KKR: కమ్‌బ్యాక్‌ కెప్టెన్‌.. కమ్‌బ్యాక్‌ మెంటర్.. ఈసారి ప్రత్యర్థులకు దబిడి దిబిడే!

ఐపీఎల్‌-2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్‌ను ఎంపిక చేసింది మ్యానేజ్‌మెంట్‌. వైస్‌కెప్టెన్‌గా నితీశ్‌రాణాను నియమించింది. ఇక కేకేఆర్‌ ఇప్పటికే గౌతమ్ గంభీర్‌ను మెంటార్‌గా అపాయింట్ చేసిన విషయం తెలిసిందే. 2012 , 2014లో కోల్‌కతాను గంభీర్‌ రెండు సార్లు విజేతగా నిలిపాడు.

New Update
KKR: కమ్‌బ్యాక్‌ కెప్టెన్‌.. కమ్‌బ్యాక్‌ మెంటర్.. ఈసారి ప్రత్యర్థులకు దబిడి దిబిడే!

ఐపీఎల్‌(IPL)-2024 సీజన్‌కు ఇంకా మూడు నెలలుకుపైగా సమయం ఉంది. అయినా ఇప్పటినుంచే ఐపీఎల్‌ గురించి ఫ్యాన్స్‌లో తెగ చర్చ జరుగుతోంది. అందులోనూ డిసెంబర్‌ 19న ఐపీఎల్‌ ఆక్షన్ ఉండడంతో అభిమానులు ఇప్పటినుంచే లెక్కలు వేసుకుంటున్నారు. చెన్నై, ముంబై జట్ల అభిమానులకు కెప్టెన్ ఎవరన్నది అందరికి తెలిసిందే. కెప్టెన్సీ విషయంలో ఈ రెండు జట్ల గురించి పెద్దగా చర్చ జరగదు కానీ మిగిలిన జట్లకు కెప్టెన్‌గా ఎవరుంటారన్నదానిపై విపరీత చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సన్‌రైజర్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌(Kolkata Knight Riders) కెప్టెన్లు ఎవరన్నదాన్నిపై ఫ్యాన్స్‌ ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు జట్లకు కెప్టెన్సీ మార్పు ఎంతైనా అవసరం. ఇదే సమయంలో కేకేఆర్ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్ ఎవరో తేలిసిపోయింది.

కోల్‌కతా కెప్టెన్‌గా వరల్డ్‌కప్‌హీరో:
కేకేఆర్‌ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) కొనసాగుతాడని కోల్‌కతా నైట్ రైడర్స్ CEO వెంకీ మైసూర్ ప్రకటించారు. శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా ఈ సీజన్‌ ఐపీఎల్‌లో ఆడలేదు. ఈ సీజన్‌లో నైట్ రైడర్స్ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో నిలిచింది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో కేవలం ఆరు మ్యాచ్‌లే గెలిచింది నైట్‌రైడర్స్‌. ఏ దశలోనూ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ ఏడాది కెప్టెన్‌గా నితీశ్‌రాణా వ్యవహరించాడు. ఇప్పుడు మళ్లీ శ్రేయాస్‌ అయ్యర్‌ గాయం నుంచి కోలుకోని వరల్డ్‌కప్‌లోనూ అదరగొట్టడంతో వచ్చే సీజన్‌లో అయ్యర్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది మ్యానేజ్‌మెంట్. వైస్‌కెప్టెన్‌గా నితీశ్‌రాణా ఉండనున్నాడు.

publive-image శ్రేయాస్ అయ్యర్ (FILE)

కమ్‌బ్యాక్‌ కెప్టెన్‌.. కమ్‌బ్యాక్‌ మెంటర్:
'గాయం కారణంగా శ్రేయాస్ IPL 2023కి దూరమవడం నిజంగా దురదృష్టకరం. అతను తిరిగి వచ్చి కెప్టెన్‌గా నాయకత్వం వహించినందుకు మేము సంతోషిస్తున్నాము. గాయం నుంచి కోలుకోవడానికి అతను కష్టపడి పనిచేసిన విధానం, అతని ఫామ్ ప్రదర్శించడం అతని పాత్రకు నిదర్శనం.' అని వెంకీ మైసూర్ తెలిపారు. ఇక ఈ వరల్డ్‌కప్‌లో అయ్యర్‌ అదరగొట్టాడు. ఆస్ట్రేలియాపై ఆడిన తొలి మ్యాచ్‌లో విఫలమైనా.. తర్వాత లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో రాణించాడు. ముఖ్యంగా సెమీస్‌లో అయ్యర్‌ చేసిన మెరుపు శతకాన్ని అభిమానులు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. సెమీస్‌లో భారత్‌ గెలుపునకు అయ్యర్‌ ఇన్నింగ్సే కారణమని చెప్పవచ్చు. టోర్నీలో మొత్తం 500కు పైగా పరుగులు రాబట్టాడు అయ్యర్‌. ఇక ఇదే ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగించాలని.. ఆ జట్టు మ్యానేజ్‌మెంట్ భావిస్తోంది. మరోవైపు గత నెలలో గౌతమ్ గంభీర్ మెంటార్‌గా ఫ్రాంచైజీకి తిరిగి వచ్చినట్లు నైట్ రైడర్స్ ధృవీకరించింది. గంభీర్ 2012 , 2014లో కోల్‌కతాను రెండు సార్లు విజేతగా నిలిపాడు. 2018 సీజన్‌కు ముందు జట్టు అతడిని విడుదల చేసింది. ఇక గంభీర్‌ రిటైర్మెంట్ తర్వాత అతను లక్నో సూపర్ జెయింట్స్‌కు రెండేళ్లపాటు (2022,2023లో) మెంటార్‌గా పనిచేశాడు. ఇక తిరిగి మళ్లీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చెంతకు చేరాడు.

Also Read: ఐదుగురు లోక్‌సభ ఎంపీలు సస్పెన్షన్‌..!

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB VS RR: డ్రెస్ మార్చింది.. విజయం కొట్టింది- RCB ఖాతాలో మరో గెలుపు

బెంగళూరు జట్టు ఖాతాలో మరో విజయం పడింది. ఇవాళ రాజస్తాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను అలవోకగా ఛేదించింది. ఆర్ఆర్ జట్టు నిర్దేశించిన 174 లక్ష్యాన్ని కేవలం 1 వికెట్ నష్టపోయి గెలుపొందింది. 

New Update
RCB VS RR

RCB VS RR Photograph: (RCB VS RR)

బెంగళూరు ఖాతాలో మరో విజయం పడింది. ఇవాళ రాజస్తాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను అలవోకగా ఛేదించింది. ఎలాంటి ఉరుములు లేవు.. ఎలాంటి మెరుపులు లేవు.. కానీ తుఫాన్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయినట్లు బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఆర్ఆర్ జట్టు నిర్దేశించిన 174 లక్ష్యాన్ని కేవలం 1 వికెట్ నష్టపోయి గెలుపొందింది. 

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

టాస్ గెలిచి బౌలింగ్

మొదట టాస్‌ గెలిచిన బెంగళూరు బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్‌, జైస్వాల్‌ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. వరుస పరుగులు రాబట్టారు. ఇలా 5 ఓవర్లకు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 36 పరుగులు సాధించారు. సరిగ్గా అప్పుడే ఆర్ఆర్‌కు షాక్ తగిలింది. సంజు శాంసన్‌ (15) ఔట్‌ అయ్యాడు. ఇలా 10 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 77 పరుగులు సాధించారు. 

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

అలా వరుసగా వికెట్లు కోల్పోయింది ఆర్ఆర్ జట్టు. రియాన్‌ పరాగ్‌ (30), జైస్వాల్‌ (75), హెట్‌మయర్‌ (9), ధ్రువ్‌ జురెల్‌ (35*), నితీశ్‌ రాణా (4*) పరుగులు సాధించారు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆర్ఆర్ జట్టు 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఈ లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ జట్టు చాలా సహనంతో ఆడింది. క్రీజులోకి వచ్చిన ఫిల్‌ సాల్ట్‌, విరాట్‌ కోహ్లీ నెమ్మదిగా పరుగులు రాబట్టారు. 

Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

ఇద్దరూ సగానికి పైగా పరుగులు చేశారు. అంతేకాకుండా చెరో హాఫ్ సెంచరీతో మెరిసారు. అయితే ఆర్ఆర్ జట్టు వరుస క్యాచ్‌లు డ్రాప్ చేయడంతో విజయం బెంగళూరు సొంతం అయిందనే చెప్పాలి. ఫిల్‌సాల్ట్‌ (65) ఔట్‌ అయ్యాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. స్కోర్ భారీగా ఉంది. 10 ఓవర్లకు స్కోర్‌ 101/1గా ఉంది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 39 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా ఆ ఒక్క వికెట్ కోల్పోయి బెంగళూరు జట్టు విజయం సాధించింది. విరాట్‌కోహ్లీ 62*, దేవ్‌దత్‌ పడిక్కల్‌ 40* రాణించారు. 17.3 ఓవర్లలో 175 పరుగులు చేసింది ఆర్సీబీ.

Advertisment
Advertisment
Advertisment