IT Jobs: ఐటీ కంపెనీలు మారుతున్నారా.. హైక్‌లు ఇంతే..

ఇప్పటికే ఐటీ కంపెనీలు.. ఖర్చులు తగ్గించుకోవడం కోసం తమ ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో.. ప్రస్తుతం ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం నడుస్తుంది. అలాగే కంపెనీ మారాలనుకునే ఉద్యోగులకు కూడా మిగతా కంపెనీలు 18-22 శాతం వరకే హైక్‌లు ఇస్తున్నాయి.

New Update
IT Jobs: ఐటీ  కంపెనీలు మారుతున్నారా.. హైక్‌లు ఇంతే..

IT Salary Hikes: చదువు అయిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో చాలామంది ఐటీ ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు. కొవిడ్ వచ్చిన తర్వాత ఐటీ రంగానికి మరింత గిరాకీ పెరిగిపోయింది. కానీ ఈమధ్య కొత్త ప్రాజెక్టులు తగ్గిపోతున్నాయి. చాలావరకు టెక్ కంపెనీలు ఆదాయాన్ని తగ్గించుకునేందుకు చాలామందిని ఉద్యోగంలో నుంచి తీసేశాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధం పరిణామాల వల్ల ద్రవ్యోల్బణం పెరగడం, అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు ఐటీ రంగానికి ప్రస్తుతం గొడ్డలి పెట్టుగా మారాయి. అయితే తాజాగా ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. భయాలు మరింత ఎక్కువయ్యాయి. వీటి ఫలితంగా ఉద్యోగాల మార్కెట్లో నియామకాలు అనే వార్తల కన్నా తొలగింపులే ఎక్కువగా కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, మెటా, అమెజాన్‌ వంటి పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థల నుంచి చిన్న కంపెనీల వరకూ వ్యయ నియంత్రణ పేరిట అధిక వేతనాలన్న నిపుణులను తగ్గించుకుంటున్నాయి. దీనివల్ల ఐటీ నిపుణులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ఇందులో భాగంగానే ఇతర కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఐటీ రంగం అంతటా కూడా కాస్ట్‌ కటింగ్‌ సమస్యలు కనిపిస్తున్నాయి. దీనివల్ల కొత్తగా చేర్చుకునే వారికి ఇంతకుముందు భారీగా జీతాలు పెంచేసి ఉద్యోగాల్లో నియమించుకునే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. ఇక కంపెనీ మారాలనుకునే వారికి పాత జీతంపై 18-22 శాతం మాత్రమే పెంచి ఉద్యోగాలు కల్పిస్తున్నారు.

Also read: ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి కృత్రిమ వర్షం

ఇక ఐటీ ఉద్యోగాలు మారాలనుకునే వాళ్లకి జీతాల పెంపు గత ఆర్థిక ఏడాదితో పోల్చిచూస్తే.. దాదాపు సగానికి పడిపోయాయి. ఇంతకుముందు కంపెనీలో ఉన్న జీతంతో పోలిస్తే కేవలం 18-20 శాతం పెంపుతో ఉద్యోగంలో చేర్చుకుంటున్నారు. అయితే గతంలో అభ్యర్థులకు కనిష్ఠంగా 40 శాతం.. అలాగే గరిష్ఠంగా 100-120 శాతం వరకు వేతనం పెంచాలని డిమాండ్‌ చేసేవారని నివేదికలు చెబుతున్నాయి. కానీ ఇప్పుడు ఆ డిమాండ్‌ 35-40 శాతం వరకు పడిపోయినట్లు తెలుస్తోంది. ఉదాహరణకు 2022లో ఫుల్‌స్టాక్ ఇంజినీర్లకు ఏటా రూ.15లక్షలు-రూ.32 లక్షల వరకు వేతనం ఉండేది. అయితే ఈఏడాది సగటున 8-16 శాతం తగ్గించి ఏటా రూ.12లక్షలు-రూ.28 లక్షలకు ఆఫర్ చేస్తున్నాయి కంపెనీలు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini: పోలీసులకు చిక్కిన అఘోరీ-శ్రీవర్షిణీ.. తెలంగాణకు పయణం!

అఘోరీ, శ్రీవర్షిణీని పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. బృందాలుగా ఏర్పడిన పోలీసులు వారిని కేదరీనాథ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం వారిద్దరినీ తెలంగాణకు తీసుకువస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

New Update
aghori sri varshini

aghori sri varshini

అఘోరీ - శ్రీ వర్షిణీ వ్యవహారం రోజు రోజుకూ సినిమాను తలపిస్తోంది. రెండు రాష్ట్రాల్లో ఇప్పుడంతా వీరి వ్యవహారమే నడుస్తోంది. ఎక్కడ చూసినా అఘోరీ, శ్రీవర్షిణీ గురించే చర్చలు. కాగా ఇప్పుడు వీరిద్దరూ పరారీలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారో ఆచూకీ లేదు. ఇటీవలే ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. తమపై నెగెటివ్‌గా ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. 

Also Read :  ఆగని యుద్ధం.. 30 వేల మంది యువతను నియమించుకున్న హమాస్ !

అంతేకాకుండా ప్రచారం ఆపకపోతే.. తామిద్దరం ఆత్మార్పణం చేసుకుంటామని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వారు కనిపించకుండా పోయారు. ఇక వారిపై రెండు కేసులు నమోదు కావడంతో అరెస్టు చేస్తారనే భయంతో అందుబాటులో లేరని ప్రచారం నడుస్తోంది. అయితే వారిపై కేసులు నమోదు అయిన నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. అఘోరీ, శ్రీవర్షిణీని పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. 

Also Read :  కేవలం రూ.300 వందలకే ఇంటింటికీ ఇంటర్నెట్.. రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!

చిక్కిన అఘోరీ, శ్రీవర్షిణీ

అందుతున్న సమాచారం ప్రకారం.. తాజాగా అఘోరీ, శ్రీవర్షిణీని పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. వారిని కేదరినాథ్‌లో పట్టుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. వారిద్దరినీ అదుపులోకి తీసుకుని తెలంగాణకు తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ నిజంగానే వారిని పట్టుకుని తెలంగాణకు తెచ్చిన తర్వాత అరెస్టు చేసి జైలుకు పంపిస్తారా? లేదా? అనే దాని గురించి పలువురు చర్చించుకుంటున్నారు.

Also Read: మావోయిస్టు అగ్రనేత హతం.. వివేక్‌ను మట్టుబెట్టిన భధ్రతాబలగాలు!

 

ఇకపోతే అల్లూరి శ్రీనివాస్.. అఘోరీ వేషంలో తిరుగుతూ అమ్మాయిలను మోసం చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. అఘోరీ, శ్రీ వర్షినీ ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నారో.. అప్పటి నుంచి వీరి ఎపిసోడ్స్ మరింత హాట్ టాపిక్‌ అయింది. నేనే అఘోరీ మొదటి భార్యను అంటూ రాధిక అనే మహిళ మీడియా ముందుకు వచ్చింది. 

Also Read: కర్ణాటక డీజీపీ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. తండ్రి హత్యకు సహకరించిన కూతురు?

నన్నే మొదట పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. నాకు మాయమాటలు చెప్పి ఇప్పుడు వర్షిణీ అనే అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేసింది. దీని తర్వాత అఘోరీ-శ్రీవర్షిణీ వ్యవహారంలోకి ట్రాన్స్ జెండర్స్ ఎంటర్ అయ్యారు. అఘోరీ ట్రాన్స్ జెండర్ల పేరు గంగపాలు చేసిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అఘోరీపై రెండు కేసులు నమోదు అయ్యాయి. 

aghori sri varshini | Lady Aghori Sri Varshini | latest telugu news | today news in telugu | telugu-news today news

Advertisment
Advertisment
Advertisment