AP Government: ఏపీలోని పేదలకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఈ నెల 18 నుంచి ఆ కార్డుల పంపిణీ!

ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీపై ప్రకటన రిలీజ్ చేశారు. డిసెంబర్ 20 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

New Update
AP Elections 2024: ఏపీ ఎన్నికలు.. సీఎం జగన్ కీలక నిర్ణయం!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు శుభవార్త చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కాయక్రమంలో గుర్తించిన రోగుల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. వాళ్లందరికీ సకాలంలో మందులు అందించడంతోపాటు మందుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పేదలకు మెరుగైన వైద్యారోగ్య సేవలు అందించే విషయంలో ఎక్కడా కూడా రాజీపడొద్దని అధికారులకు సీఎం సూచించారు.

ఆరోగ్యశ్రీ వినియోగంపై అన్ని ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు జగన్ సూచనలు జారీ చేశారు. డిసెంబర్ 20 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రతిఒక్కరి ఫోన్లో ఆరోగ్య శ్రీ తోపాటు దిశ యాప్స్ కూడా ఉండేలా అవగాహన కల్పించాలని సీఎం చెప్పారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నరోగులకు సకాలంలో మందులు అందించాలన్నారు.

అసుపత్రుల్లో ఎక్కడా కూడా సిబ్బంది కొరత ఉండకూదన్ని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గుర్తించిన రోగులకు చేయూతనిచ్చే కార్యక్రమంపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎం తెలిపారు. దిగువస్థాయి వైద్య సిబ్బంది నుంచి సకాలంలో ఇండెంట్ వస్తే వెంటనే సమయానికి మందులు ఇవ్వాలని సూచించారు. ఫ్యామిలి డాక్టర్ ప్రతి గ్రామానికి వెళ్తూ మందులు అందాయా లేదా తెలుసుకోవాలని తెలిపారు. జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో దశ కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

ఇది కూడా చదవండి: మహిళలకు గుడ్ న్యూస్..ఖాతాల్లోకి రూ. 6వేలు..సర్కార్ అందిస్తున్న ఈ సాయం గురించి మీకు తెలుసా..?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pastor Praveen-KA Paul: ట్రంప్ కు చెప్పా.. తర్వాత చచ్చే ఆ 100 మంది వీళ్లే.. కేఏ పాల్ సంచలన ప్రెస్ మీట్!

పాస్టర్ ప్రవీణ్ మృతి విషయాన్ని ట్రంప్ దృష్టికి తీసుకుని వెళ్లానని KA పాల్ తెలిపారు. న్యాయం జరగకపోతే FBI వరకూ తీసుకుని వెళ్తానన్నారు. మరో 100 మంది పాస్టర్ లను టార్గెట్ చేసినట్లు తనకు సమాచారం ఉందన్నారు. ప్రవీణ్ పగడాలకు మద్యం తాగే అలవాటు లేదన్నారు.

New Update

పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ గాంధీనగర్ లో ఈ రోజు మీడియాతో పాల్ మాట్లాడారు. పాస్టర్ ప్రవీణ్‌ ది హత్య అనే చెప్పేందుకు తన దగ్గర అనేక ఆధారాలు ఉన్నాయన్నారు. ఇదే విషయాన్ని హై కోర్టులో కూడా తాను చెప్పానన్నారు. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఈ కేసును ఛేదించడంలో విఫలం అయ్యారని ఆరోపించారు. 24 సంవత్సరాలుగా ప్రవీణ్ పగడాలకు మద్యం తాగే అలవాటు లేదన్నారు. చనిపోయి 22 రోజులు గడుస్తున్నా పోస్టుమార్టం రిపోర్ట్ ఎందుకు బయటికి ఇవ్వలేదని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: ఏం తమాషాలా.. గంటాపై టీడీపీ హైకమాండ్ సీరియస్!

ఎస్పీతో చంద్రబాబు ఎందుకు మాట్లాడారు..?

ఈ దుర్మార్గులు ప్రవీణ్ ను తాగుబోతుగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టుమార్టం రిపోర్టు విడుదల చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎందుకు క్లోజ్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఘటనకు ముందు ప్రవీణ్ కు చాలా బెదిరింపులు వచ్చాయన్నారు. బెదిరింపుల గురించి ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎస్పీ తో సీఎం చంద్రబాబు 45 నిమిషాలు ఎందుకు మాట్లాడారు..? అని అనుమానం వ్యక్తం చేశారు. 
ఇది కూడా చదవండి: Vijayashanthi: పవన్ ఫ్యామిలీ జోలికొస్తే తాటతీస్తా.. రాములమ్మ స్ట్రాంగ్ వార్నింగ్!

రాష్ట్రంలో చర్చిలు ఎన్ని ఉన్నాయో పవన్ కళ్యాణ్ ఎందుకు ఆరా తీశారు..? అని ఫైర్ అయ్యారు. మరో 100 మంది పాస్టర్ లను టార్గెట్ చేసినట్లు తనకు సమాచారం ఉందన్నారు. ఈ విషయాన్ని ట్రాంప్ దృష్టికి తీసుకుని వెళ్లానన్నారు. ఇక్కడ న్యాయం జరగకపోతే FBI వరకూ తీసుకుని వెళ్తానని ప్రకటించారు. ప్రవీణ్ మద్యం తాగి ఉంటే విజయవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. 

(Pastor Praveen | telugu-news | telugu-latest-news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు