US Fed : యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్ సంచలన ప్రకటన

50 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్ కమిటీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో 2020 తరువాత తొలిసారిగా వడ్డీరేట్లు తగ్గాయి.5.25- 5.50 శాతంతో 22 ఏళ్ల గరిష్ఠ స్థాయిలో ఉన్న వడ్డీ రేట్లు తాజాగా 4.75-5.0 శాతానికి చేరాయి.

author-image
By Bhavana
New Update
us fed

US Fed : యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 50 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్ కమిటీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో 2020 తరువాత తొలిసారిగా వడ్డీరేట్లు తగ్గాయి. అంతకు ముందు 5.25- 5.50 శాతంతో 22 ఏళ్ల గరిష్ఠ స్థాయిలో ఉన్న వడ్డీ రేట్లు తాజాగా 4.75-5.0 శాతానికి చేరాయి. 

ద్రవ్యోల్బణం స్థిరంగా 2 శాతం వైపు కదులుతున్నట్లు కమిటీ తెలిపింది. దీంతో ఉపాధి, ద్రవ్యోల్బణం లక్ష్యాలు సాధించడంలో సమతుల్యత ఉన్నట్లు సమాచారం. అని ఫెడ్‌ రేటు నిర్థారణ కమిటీ రూపకర్తలు పేర్కొన్నారు.

రెండు నెలల్లో అమెరికా ఎన్నికలు ఉండడంతో వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం కీలకంగా మారింది. బ్యాంకుల నుంచి లోన్‌ తీసుకునే వినియోగదారుల నుంచి మొదలు వ్యాపారస్తుల వరకు ప్రతి రంగం పై ప్రభావం పడనుంది. 2025 లోనూ వడ్డీ రేట్ల తగ్గింపు ఉండనున్నట్లు సమాచారం.

ఫెడ్ సంచలన నిర్ణయంతో అమెరికాలో బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. ఔన్స్ బంగారం ధర 2600 డాలర్లకు చేరింది.24 క్యారెట్ల గ్రాము బంగారం రూ.7680కి చేరింది. వడ్డీరేట్లు తగ్గడంతో బంగారంవైపు ఇన్వెస్టర్ల మొగ్గు చూపుతున్నారు. దీంతో ఒక్కసారిగా బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం రూ.7,473 దగ్గర బంగారం రేటు ఉండగా.. వడ్డీరేట్ల తగ్గింపుతో పెరిగిన బంగారం ధర.

Also Read: ELECTRICITY CHARGES: మళ్లీ పెరగనున్న విద్యుత్ ఛార్జీలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: పాక్ ఆర్మీ ఛీప్ మునీర్ ఒసామా బిన్ లాడెన్ లాంటివాడు..పెంటగాన్ మాజీ అధికారి మైకెల్ రూబిన్

పహల్గామ్ ఉగ్రదాడికి పాక్ ఆర్మీ ఛీఫ్ మునీర్ వ్యాఖ్యలే కారణమంటున్నారు. దీనిపై తాజాగా పెంటగాన్ మాజీ అధికారి రూబిన్ స్పందించారు. మునీర్ ఒసామా బిన్ లాడెన్ లాంటి వాడని అన్నారు. జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి పాకిస్తాన్ పక్కా ప్రణాళిక అని రూబిన్ ఆరోపించారు. 

author-image
By Manogna alamuru
New Update
usa

Pak Army Chief Asif Munir, Osama bin Laden

ఒక పందికి లిప్ స్టిక్ వేసినా అది పందేనని మాజీ పెంటగాన్ అధికారి మైఖల్ రూబిన్  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది పాకిస్తాన్ గురించి ఆయన చెప్పిన మాటలు. జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి యాదృచ్ఛికంగా జరిగింది కాదని, పాకిస్థాన్ పక్కా ప్రణాళికతో నిర్వహించిందని రూబిన్ ఆరోపించారు. పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ ను చనిపోయిన అల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ లాంటివాడని అన్నారు. అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్‌ సీనియర్ ఫెలో అయిన రూబిన్ ఎన్ఐఏకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పహల్గామ్ దాడికి అమెరికా తీసుకోవాల్సిన చర్య ఒకే ఒక్కటి ఉంది. అది పాక్ ను అధికారికంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా గుర్తించడమే అని అన్నారు. బిల్ క్లింటన్ ఇండియా వెళ్ళినప్పుడు ఉగ్రదాడి జరిగింది. ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అక్కడ ఉన్నప్పుడే ఉగ్రవాదులు దాడి చేశారు. ఇదంతా పాకిస్తాన్ దృష్టిని మళ్ళించేందుకే చేస్తోందని రూబిన్ అన్నారు. 

కాశ్మీర్ మాది అంటూ వ్యాఖ్యలు..

కాశ్మీర్ లోని పహల్గామ్ దాడికి వారం రోజుల ముందు పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ కాశ్మీర్ పై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ పాకిస్తాన్ జీవనాడి అని..దానిని తాము ఎప్పటికీ వదులుకోమని అన్నారు. ఈ మాటలే ఉగ్రవాదులకు ఊతమిచ్చాయని..ఆ ధైర్యంతోనే వారు కాశ్మీర్ లో దాడులకు తెగబడ్డారని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు పెంటగాన్ మాజీ అధికారి కూడా ఈ వాదనను సమర్థించారు. 

పహల్గామ్‌లోని బైసరన్ లోయలో  లష్కరే తొయిబా అనుబంధ విభాగం టీఆర్ఎఫ్ టెర్రరిస్టులు.. పర్యాటకులపై కాల్పులకు తెగబడి 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. మరో 20 మందిని తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనతో భారత్, పాకిస్థాన్‌ల మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. 

today-latest-news-in-telugu | usa | pakistan | pentagon | Pakistan Army Chief | osama-bin-laden 

 

Also Read: USA: వీసాల రద్దు ఆపండి..విద్యార్థులకు అమెరికా న్యాయస్థానం ఊరట

Advertisment
Advertisment
Advertisment