US Jury : చేయని నేరానికి పదేళ్ల జైలు...రూ. 419 కోట్ల పరిహారం

నేరం చేయకపోయినా పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తికి అమెరికా కోర్టు ఏకంగా 419 కోట్లను నష్టపరిహారంగా అందజేసింది. 19 ఏళ్ల వ్యక్తిని హత్య చేశాడన్న అభియోగాలపై మార్సెల్‌ బ్రౌన్‌ అనే వ్యక్తిని 2008లో అరెస్ట్ చేసి శిక్ష విధించారు.

author-image
By Bhavana
New Update
చేయని నేరానికి పదేళ్ల జైలు…రూ. 419 కోట్ల పరిహారం

US Jury :

నేరం చేయకపోయినా పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడో ఓ వ్యక్తి. చివరికి అతను ఏ తప్పు చేయలేదని తెలియడంతో కోర్డు అతనిని విడిచిపెట్టింది. అయితే ఇన్నేళ్ల పాటు అన్యాయంగా ఆయన జైలు జీవితానికి పరిమితమైనందుకు ఏకంగా 50 మిలియన్‌ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

అమెరికా లోని చికాగో ఫెడరల్‌ జ్యూరీ కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది. 19 ఏళ్ల వ్యక్తిని హత్య చేశాడన్న అభియోగాలపై మార్సెల్‌ బ్రౌన్‌ అనే వ్యక్తిని 2008లో పోలీసులు అరెస్ట్ చేశారు. దీని పై అప్పట్లో విచారణ జరిపిన న్యాయస్థానం అతడిని దోషిగా నిర్దారిస్తూ 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే అతడితో బలవంతంగా నేరాంగీకారం చేయించారిని చెబుతూ 2018 లో బ్రౌన్‌ తరుపున న్యాయవాదులు కోర్టుకు సాక్ష్యాధారాలు సమర్పించారు.

దీంతో అతడిపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేస్తూ బ్రౌన్‌ ను విడుదల చేసింది. ఈ క్రమంలోనే తప్పుడు కేసులో తనను అన్యాయంగా జైల్లో పెట్టడాన్ని సవాల్‌ చేస్తూ బ్రౌన్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీని పై విచారణ జరిపిన చికాగో ఫెడరల్‌ కోర్టు తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తప్పుడు కేసులో బ్రౌన్‌ ను అరెస్ట్‌ చేసినందుకు గానూ 10 మిలియన్‌ డాలర్లు, పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించేలా చేసినందుకు గానూ మరో 40 మిలియన్‌ డాలర్లు అతడికి చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది.

అంటే మొత్తంగా 50 మిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.419 కోట్లకు పై మాటే . దానిని పరిహారంగా ఇప్పించింది. కోర్టు తీర్పు పై బ్రౌన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు తనకు, తన కుటుంబానికి న్యాయం జరిగిందని అన్నారు.

Also Read :  తెలంగాణకు మరో వందే భారత్ రైలు

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 400 మందికి పైగా?

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
Iran Harbor

Iran Harbor

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించిన ఘటన చోటుచేసుకుంది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలో రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ భారీ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

చమురు, పెట్రోకెమికల్స్ కారణంగా..

నౌకాశ్రయంలోని కంటెయినర్ల నుంచి పేలుడు సంభవించిందని భావిస్తున్నారు. ఇక్కడ ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ కంటైయినర్లలో చమురు, పెట్రోకెమికల్స్ ఉన్నాయి. వీటి కారణంగా పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment