Rasmussen Poll : ట్రంప్ విజయం గ్యారంటీ!

మరికొన్ని రోజుల్లో జరిగే అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం ఖాయమని Rasmussen Poll తెలిపింది. ఈ పోల్‌ లో ట్రంప్‌ కి 297, కమలా హారిస్‌ కు 241 ఎలక్ట్రోరల్‌ ఓట్లు వస్తాయని Rasmussen Poll చెప్పింది.

New Update
Kamala Harris: దూసుకుపోతున్న కమలా హారిస్‌.. ట్రంప్‌ కన్నా నాలుగు పాయింట్ల ఆధిక్యం

America Elections : అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం ఖాయమని Rasmussen Poll  అంచనా వేసింది. ట్రంప్‌ కి 297, కమలా హారిస్‌ కు 241 ఎలక్ట్రోరల్‌ ఓట్లు వస్తాయని పేర్కొంది. స్వింగ్ స్టేట్స్‌ అయిన జార్జియా, నార్త్‌ కరోలినా, విస్కన్సిన్‌, నెవడా, పెన్సిల్వేనియా, అరిజోనా, మిచిగాన్‌ రాష్ట్రాల్లో ట్రంప్‌ సత్తా చాటుతారని తెలిపింది. కాగా నవంబర్‌ 5న అగ్ర రాజ్యంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 

Also Read: 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..బడ్జెట్‌ కూడా!

ఇప్పటికే ముందస్తు ఓటింగ్‌ను ఉపయోగించుకొని ఇప్పటికే దాదాపు 6.1 కోట్ల మందికి పైగా ప్రజలు ఓట్లు వేశారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్‌కు మధ్య గట్టి పోటి నెలకొంది. ఈ ముందస్తు ఓటింగ్ ప్రక్రియలో చాలామంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటువేశారు. మరికొంతమంది మెయిల్ బ్యాలెట్‌ ద్వారా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.    

Also Read: ఇల్లు కట్టుకునే వారికి చంద్రబాబు సర్కార్ శుభవార్త

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. డేలావేర్‌లోని విల్మింగ్టన్‌లో తన ఇంటికి సమీపంలో ఉన్న పోలింగ్ కేంద్రంలో 40 నిమిషాల పాటు క్యూ లైన్‌లో నిల్చొని ఓటు వేశారు. ఇక నవంబర్ 5న మిగతా ఓటర్లు ఓటు వేయనున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై కేవలం అమెరికా మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఓవైపు ఉక్రెయిన్, రష్యా యుద్ధం, మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. అమెరికా కొత్త అధ్యక్షునితో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారీ తీస్తాయే అనేది చర్చనీయమవుతోంది.  

భారతీయ ఓటర్ల మొగ్గు ఎటువైపు..

ఈసారి అమెరికా ఎన్నికల్లో భారత ఓటర్లు కీలకపాత్ర పోషించనున్నారు. అమెరికాలో భారతీయ ఓటర్లు అధికంగానే ఉన్నారు. ఇక్కడకు వచ్చి సెటిల్ అయినవారే కాకుండా.. గ్రీన్ కార్డు హోల్డర్లు కూడా ఓటు వేసే ఛాన్స్ ఉంది. భారతీయులకు ట్రంప్‌తో ఇంతకు ముందే అనుభవం ఉంది. లాస్ట్ టైమ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారతీయులు నానా కష్టాలు పడ్డారన్న విమర్శలున్నాయి. వీసాల జారీను చాలా కట్టుదిట్టం చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

Also Read: జనవరి నుంచే కొత్త రేషన్ కార్డులు.. ఫస్ట్ ఇచ్చేది వారికే!

అయితే ఎన్ని ఉన్నా...ఈసారి మా మద్దుతు మాత్రం మళ్ళీ ట్రంప్‌కే అంటున్నారు. ఆయన అధ్యక్షుడిగా వస్తేనే జాబ్స్ నిలబడతాయని చెబుతున్నారు. అక్రమ వలసలు ఆగిపోతాయని...ఎవరు నిజాయితీగా రావాలో వారే అమెరికాకు వస్తారని చెబుతున్నారు. కమలా హారిస్ వస్తే అక్రమ వలసలు పెరగిపోతాయని భారతీయులు అభిప్రాయపడుతున్నారు. అదీ కాక ప్రస్తుతం డౌన్ ఫాల్‌లో ఉన్న అమెరికా ఆర్ధిక పరిస్ధితి బాగుపడాలంటే ట్రంపే రావాలని ఇండియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: బాల్ టాంపరింగ్‌ కు పాల్పడిన భారత కీపర్. అంపైర్ తో వాగ్వాదం!

ఇప్పటి వరకు బైడెన్ చేసిన తప్పులనే కమలా హారీస్ వస్తే రిపీట్ చేస్తారని...ఆమె సవంత అభిప్రాయం ఎలా ఉన్నా పార్టీ చెప్పినట్టుగానే నడుచుకోవాలి కాబట్టి పరిస్థితి ఏమీ మారదు అని అంటున్నారు. అందుకే మా ఓటు ట్రంప్‌కే అని అంటున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ఉగ్రదాడిపై అంతర్జాతీయ విచారణ.. పాక్ సంచలన డిమాండ్!

పహల్గాం దాటి ఘటన పై పాక్‌ తన మాట మార్చింది.ఈ ఘటన పై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని చెబుతోంది.పహల్గాం ఘటనతో మా దేశానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భారత్‌ మమ్మల్ని నిందిస్తోందన్నారు.

New Update
pak

Pakistan Defence Minister Khwaja Asif

పహల్గాం దాటి ఘటన పై పాక్‌ తన మాట మార్చింది.ఈ ఘటన పై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని చెబుతోంది. ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్‌ అసిఫ్‌ అన్న మాటలను ది న్యూయార్క్‌ టైమ్స్‌  ప్రచురించింది.

Also Read: Hafiz Saeed : మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!

పహల్గాం ఘటనతో మా దేశానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భారత్‌ మమ్మల్ని నిందిస్తోంది.ఈ దాడి పై ఇప్పటి వరకు ఎలాంటి దర్యాప్తు జరిగినట్లు కనిపించడం లేదు. ఒక వేళ దర్యాప్తు జరిగితే సహకరించేందుకు పాక్‌ సిద్ధంగా ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా విచారణ జరగాలని మేం కోరుకుంటున్నాం అని అసిఫ్‌ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Also Read:  Pahalgam terror attack : పహల్గాం ఉగ్రదాడి ఘటనలో కీలక పరిణామం....అనుమానితుడి అరెస్ట్

పహల్గాం దాడి తరువాత నెలకొన్న పరిస్థితిని ..దేశీయ రాజకీయ ప్రయోజనాల కోసం నీటి ఒప్పందాన్ని నిలిపివేయడానికి కారణంగా భారత్‌ ఉపయోగించుకుంది.ఎలాంటి ఆధారాలు లేకుండా ,దర్యాప్తు జరపకుండానే పాక్‌ ని శిక్షించాలని అడుగులు వేస్తోంది.

అయితే పరిణామాలు యుద్ధానికి దారి తీయాలని మేం కోరుకోవడం లేదు. ఎందుకంటే..యుద్ధమంటూ జరిగితే ఈ ప్రాంతమంతా నాశనం అవుతుంది కాబట్టి అని అసిఫ్‌ అన్నారు. ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ సంస్థ పహల్గాం ఉగ్రదాడికి కారణమని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే.అయితే లష్కరే తోయిబా,హిజ్బుల్‌ ముజాహిదీన్‌ సంస్థల అనుబంధ విభాగమని ,వీటికి పాక్‌ ప్రభుత్వ అండదండలు..అక్కడి నిఘా వ్యవస్థల సహకారమూ ఉందని భారత భద్రతా సంస్థలు చెబుతున్నాయి.

Also Read: Pahalgam attack : హ్యాట్సాఫ్..ఉగ్రదాడితో ముస్లిం ఆవేదన.. ఇస్లాంను వదిలేస్తూ కోర్టుకు!

Also Read: Heatwave Warning : బయటకు వెళ్తున్నారా? జాగ్రత్త...ఈ రోజు మండనున్న ఎండలు..అరెంజ్‌ అలర్ట్‌

 

pakistan | india | pahalgam | Pahalgam attack | Pahalgam Attack Updates | pahalgam attack explained | Pahalgam Attack latest news | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment