PM Modi Tour: శ్రీలంక, థాయ్‌లాండ్‌లో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని మోదీ ఏప్రిల్‌ మొదటి వారంలో థాయ్‌లాండ్, శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నారు. ఏప్రిల్‌ 3, 4 తేదీల్లో థాయ్‌లాండ్‌లో పర్యటించనున్నారు. బ్యాంకాక్‌లో ఏప్రిల్ 4న జరగనున్న అంతర్జాతీయ సమావేశంలో ఆయన పాల్గొంటారు. తర్వాత ఏప్రిల్ 6న శ్రీలంకకు బయలుదేరనున్నారు.

New Update
PM Modi visit

PM Modi visit Photograph: (PM Modi visit )

PM Modi Tour: భారత ప్రధాని మోదీ త్వరలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఏప్రిల్‌ మొదటి వారంలో శ్రీలంక, థాయ్‌లాండ్‌(Sri Lanka, Thailand) లో పర్యటించనున్నారు. ఈ రెండు దేశాల పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారైనట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. థాయ్‌లాండ్‌ ప్రధాని పేటోంగ్టార్న్‌ షినవత్ర ఆహ్వానం మేరకు ఆ దేశ పర్యటనకు వెళ్లబోతున్నారు.

Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!

పేటోంగ్టార్న్‌తో భేటీ

ఏప్రిల్‌ 3, 4 తేదీల్లో మోదీ థాయ్‌లాండ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పేటోంగ్టార్న్‌తో భేటీ కానున్నారు. ఏప్రిల్‌ 4వ తేదీన బ్యాంకాక్‌లో జరగనున్న బే ఆఫ్‌ బెంగాల్‌ ఇనీషియేటివ్‌ ఫర్‌ మల్టీ సెక్టోరల్‌ టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ గ్రూప్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, స్కిల్ డెవలప్‌మెంట్ వంటి అంశాలంపై దేశాధినేతలతో చర్చించనున్నారు.

Also Read: BIG BREAKING: బ్యాంకాక్‌లో భారీ భూకంపం.. నేలమట్టమైన భవనాలు

Also Read: Microplastics: బ్రెయిన్‌లో ప్లాస్టిక్ చెంచా.. డేంజర్ జోన్‌లో చూయింగ్‌గమ్ తినేవాళ్లు!

థాయ్‌లాండ్ నుంచి ఏప్రిల్ 4న శ్రీలంక బయలుదేరనున్నారు. ఏప్రిల్‌ 6 వరకూ నరేంద్ర మోదీ శ్రీలంకలోనే ఉండనున్నారు. ఆ దేశాధ్యక్షుడు అనురకుమార దిసనాయకే ఆహ్వానం మేరకు మోదీ శ్రీలంక పర్యటనకు వెళ్లబోతున్నారు. గతేడాది భారత్‌లో ఆయన పర్యటించిన విషయం తెలిసిందే. 

 Also Read: BIG BREAKING: అన్నంలో విషం కలిపిపెట్టిన తల్లి.. నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి

Advertisment
Advertisment
Advertisment