పాకిస్థాన్‌ ఉగ్రవాదుల ఘాతుకం.. ఇండియా డాక్టర్‌ను క్రూరంగా చంపేశారు..!

జమ్మూకశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో ఉగ్రవాదులు ఆదివారం రెచ్చిపోయారు. ఓ వైద్యుడు, ఆరుగురు కార్మికులను హతమార్చారు. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబాకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ దాడికి బాధ్యత వహించిందని తెలుస్తోంది.

New Update
terror attack

జమ్మూకశ్మీర్ ‌లోని గందర్‌బల్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆదివారం సాయంత్రం ఏడుగురిని హతమార్చారు. అందులో ఓ వైద్యుడు, ఆరుగురు కార్మికులు మృతి చెందగా.. మరో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. గాయపడిన వారిని శ్రీనగర్‌లోని షేర్-ఎ- కశ్మీర్  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్కిమ్స్)లో అడ్మిట్ చేశారు. ఆ కార్మికులు భోజనానికి కూర్చున్న సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికి చేరుకొని వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కార్మికులతో పాటు రెండు వాహనాలు సైతం దగ్దమయ్యాయి. 

ప్రధాన సూత్రధారి అతడేే?

ఈ దాడికి పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబాకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహించిందని తెలుస్తోంది. ముఖ్యంగా TRF చీఫ్ షేక్ సజ్జాద్ గుల్ ఈ దాడికి ప్రధాన సూత్రధారి అని.. అతని ఆదేశాల మేరకే మొదటిసారిగా కశ్మీరీలు, కాశ్మీరీయేతరులను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారని కొన్ని వర్గాలు తెలిపాయి. కాగా కాశ్మీర్‌లో TRF చాలా చురుకుగా ఉంది.

Also Read: విశ్వవిజేతులుగా కివీస్.. మొదటిసారి టైటిల్ సొంతం

ఒమర్ అబ్దుల్లా రియాక్ట్

గత ఒకటిన్నర సంవత్సరాలలో కాశ్మీరీ పండిట్‌లు, సిక్కులు, స్థానికేతరులను ఇది లక్ష్యంగా చేసుకుంది. ఇందులో భాగంగానే చాలా మంది కాశ్మీరీ పండిట్‌లను హతమార్చింది. ఇక ఇప్పుడు కాశ్మీరీయేతరులను లక్ష్యంగా చేసుకుని టిఆర్ఎఫ్ కాల్పులు జరిపినట్లు కొన్ని వర్గాలు తెలిపాయి. కాగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు రోజులకే ఇలాంటి ఘటన జరగడంపై ఆయన స్పందించారు. నిరాయుధ అమాయక ప్రజలపై దాడిని తీవ్రంగా ఖండించారు.

Also Read: మణికంఠ AV ఎందుకు ప్లే చేయలేదు..? కారణం ఇదేనా

సొరంగ నిర్మాణ పనులు

జిల్లాలోని గుండ్ వద్ద శ్రీనగర్ - లేహ్ నేషనల్ హైవేలో సొరంగ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ సొరంగం లడఖ్‌లోని ప్రజలకు, భారత సైన్యానికి అన్ని విధాల కనెక్టివిటీని అందిస్తుంది. అయితే ఈ నిర్మాణ పనులు చేపట్టిన ఓ ప్రైవేట్ కంపెనీ కార్మికుల కోసం కొన్ని గుడిసెలు ఏర్పాటు చేసింది. ప్రతి రోజూలాగానే కార్మికులు అక్కడి పని పూర్తయిన తర్వాత తమ గుడెసెకి చేరుకున్నారు.

Also Read: రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కాల్పుల్లో డాక్టర్ సహా ఆరుగురు మృతి

 ఏడుగురు మృతి

అనంతరం భోజనం చేసేందుకు అంతా ఒక్కచోట కూర్చున్నారు. అదే సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు ఆ గుడెసె దగ్గరకు చేరుకుని కార్మికులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో డాక్టర్ షానవాజ్, గుర్మీత్ సింగ్, శశి అబ్రోల్, ఫహీమ్ నజీర్, మహ్మద్ హనీఫ్, కలీమ్, అనిల్ కుమార్ శుక్లా మృతి చెందారు.

Also Read:  ప్రియురాలిని చూసి సృహ తప్పిన ప్రియుడు.. తర్వాత ఏమైందంటే?

అలాగే ఇందర్ యాదవ్, మోహన్ లాల్, ముస్తాక్ అహ్మద్, ఇష్పాక్ అహ్మద్ భట్, జగ్తార్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ దారుణం జరిగిన వెంటనే పోలీసు బలగాలు, సైనిక దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అక్కడ పరిస్థితిని పరిశీలించన తర్వాత ఉగ్రవాదులను పట్టునేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sheikh Hasina: షేక్ హసీనాకు బిగ్ షాక్.. మరోసారి అరెస్టు వారెట్ జారీ

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి న్యాయస్థానం ఇటీవల అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి అరెస్టు వారెంట్ జారీ చేసింది. అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారని హసీనా, ఆమె కూతురు, మరికొందరిపై ఆరోపణలు ఉన్నాయి.

New Update
Sheikh Hasina

Sheikh Hasina

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి న్యాయస్థానం ఇటీవల అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి  తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి అరెస్టు వారెంట్ జారీ చేసింది. అధికార దుర్వినియోగంతో అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారని హసీనాతో పాటు 
ఆమె కూతురు సైమా వాజెద్‌ పుతుల్, మరికొందరపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి హసీనాపై అరెస్టు వారెంట్ జారీ చేసింది.  

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

ఇక వివరాల్లోకి వెళ్తే.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి రెహనా, బ్రిటీష్ ఎంపీ తులిప్‌ రిజ్వానా సిద్ధిక్‌, మరో 50 మందిపై అవినీతి నిరోధక కమిషన్ బంగ్లాదేశ్‌ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై పరిశీలన చేసిన కోర్టు.. అరెస్టు వారెంట్లు జారీ చేసిందని పలు మీడియా కథనాలు తెలిపాయి. తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 27కు వాయిదా వేసినట్లు చెప్పాయి. మరోవైపు అక్రమంగా నివాస స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలపై షేక్‌ హసీనా, ఆమె కూతురు సైమా వాజెద్‌ పుతుల్, మరో 17 మందిపై అరెస్టు వారెంట్ జారీ చేసింది.   

Also Read: జలియన్ వాలాబాగ్‌ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్‌ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?

ఢాకా శివారులో ఉన్న పుర్బాచల్‌లో ప్రభుత్వ అధీనంలో ఉన్న భూమి లీజుకు సంబంధించిన అభియోగంపై ఏసీసీ తన దర్యాప్తు రిపోర్టును కోర్టుకు సమర్పించింది. షేక్ హసీనా, ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఢాకాలో ఇళ్లు ఉన్నప్పటికీ.. నివాసం స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు చేసింది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉండటం వల్ల ఇటీవల కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.అయితే తాజాగా మరోసారి కోర్టు అరెస్టు వారెంట్ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

Also read: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?

 telugu-news | rtv-news | sheik-hasina | international

 

Advertisment
Advertisment
Advertisment