నస్రల్లా మరణవార్త చదువుతూ టీవీ యాంకర్‌ కంటతడి.. వీడియో వైరల్

హెజ్‌బొల్లా అధినేత హసన్‌ నస్రల్లా మృతి చెందినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నస్రల్లా మరణవార్తను చదువుతున్న టీవీ యాంకర్‌ లైవ్‌లోనే భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతోంది.

New Update
Anchor

హెజ్‌బొల్లాను నిర్మూలించే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ లెబనాన్‌లో భీకర దాడులు కొనసాగిస్తోంది. అయితే ఈ దాడిలో హెజ్‌బొల్లా అధినేత హసన్‌ నస్రల్లా మృతి చెందినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన మరణ వార్త లెబనాన్‌లో సంచలనం రేపుతోంది. తమ నాయకుడు మృతి చెందడంపై అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ వార్తా ఛానల్‌లో నస్రల్లా మరణవార్తను చదువుతున్న టీవీ యాంకర్‌ లైవ్‌లోనే భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.  

Also Read: హైడ్రా అంటే భయం కాదు.. భరోసా: రంగనాథ్ సంచలన ప్రెస్‌మీట్‌

ఇదిలాఉండగా శుక్రవారం లెబనాన్ రాజధాని బీరుట్‌లోని హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగించింది. అయితే ఈ దాడుల్లో నస్రల్లా మృతి చెందినట్లు ఇజ్రాయెల్ భద్రతా దళం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆయన మరణవార్తను లైవ్‌లో చదువుతున్న యాంకర్ భావోద్వేగాని గురయ్యారు. మరోవైపు తమ నాయకుడు మృతి చెందాడని హెజ్‌బొల్లా కూడా ధృవీకరించింది. ఈ దాడుల్లో ఆయన కుమార్తె కూడా మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. పాలస్తీనాకు మద్దతివ్వడంతో పాటు శత్రుదేశంపై తమ యుద్ధం కొనసాగిస్తామని హజ్‌బొల్లా ప్రకటించింది.  

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు