ఆ ఊరిలో 20ఏళ్ల తర్వాత పుట్టిన తొలి బిడ్డ.. కారణం ఇదే!

జపాన్‌లోని ఇచినోనో గ్రామంలో మొత్తం 60 కుటుంబాలు. ఎటు చూసినా వృద్ధులే. యువకులంతా ఉపాది పనుల కోసం వలస వెళ్లిపోయారు. కోవిడ్ కారణంగా యువకులు సొంతూరుకు రావడంతో జంటలు కలిసాయి. దీంతో 20ఏళ్ల తర్వాత తొలిబిడ్డ జన్మించింది. దీంతో ఆ ఊరిలో సంబరాలు మొదలయ్యాయి.

New Update
Japanese village Ichinono

ఆ ఊరిలో దాదాపు 60 కుటుంబాలు.. ఎటు చూసినా వృద్ధులే.. యువకులంతా ఉపాది పనుల కోసం ఇల్లు విడిచి వలస వెళ్లిపోయారు. దీంతో దాదాపు 20 ఏళ్ల వరకు ఆ ఊరిలో ఒక్క బిడ్డ కూడా జన్మించలేదు. ఊరి మొదటి నుంచి చివరి వరకు తొలు బొమ్మలే కనిపిస్తాయి. వాటిని చూస్తూ ఆ వృద్ధులు కాలం గడిపేస్తున్నారు. కానీ ఇప్పుడు వారికి ఆ బాధ లేదు. ఆ గ్రామానికి సరికొత్త కళ వచ్చింది.

Also Read : దీపావళికి ఇల్లంతా దీపాలు.. ఎందుకో తెలుసా? అసలు కథ ఏంటి?

20 ఏళ్ల వరకు ఒక్క జననం లేదు

తోలు బొమ్మలతో వారికి పనిలేకుండా పోయింది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఓ సంఘటన ఆ ఊరిలో సరికొత్త ఆనందాన్ని తెచ్చిపెట్టింది. ఇంతకీ ఏం జరిగింది. ఏ కారణంగా ఆ గ్రామానికి ఆ పరిస్థితి వచ్చింది అనే విషయానికొస్తే.. జపాన్‌లోని ఇచినోనో గ్రామంలో మొత్తం 60 కుటుంబాలు. అందులో అత్యధికులు 60 ఏళ్లు పైబడినవారే. ఆ ఊరి యువకులు ఉపాది విద్య కోసం వలస బాట పట్టారు. దీని కారణంగా ఆ గ్రామంలో దాదాపు 20 ఏళ్ల వరకు ఒక్క జననం లేదు. దీంతో అక్కడివారంతా పిల్లలు లేని లోటు పూడ్చేందుకు తోలు బొమ్మలను చూసుకుంటూ కాలం గడిపేవారు. 

Also Read : దీపావళి రోజున ఈ మూడు వస్తువులను ఖచ్చితంగా కొనండి

కోవిడ్ కారణంగా సొంతూరుకు

అయితే ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ ఎంతటి ప్రభావం చూపించిందో అందరికీ తెలిసిందే. ఆ సమయంలో వలస వెళ్లిన యువకులంతా ఊరిబాట పట్టారు. దీంతో ఎంతో కాలం ఫ్యామిలీకి దూరంగా ఉన్న జంటలు ఒక్కటయ్యాయి. ఫలితంగా ఆ ఊరిలో బిడ్డ జన్మించాడు.

Also Read :  'అమరన్' ట్విట్టర్ రివ్యూస్.. చూస్తే షాకవుతారు!

20 ఏళ్ల తర్వాత తొలి బిడ్డ జననం

రీకాటో, తోషికి కటో అనే జంటకు కొడుకు పుట్టాడు. దీంతో ఆ గ్రామంలో సంబురాలు వెన్నంటాయి. 20 ఏళ్ల తర్వాత పుట్టిన తొలిబిడ్డ కావడంతో.. ఊరు ఊరంతా ఆనందంలో మునిగితేలుతున్నారు. తమ సొంత బిడ్డలో ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా చూసుకుంటున్నారు. బొమ్మలు, బట్టలు కొనిస్తున్నారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

Also Read :  రేవంత్‌ కుట్రలకు భయపడేది లేదు: KTR

కాగా జపాన్‌లో పెరుగుతున్న జనాభా క్షీణత సంక్షోభం కారణంగా ఇచినోనోలో ఈ దుస్థితి ఏర్పడింది. ప్రపంచంలోనే అత్యధికంగా 65 ఏళ్లు పైబడిన వారు జపాన్‌లోనే ఉన్నారు. రికార్డు స్థాయిలో 36.25 మిలియన్ల మంది 65 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hafiz Saeed : మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!

పాకిస్తాన్‌తో సింధు జల ఒప్పందాన్ని తక్షణమే భారత్ రద్దు చేసుకుంది. దీంతో పాకిస్తాన్‌లో నీటి సంక్షోభం తీవ్రమయ్యే ప్రమాదం ఉంది ఈ నేపథ్యంలో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ప్రధాని మోదీకి వార్నింగ్ ఇచ్చిన పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
modi, Hafiz Saeed

modi, Hafiz Saeed

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత మోదీ సర్కార్ కఠినమైన చర్యలు తీసుకుంది. పాకిస్తాన్‌తో సింధు జల ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకుంది. ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్‌లో నీటి సంక్షోభం తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ప్రధాని మోదీకి వార్నింగ్ ఇచ్చిన పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'మీరు పాకిస్థాన్ కు నీళ్లు ఆపుతారా? కశ్మీర్లో డ్యామ్ కట్టి నీళ్లు ఆపితే మేము మీ శ్వాస ఆపుతాం. ఆ నదుల్లో మీ రక్తం ప్రవహిస్తుంది' అని హఫీజ్ గతంలో మాట్లాడిన వీడియోను పాక్ ISI వైరల్ చేస్తూ పాకిస్థానీలను రెచ్చగొడుతోంది. 

ప్రతీ నీటి బొట్టుపై హక్కు ఉంది

మరోవైపు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ తీవ్రంగా విమర్శించింది.  సింధు జలాల్లోని ప్రతీ నీటి బొట్టుపై తమకు హక్కు ఉందన్నారు పాకిస్తాన్ మంత్రి అవైస్ అహ్మద్ ఖాన్. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము న్యాయపరంగా, దౌత్యపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలగడమంటే యుద్ధం ప్రకటించడమేనన్నారు. ప్రపంచ బ్యా్ంకు వంటి సంస్థలు కుదుర్చిన ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా వైదొలగలేదని ఆ దేశ మంత్రి అవాయిస్ లేఖరి ఎక్స్ వేదికగా ట్వీ్ట్ చేశారు. సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిర్లక్ష్యంగా నిలిపివేయడం పిరికితనం, చట్టవిరుద్ధమైన చర్య అని పాకిస్తాన్ విద్యుత్ మంత్రి అవాయిస్ లేఖరి ఎక్స్ వేదికగా ట్వీ్ట్ చేశారు.   

సింధు జలాల ఒప్పందం 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరింది. సింధూ నది టిబెట్‎లో పుట్టి.. భారత్, పాక్ మీదుగా 3 వేల 180 కిలోమీటర్లు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. మార్గమధ్యంలో ఈ నదిలోకి ప్రధానంగా ఆరు ఉపనదులు కూడా కలుస్తుంటాయి. దేశ విభజన అనంతరం సింధు జలాల నిర్వహణపై భారత్, పాక్ మధ్య ప్రాజెక్టులు కట్టడం, నీటిని వాడుకోవడం, ఇతర విషయాల్లో చాలా విషయాల్లో వివాదాలు వచ్చాయి. దీంతో 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రెసిడెంట్ జనరల్ ఆయూబ్ ఖాన్ సింధు జలాల ఒప్పందంపై ఇరువురు  సంతకాలు చేశారు. 

Advertisment
Advertisment
Advertisment