/rtv/media/media_files/2024/10/16/lzk26mLPIvETy1zHEBcZ.jpg)
నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ పేలి 90 మందికి పైగా మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జిగివా రాష్ట్రంలోని మజియా అనే పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి కనో అనే ప్రాంతం నుంచి నుంచి వస్తోన్న పెట్రోల్ ట్యాంకర్ ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఆ ట్యాంకర్ అదుపుతప్పి రహదారిపై బోల్తా పడింది. దీంతో కొందరు స్థానికిలు ఇంధనం కోసం ఆ ట్యాంకర్ వద్దకు వెళ్లారు. వారు పెట్రోల్ తీసుకుంటుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ట్యాంకర్ పేలిపోయింది.
A tragic tanker explosion in Jigawa State, Nigeria, has resulted in the deaths of over 90 people and injuries to 50 others. The incident occurred as villagers were scooping fuel from the overturned tanker.#TankerExplosion #JigawaState #trendingnews #tankers #jigawa #aetvnews pic.twitter.com/WJMerz7PfS
— AETV NEWS (@AETVNews) October 16, 2024
Also Read: కేంద్ర ఎన్నికల కమిషనర్కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్!
ఈ విషాద ఘటనలో 94 మంది మృతి చెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మరో 50 మంది గాయాలపాలయ్యారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స ఉందని చెబుతున్నారు. అయితే ట్యాంకర్ బోల్తా పడినప్పుడు దానికి దూరంగా ఉండాలని ప్రజలను హెచ్చరించినా కూడా ఎవరూ వినలేదని.. ఒక్కసారిగా అక్కడికి జనాలు రావడంతో చాలామంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందని అధికారులు తెలిపారు.
Also Read: కొత్తగా పెళ్లయిందా? ఈ మూడు పాటిస్తే మీ భార్య మిమల్ని ఎప్పటికీ వదలదు!
ఇదిలాఉండగా ఇటీవల రష్యాలోని సౌత్ చెచ్న్యాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ పెట్రోల్ పంపులో మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. సమాచారం మేరకు అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశాయి.
Also Read: రైతులకు మోదీ సర్కార్ అదిరిపోయే దీపావళి గిఫ్ట్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు!
ఇటీవల ఆర్మేనియా దేశంలో కూడా నాగర్నో - కారాబఖ్ ప్రాంతంలో ఓ పెట్రోల్ బంక్లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. 300 మందికిపైగా గాయపడ్డారు. తమ వెహికిల్స్లో ఇంధనాన్ని నింపుకునేందుకు అధిక సంఖ్యలో ప్రజలు ఆ పెట్రోల్ బంక్ వద్ద ఉన్నారు. ఆ సమయంలోనే ఒక్కసారిగా పేలుడు జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అక్కడున్నవారు భయాందోళనలతో పరుగులు పెట్టారు.
Also Read: ఖగోళ అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు రాదు!
India-China: ట్రంప్ టారిఫ్ దెబ్బకి మెరుగుపడుతున్న భారత్-చైనా సంబంధాలు
ట్రంప్ టారిఫ్ల వల్ల స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. కానీ భారత్, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ వెల్లడించారు.
Jai shankar
ట్రంప్ టారిఫ్ల వల్ల స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. కానీ భారత్-చైనా సంబంధాలు మాత్రం బలపడే దిశగా వెళ్తున్నాయి. తాజాగా ఇరుదేశాల సంబంధాలపై విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పందించారు. ఆ సంబంధాలు సానుకూల దిశ వైపు పయనిస్తున్నాయన్నారు. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని.. వీటిని సాధారణ స్థితికి తెచ్చేందుకు ఎంతో కృషి చేయాల్సి ఉందని అన్నారు.
Also Read: ట్రంప్ టారిఫ్లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్గాంధీ ఫైర్
ఇదిలాఉండగా 202-0 లో తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల జవాన్ల మధ్య ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భారత్-చైనా మధ్య సంబంధాలు దిగజారిపోయాయి. అనంతరం సైనిక, దౌత్యపరంగా చర్చలు జరగడం, గస్తీ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇరుదేశాలకు స్వేచ్ఛగా వెళ్లొచ్చు .
Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్
ఇటీవల చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 108 శాతం టారిఫ్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా చైనా కూడా అమెరికాపై 84 శాతం సుంకాలు విధించింది. దీంతో ట్రేడ్ వార్ మరింత ముదిరింది. ఇదిలాఉండగా.. న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్ టారిఫ్ల స్పందించారు. అమెరికా టారిఫ్ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్, చైనా జత కట్టాలన్నారు. పరస్పర సహకారం, ప్రయోజనాలపై ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్యం సంబంధాలు ఆధాపడి ఉన్నాయన్నారు. అమెరికా విధించిన టారిఫ్ల వల్ల అనేక దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు అభివృద్ధి పొందే హక్కును కోల్పోతున్నాయని చెప్పారు. ఇలాంటి కఠిన పరిస్థితుల నుంచి బయటపడేందుకు మన ఇరు దేశాలు కలిసి ఎదుర్కోవాలన్నారు.
Also read: Viral video: రన్నింగ్ ట్రైన్ కిటికీలో ఇరుక్కున్న దొంగ.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన ప్యాసింజర్
telugu-news | rtv-news
Hit 3 Movie Second Song: అర్జున్ సర్కార్ కొత్త సాంగ్ ఊరమాస్.. ‘హిట్ 3’ సెకండ్ సింగిల్ కెవ్ కేక
Air India flight: విమానంలో పక్క ప్యాసింజర్పై మూత్రం పోసిన వ్యక్తి
KTR : హనుమాన్ పూజలో పాల్గొని.. స్వాములతో కలిసి భోజనం చేసిన కేటీఆర్
kannappa: ఇట్స్ అఫీషియల్.. ‘కన్నప్ప’ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మంచు విష్ణు.. ఎప్పుడంటే?
nari nari naduma murari: ఏముంది భయ్యా సాంగ్.. శర్వా కొత్త మూవీ పాట అదిరిపోయింది..