లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జనగామ మున్సిపల్‌ కమిషనర్‌

రూ.40 వేల లంచం తీసుకుంటూ జనగామ మున్సిపల్‌ కమిషనర్‌ రజిత ఏసీబీకి పట్టుబడ్డారు. కలెక్టరేట్‌ ఎదుట జీప్లస్‌-3 భవన నిర్మాణం చేపట్టగా అందులోనే 10 శాతం స్థలాన్ని మున్సిపాల్టీకి మార్ట్‌గేజ్‌ చేశారు. దానిని విడిపించేందుకు కమీషన్ తీసుకున్న రజితపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

New Update
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జనగామ మున్సిపల్‌ కమిషనర్‌

జనగామ జిల్లా మరో అవినీతి బయటపడింది. ఓ భవన నిర్మాణ విషయంలో పెద్ద మొత్తంలో కమీషన్ వసూల్ చేసిన మున్సిపల్‌ కమీషనర్ ను అవినీతి నిరోధకశాఖ అధికారులకు (ఏసీబీ) పట్టుకున్నారు.

ఈ మేరకు వరంగల్‌ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం బండ్లగూడెంకు చెందిన చెట్టిపల్లి రాజు గత ఏడాది జూన్‌లో జనగామ కలెక్టరేట్‌ ఎదుట జీప్లస్‌-3 భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో నిర్మాణాన్ని పూర్తిచేశారు. నిబంధనల ప్రకారం 10 శాతం స్థలాన్ని మున్సిపాల్టీకి మార్ట్‌గేజ్‌ చేశారు. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత మున్సిపల్‌ పట్టణ ప్రణాళిక విభాగం నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ సైతం తీసుకున్నారు. అయితే మున్సిపాల్టీకి కుదువ పెట్టిన 10 శాతం స్థలాన్ని విడిపించి ఇవ్వాలని కమిషనర్‌ రజితకు దరఖాస్తు చేశారు. స్థలాన్ని విడిపించేందుకు రూ.60 వేలు ఇవ్వాలని కమిషనర్‌ అడగ్గా దీనిపై ఆయన ఏసీబీ అధికారులను సంప్రదించారు.

Also read : Telangana Elections: కాంగ్రెస్ నేత వివేక్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు..

ఈ క్రమంలోనే అధికారుల సూచనల మేరకు రాజు రూ.40 వేలు తీసుకెళ్లగా తన డ్రైవర్‌ నవీన్‌కు ఇవ్వాలని రజిత సూచించారు. నవీన్‌కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కమిషనర్‌ ఆదేశాల మేరకే తాను డబ్బులు తీసుకున్నట్లు డ్రైవర్‌ అంగీకరించాడు. కమిషనర్‌ రజితను, డ్రైవర్‌ నవీన్‌ను కస్టడీలోకి తీసుకున్నామని, వారిని విచారించి కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సోదాల్లో డీఎస్పీతో పాటు ఇన్‌స్పెక్టర్లు శ్యామ్‌, రవి, శ్రీనివాస్‌ పాల్గొన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వార్త జనగామ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Andhra Pradesh: ఏపీలో దారుణం.. టీడీపీ నేతను నరికి నరికి

ఒంగోలులో మాజీ ఎంపీపీ, టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. తన ఆఫీసులో ఉండగా ముగ్గురు దుండగులు వచ్చి కత్తులతో దాడులు చేశారు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా ఆయన అప్పటికే మృతి చెందారు.

author-image
By B Aravind
New Update

ఒంగోలులో దారుణం జరిగింది. మాజీ ఎంపీపీ, టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. పద్మ టవర్స్‌లోని తన ఆఫీసులో ఉండగా ముగ్గురు దుండగులు వచ్చి కత్తులతో దాడులు చేశారు. ఆ తర్వాత స్థానికులు వీరయ్యను సమీప ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే లిక్కర్‌ సిండికేట్‌ విషయంలో గత కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 

Also Read: ముంబై నుంచి హీరోయిన్‌ని తీసుకొచ్చి.. అరెస్టైన ఆ IPS చేసిన పని ఇదేనా..?

 

Advertisment
Advertisment
Advertisment