Janhvi Kapoor: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్

తిరుమల తిరుపతి వెంకన్న అంటే అందరికి ఎంతో ఇష్టమైన దేవుడు. రోజుకు ఎంతో మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. అంతేకాదు రాజకీయ ప్రముఖులతో పాటు సినిమా వాళ్లు సైతం తిరుమలకు వచ్చి స్వామివారి సేవలో పాల్గొంటారు. నేడు యంగ్ బ్యూటీ స్వామిని దర్శించుకున్నారు

New Update
Janhvi Kapoor: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్

స్వామివారి సేవలో..

జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కొన్ని నెలల క్రితం ప్రియుడు శిఖర్‌ పహారియాతో కలిసి తిరుమల శ్రీవారిని సందర్శించుకున్నారు. అతిలోక సుందరిలాగే జాన్వీ కపూర్ తరచుగా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. తాగా జాన్వీ కపూర్ బ్లూ డ్రెస్‌లో వీఐసీ బ్రేక్‌ దర్శనం అయ్యేలా అధికారులు చేశారు. దర్శనం అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలను జాన్వీ కపూర్‌కు అందించారు.

అందాల తార, దివంగత శ్రీదేవి పెద్ద కూతురు, బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్ నేడు శ్రీవారిని దర్శించుకున్నారు. ఎంతో భక్తితో వేంకటేశ్వరస్వామిని దర్శనం కోసం ఆయలానికి వచ్చారు. స్వామిని దర్శనం చేసుకోని గుడి నుంచి బయటకు వచ్చారు. అంతేకాకుండా ఎంతో భక్తితో వెంకన్నకు సాష్టాంగ సమస్కారాలు చేసింది. జాన్వీకి తిరుమల వెంకటేశ్వరస్వామి అంటే చాలా ఇష్టమట. సంవత్సరంలో వెంకన్న కోసం చాలాసార్లు తిరుమలకు వస్తుంటానని చెప్పారు. ఈ అమ్మడు కొన్నిసార్లు స్వామి మీద భక్తితో కాలినడకన సైతం వస్తుందంట. అయితే నేడు (సోమవారం) లంగావోణిలో ఉదయం అచ్చమైన తెలుగు అమ్మాయిలా తయారై వచ్చిన శ్రీవారిని దర్శించుకున్నారు.

తెలుగు తెరకు పరిచయం

ప్రస్తుతం దేవర చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ మూవీతో తెలుగు తెరకు జాన్వీ కపూర్‌ పరిచయం అవుతున్నారు. అయితే ఈ మూవీ సంబంధించిన షూటింగ్‌ కొద్ది రోజులుగా వేగంగా నడుస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీని మాస్‌ డైరెక్టర్‌ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. సముద్రతీర ప్రాంతంలో నరరూప రాక్షసుల లాంటి వారిని ఎదుర్కొనే యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమాను తీసుకున్నారు. జాన్వీ కపూర్ తెలుగులో మొదటి సినిమాపై భారీ అంచనాలు వేస్తున్నారు సిని మేకర్స్‌. ఈ సినిమాకు సంబంధించి మొదటి షెడ్యూల్లో పాల్గొన్న జాన్వీ కపూర్.. మరో షెడ్యూల్‌కి సిద్దం అయ్యారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ పలు యాక్షన్‌ సన్నివేశాలు తీసినట్లు సమాచారం. దేవర తదుపరి షెడ్యూల్‌ షూటింగ్‌లో పాల్గొననున్నారు. అందుకే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది.

ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ఫస్ట్‌లుక్‌  

ఇక ఈ మూవీ మార్చి 31 ప్రారంభమైన విషయం తెలిసిందే. జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల చేయగా.. అభిమానులను యంగ్‌ బ్యూటీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్‌ అర్ట్స్‌.. యువసుధా అర్ట్స్‌ పతాకంపై రూపుద్దిదుకుంటున్న ఈ చిత్రం 2024 ఏప్రిల్‌ 5 విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది.అతిలోకసుందరి శ్రీదేవి పెద్దకూతురు తెలుగు మొదటి చిత్రంలో సైఫ్‌ అలీ ఖాన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Also Read: షూటింగ్ అప్ డేట్స్.. ఏ సినిమా ఎక్కడ?

Advertisment
Advertisment
తాజా కథనాలు