Arms Sales: యుద్దాల వల్ల 100 కంపెనీలకు రూ.53 లక్షల కోట్లు లాభం..

ఉక్రెయిన్, రష్యా యుద్ధం, ఇజ్రాయెల్, గాజా, ఇరాన్‌, లెబనాన్‌ ఇతర ప్రాంతాల్లో సంక్షోభాల వల్ల గతేడాది 100 ఆయుధ కంపెనీలు లాభపడ్డాయి. వీటికి 632 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.53 లక్షల కోట్లు వ్యాపారం జరిగినట్లు సిప్రి అనే నివేదిక వెల్లడించింది.

New Update
WAR TANK

ఉక్రెయిన్, రష్యా యుద్ధం, ఇజ్రాయెల్, గాజా, ఇరాన్‌, లెబనాన్‌ ఇతర ప్రాంతాల్లో సంక్షోభాల వల్ల గతేడాది ఆయుధ వ్యాపార కంపెనీలు బాగా లాభపడ్డాయి. ఈ విషయాన్ని సిప్రి (స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చి) తన నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 100 ఆయుధ కంపెనీలు 2023లో 632 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.53 లక్షల కోట్లు వ్యాపారం జరిగినట్లు పేర్కొంది. 2022తో పోలిస్తే ఇది 4.2 శాతం అధిక లాభమని వెల్లడించింది.   

Also Read: యూపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతం ఇక మహాకుంభమేళ జిల్లా

Top 100 Defence Suppliers

2022లో చాలావరకు ఆయుధ కంపెనీలకు అంతగా డిమాండ్ లేదు. కానీ ఏడాది తర్వాత వాటి వ్యాపారం ఒక్కసారిగా పెరిగిపోయింది. తాము పరిశీలించిన కంపెనీల్లో ప్రతీ కంపెనీకి కనీసం 1 బిలియన్ డాలర్లకు (రూ.8.4 వేల కోట్లు) పైగా వ్యాపారం జరిగిందని సిప్రి తెలిపింది.  ఉక్రెయిన్, గాజా, ఇతర సంక్షోభాల వల్ల చిన్న ఉత్పత్తిదారులు కూడా డిమాండ్‌ను అందుకున్నారని పేర్కొంది. అయితే వీళ్లు ప్రత్యేకంగా పరికరాలు తయారుచేయడమో అలాగే సిస్టమ్స్‌ను నిర్మించడం లాంటి పనులు చేసేవారని నిపుణులు చెబుతున్నారు. 

Also Read: మరో చరిత్ర సృష్టించనున్న ఇస్రో.. డిసెంబర్ 4న సరికొత్త ప్రయోగం

భారీగా లాభం పొందిన 100 కంపెనీల్లో అమెరికాలోనే 41 ఉండటం గమనార్హం. ఈ కంపెనీలు ఆయుధ అమ్మకాల్లో గతేడాది 2.3 శాతం వృద్ధి సాధించాయి. కానీ అమెరికాలో పెద్ద ఆయుధ కంపెనీలైన లాక్‌హీడ్‌ మార్టిన్‌, రేథియాన్‌ టెక్నాలజీస్‌ల ఆదాయం తగ్గింది. ఇందుకు కారణం ఇవి సంక్లిష్టమైన, పలు దశల పంపిణీ వ్యవస్థలపై ఆధారపడటమే. ఇక ఐరోపాలో 27 పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఇవి కేవలం 0.2 శాతం మాత్రమే వృద్ధిని చూశాయి. ఇందుకు కారణం ఈ కంపెనీలు కూడా సంక్లిష్టమైన ఆయుధాలను తయారుచేయడమే. ఇక మరికొన్ని ఆయుధ తయారీ కంపెనీలు ఉక్రెయిన్ యుద్ధానికి కావాల్సిన ఆయుధాలను ఉత్పత్తి చేసే బాగానే లాభం పొందాయి.  

Also Read: ముంబైలో దారుణం.. యువతి బట్టలు విప్పించి డిజిటల్ అరెస్ట్..

ఇది కూడా చూడండి: విషాదం.. అభిమానుల మధ్య ఘర్షణ.. వందమందికి పైగా..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించిన పాక్.. ఉద్యోగుల సెలవులు రద్దు!

పాకిస్తాన్ లో ప్రస్తుతం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. భారత్ యుద్ధానికి రెడీ అవుతుండడంతో పాక్ జాగ్రత్తలు పడుతోంది. పీవోకేలో అత్యవసర ఆంక్షలు విధించింది. ఉద్యోగుల సెలవులు, ట్రాన్సఫర్లను నిలిపేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 

New Update
పాక్ ఉగ్రవాదులకు చైనా ఆయుధాలను అందిస్తున్న ఐఎస్ఐ

పైకి బీరాలు పోతున్నా పాకిస్తాన్ లోపల భయపడుతోందని స్పష్టంగా తెలుస్తోంది. పాక్ పీవోకేలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. ఒకవైపు బోర్డర్ లో భారత్ చర్యలు, యుద్ధం తప్పదన్న హెచ్చరికలతో పాకిస్తాన్ అత్యవసర నిర్ణయాలను తీసుకుంటోంది. పాక్ పీవోకేలో అత్యవసర ఆంక్షులు విధించింది అక్కడి ప్రభుత్వం. దాంతో పాటూ ఆరోగ్య కార్యకర్తల సెలవులు, ట్రాన్సఫర్లను నిలిపేసింది. దీనికి సంబంధించి ఏప్రిల్ 25న జీలం వ్యాలీ హెల్త్ డైరెక్టరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆసుపత్రులు, ఆరోగ్య విభాగాలలోని వైద్య సిబ్బందిని వారి వారి డ్యూటీ పాయింట్ల వద్దనే ఉంచాలని ఆదేశించింది. ఇప్పటికే సెలవు మీద ఉన్నవారు కూడా వెంటనే డ్యూటీల్లో జాయిన్ అవ్వాలని చెప్పింది. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్లను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. 

అప్రమత్తమైన భారత బలగాలు..

పాక్ హెల్త్ డైరెక్టరీ ఉత్తర్వులను భారత భద్రతా సంస్థలు కూడా తీవ్రంగా పరిగణించాయి. పాకిస్తాన్ తీసుకుంటున్న ఈ చర్యలు ఎల్వోసీ దగ్గర సైనిక లేదా ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాయి. దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్, పరిసర ప్రాంతాలలో ఇవి ఎక్కువగా జరగొచ్చని ఊహిస్తున్నారు. దీంతో భారత భద్రతా దళాలు పహల్గామ్, అనంతనాగ్ జిల్లాల్లో పెట్రోలింగ్, నిఘాను ముమ్మరం చేశాయి.  ఇక నియంత్రణ రేఖ దగ్గర భారత సైన్యం ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేసింది. భారత సైన్యం ఎటువంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. 

today-latest-news-in-telugu | pakistan | loc | emergency 

Also Read:   J&K: మరో ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన బలగాలు

Advertisment
Advertisment
Advertisment