Flight Meal : ఆహారంలో బతికి ఉన్న ఎలుక...విమానం అత్యవసర ల్యాండింగ్‌!

ఓస్లో నుంచి స్పెయిన్‌లోని మలాగాకు వెళుతున్న విమానంలో ఓ మహిళ పాసింజర్‌ తన ఫుడ్‌ పార్మిల్‌ ఓపెన్‌ చేయగా..అందులో బతికి ఉన్న ఎలుక బయటకు వచ్చింది. దీంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది.

author-image
By Bhavana
New Update
Flight: విమానం గాల్లో ఉండగా మంటలు..భయాందోళనలో ప్రయాణికులు!

Emergency Landing: విమాన ప్రయాణంలో ఓ ప్యాసింజర్ కి బాగా ఆకలి వేయడంతో విమాన సిబ్బంది ఇచ్చిన ఫుడ్ పార్శిల్‌ను ఓపెన్ చేయగా ఓ షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. పార్శిల్‌ అలా తెరవగానే ఆ ఆహార పొట్లం నుంచి ఓ బతికి ఉన్న ఎలుక ఒకటి బయటకు దూకింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాకై ఈ విషయం గురించి ఫ్లైట్‌ సిబ్బందికి తెలియజేయగా..వారు ప్రోటోకాల్‌ ప్రకారం విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. 

 బుధవారం స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్‌కు (ఎస్ఏఎస్) చెందిన ఓ విమానం నార్వేలోని ఓస్లో నుంచి స్పెయిన్‌లోని మలాగాకు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. విమానాన్ని డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. విమానంలో ఎలుకలు కనిపించినప్పుడు అనుసరించాల్సిన నిబంధనల ప్రకారం అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తారని స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధి ఒకరు చెప్పారు. 

ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని, అలాంటి సందర్భం ఎదురైనప్పుడు నిబంధలను కచ్చితంగా పాటిస్తామని అని ఆయన వివరించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై విమానాన్ని తయారు చేసిన కంపెనీతో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. విమానంలోని విద్యుత్ వైర్లను కొరికివేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రయాణం మధ్యలో ఎలుకలు కనిపించినప్పుడు ఈ ప్రొటోకాల్‌ పాటిస్తారని సమాచారం. 

కాగా విమానాన్ని కోపెన్‌హాగన్‌లో ల్యాండింగ్ చేసిన వెంటనే ఎలుకను పట్టుకునేందుకు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. 

Also Read :  శ్రీవారి ఆలయంలో నేడు శాంతి హోమం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Earthquake: గంట వ్యవధిలో నాలుగు భూకంపాలు.. భయాందోళనలో జనం

ఆదివారం ఒకే గంటల వ్యవధిలో భారత్, మయన్మార్, తజికిస్తాన్‌లో నాలుగు భూకంపాలు వచ్చాయి. భారత్‌లో రెండు, మయన్మార్, తజికిస్తాన్‌లో ఒక్కోటి వచ్చాయి. అయితే ఈ భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదు.

New Update
Earthquake

Earthquake

ఈమధ్య వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. ఆదివారం ఒకే గంటల వ్యవధిలో భారత్, మయన్మార్, తజికిస్తాన్‌లో నాలుగు భూకంపాలు వచ్చాయి. దీంతో జనం భయాందోళనలో ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తారు. మొదటి భూకంపం తజికిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు సమీపంలో రాగా.. ఆ తర్వాత మయన్మార్‌లో మీక్టిలాలో వచ్చింది. అనంతరం భారత్‌లోని జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్వార్‌లో, ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకశీలో భూకంపాలు వచ్చాయి.   

Also Read: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?

అయితే ఈ భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదు. తజికిస్తాన్‌లో భూకంప తీవ్రత 6.0 గా నమోదయ్యింది. భారత్‌లో ఫైజాబాద్‌లో ఉదయం 9 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. కేవలం ఒక గంట వ్యవధిలోనే నాలుగు భూకంపాలు వచ్చాయి. మయన్మార్‌లో 5.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. మార్చి 28న అక్కడ 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మళ్లీ బలమైన భూకంపం సంభవించడం కలకలం రేపింది. జనం ఇళ్ల నుంచి భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. 

Also Read: అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ.. పూజారి పై దాడి!

 జమ్ముకశ్మీర్‌లో హిమాలయన్‌ ప్రాంతంలో 4.2 తీవ్రతో భూకంపం రావడంతో అక్కడి స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తారు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో 4.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే ఈ భూకంపాల వల్ల ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ భూకంపాలు భారత్‌ ప్లేట్‌ యూరేషియన్ ప్లేట్‌తో ఢీకోనడం వల్ల సంభవించే టెక్టోనిక్‌ కదలికల వల్ల సంభవిస్తున్నాయి. ఇదిలాఉడంగా మార్చి 28న మయన్మార్‌ వచ్చిన భూకంప ధాటికి 3600 మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. 

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

telugu-news | rtv-news | earthquake | national-news

 

Advertisment
Advertisment
Advertisment