile Tariff) పెంచుకోవడం పై  దృష్టి సారించాయి.

Also Read: Gold Rate: మళ్ళీ బంగారం ధరల మోత.. ఈరోజు ఎంత పెరిగిందంటే.. 

5G ప్లాన్ ప్రారంభంతో మరింత డేటా అందుబాటులో ఉంటుంది. Jefferies Richter చెబుతున్న దాని  ప్రకారం, Jio -  Airtel 5G కవరేజ్ పూర్తయిన వెంటనే అపరిమిత 5G డేటాను అందించడాన్ని నిలిపివేయవచ్చు. అలాగే, సెకండాఫ్‌లో కొత్త 5G ప్లాన్‌ని తీసుకురావచ్చు. కస్టమర్లను ఆకర్షించడానికి, ఈ కంపెనీలు 5G ప్లాన్‌లలో 30 నుంచి 40 శాతం ఎక్కువ డేటాను అందించగలవు. దీంతో వినియోగదారుల సంఖ్య పెరుగుతుందని అంచనా.

ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు 4జి ధరల్లోనే 5జీని అందిస్తూ వస్తున్నాయి. దీంతో రెండు కంపెనీలకు కస్టమర్ బేస్ ఎక్కడ తగ్గకుండా నిలిచింది. కానీ, ఇప్పుడు 5జీ కోసం ప్రత్యేకమైన ధరలు తీసుకురావాలని అనుకుంటున్నారు. రెవెన్యూ పెంచుకోవడమే లక్ష్యంగా త్వరలోనే ధరలను పెంచే అవకాశం ఉందని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. 

Watch this interesting video :

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Gold Prices Today: భారీగా తగ్గిన బంగారం.. గ్రాము ఎంత ఉందంటే?

నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,340గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,140గా ఉంది. ఇక గ్రాము రేటు చూసుకుంటే.. రూ.9,834 గా మార్కెట్‌లో ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

New Update
Gold rate

Gold rate

గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు పైనే దాటింది. లక్ష లేనిదే బంగారం కొనలేరు. అందులోనూ తులం బంగారం అంటే చేతిలో లక్ష కంటే ఎక్కువగానే డబ్బులు పెట్టుకోవాలి. నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,340గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,140గా ఉంది. ఇక గ్రాము రేటు చూసుకుంటే.. రూ.9,834 గా మార్కెట్‌లో ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

ఏయే నగరాల్లో ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, ముంబైలో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, న్యూఢిల్లీ 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,834, కోల్‌కతా 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, బెంగళూరులో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, కేరళలో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, పూణే 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, అహ్మాదాబాద్ 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824గా ఉంది.

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్

 

Advertisment
Advertisment
Advertisment