/rtv/media/media_files/2025/03/28/QnnuSwmDucdq7g0ZEMSD.jpg)
PM Modi visit Photograph: (PM Modi visit )
PM Modi Tour: భారత ప్రధాని మోదీ త్వరలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో శ్రీలంక, థాయ్లాండ్(Sri Lanka, Thailand) లో పర్యటించనున్నారు. ఈ రెండు దేశాల పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైనట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. థాయ్లాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్ర ఆహ్వానం మేరకు ఆ దేశ పర్యటనకు వెళ్లబోతున్నారు.
Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!
పేటోంగ్టార్న్తో భేటీ
ఏప్రిల్ 3, 4 తేదీల్లో మోదీ థాయ్లాండ్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పేటోంగ్టార్న్తో భేటీ కానున్నారు. ఏప్రిల్ 4వ తేదీన బ్యాంకాక్లో జరగనున్న బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ గ్రూప్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, స్కిల్ డెవలప్మెంట్ వంటి అంశాలంపై దేశాధినేతలతో చర్చించనున్నారు.
Also Read: BIG BREAKING: బ్యాంకాక్లో భారీ భూకంపం.. నేలమట్టమైన భవనాలు
STORY | PM Modi to travel to Thailand, Sri Lanka from Apr 3-6
— Press Trust of India (@PTI_News) March 28, 2025
READ: https://t.co/9NLQ6jiNZh pic.twitter.com/rUCn2ThZJw
Also Read: Microplastics: బ్రెయిన్లో ప్లాస్టిక్ చెంచా.. డేంజర్ జోన్లో చూయింగ్గమ్ తినేవాళ్లు!
థాయ్లాండ్ నుంచి ఏప్రిల్ 4న శ్రీలంక బయలుదేరనున్నారు. ఏప్రిల్ 6 వరకూ నరేంద్ర మోదీ శ్రీలంకలోనే ఉండనున్నారు. ఆ దేశాధ్యక్షుడు అనురకుమార దిసనాయకే ఆహ్వానం మేరకు మోదీ శ్రీలంక పర్యటనకు వెళ్లబోతున్నారు. గతేడాది భారత్లో ఆయన పర్యటించిన విషయం తెలిసిందే.
Also Read: BIG BREAKING: అన్నంలో విషం కలిపిపెట్టిన తల్లి.. నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి