ISIS: అగ్రరాజ్యం సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. ఐసిస్‌ అగ్రనేత హతం

అగ్రరాజ్యం నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. అమెరికా ఇరాక్‌లో జరిపిన క్షిపణి దాడిలో ఐసిస్‌ అగ్రనేత అబు ఖదీజాను హతమార్చింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని ప్రకటించగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తామే హతమార్చినట్లు తెలిపాడు.

New Update
ISIS

ISIS Photograph: (ISIS)

ఉగ్రవాదాన్ని కట్టడి చేయడానికి అమెరికా సీక్రెట్ ఆపరేషన్‌ను చేపట్టింది. ఇందులో ఇస్లామిక్‌ స్టేట్‌ (ISIS) గ్లోబల్‌ ఆపరేషన్స్‌ చీఫ్ అబ్దుల్లా మక్కీ ముస్లిహ్‌ అల్‌ రిఫాయ్‌ అలియాస్‌ అబు ఖదీజాను అమెరికా హతం చేసింది. ఇరాకీ ఇంటెలిజెన్స్‌, భద్రతా దళాల సంయుక్త సహకారంతో అగ్రరాజ్యం ఇరాక్‌లో జరిపిన సీక్రెట్ ఆపరేషన్‌లో ఐసీసీ అగ్రనేతను హతమార్చింది. అమెరికా సెంట్రల్ కమాండ్ దీనికి సంబంధించిన వీడియోలను విడుదల చేసింది. మార్చి 13వ తేదీన ఈ సీక్రెట్ ఆపరేషన్ జరగ్గా.. తాజాగా ఈ వివరాలు బయటకు వచ్చాయి.

ఇది కూడా చూడండి: Punjab: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు

గతంలో త్రుటిలో తప్పించుకోగా..

కారులో అబు ఖదీజా వెళ్తుండగా అమెరికా దళాలు క్షిపణి ప్రయోగించడంతో ఘటనాస్థలంలోనే అతను మరణించాడు. అయితే ఇతనితో పాటు మరో ఐసిస్‌ ఉగ్రవాది కూడా చనిపోయినట్లు యూఎస్‌ సెంట్రల్‌ తెలిపింది. అయితే వీరిద్దరి శరీరాలకు సూసైడ్ బాంబులతో పాటు కొన్ని ఆయుధాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అబు ఖదీజా త్రుటిలో తప్పించుకోగా.. ఇప్పుడు హతం అయ్యాడు.  

ఇది కూడా చూడండి: Rohit Sharma Retirement: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!

అప్పట్లో అబు ఖదీజా డీఎన్‌ఏ తీసుకున్నారు. దీని ఆధారంగా పరీక్షలు నిర్వహించి ఖదీజా మృతిని వెల్లడించారు. మొదటి ఈ వార్తను ఇరాక్ ప్రధాని ప్రకటించారు. దీనికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ.. ఇరాక్‌లో ఐసిస్‌ అగ్రనేతను హతమార్చామాని, అతని కోసం ధైర్యవంతమైన యుద్ధ యోధులు ఎన్నో రోజుల నుంచి విశ్రాంతి తీసుకోకుండా వేటాడారు. ఇప్పుడు మీం బలంతో శాంతిని సాధించామని ట్రంప్ సోషల్ మీడియాలో తెలిపారు.

ఐసిస్‌ ముఠాలో అబు ఖదీజా రెండో అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా ఉన్నాడు. గ్లోబల్‌ ఆపరేషన్స్‌ను పర్యవేక్షిస్తున్న అబు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రమాదకర ఉగ్రవాదుల్లో ఒకడు. 2023లో అతడిపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది. ఐసిస్‌కు వ్యతిరేకంగా అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ భద్రతా దళం కొన్నేళ్లుగా కీలక మిలిటరీ ఆపరేషన్లు చేపట్టింది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Danish Kaneria: పోషిస్తున్నామని వాళ్లే ఒప్పుకున్నారు

పహల్గాం ఘటన పై పాక్‌ ఉప ప్రధాని ఇషాక్‌ దార్‌ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి.దీని పై ఆ దేశ మాజీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా స్పందించారు.ఉగ్రవాదానికి మేం ప్రోత్సహిస్తున్నామంటూ పాక్‌ బహిరంగంగా ఒప్పుకుంది అని అన్నారు.

New Update
Pakistan cricketer Danish Kaneria

Pakistan cricketer Danish Kaneria Photograph: (Pakistan cricketer Danish Kaneria)

Danish Kaneria: జమ్ము కశ్మీర్‌ లోని పహల్గాం ఘటన  పై పాక్‌ ఉప ప్రధాని ఇషాక్‌ దార్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విమర్శలకు దారి తీశాయి. ఉగ్రవాదులను స్వాత్రంత్య సమరయోధలు అంటూ పిచ్చి ప్రేలాపనలు చేశారు.దీని పై ఆ దేశ మాజీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పటికే పాక్‌ ప్రధాని మౌనంగా ఉండటం గురించి ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

Also Read:Pakistan: మరో నాలుగు రోజుల్లో యుద్ధం..పాక్ ఢిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్

పాక్‌ ఉప ప్రధాని ఉగ్రవాదులను ఫ్రీడమ్‌ ఫైటర్స్‌ అంటూ సంబోధించారు. ఇది అవమానకరమే కాకుండా..ఉగ్రవాదానికి మేం మద్దతిస్తున్నాం, ప్రోత్సహిస్తున్నామంటూ బహిరంగంగా అంగీకరించినట్లు ఒప్పుకుందని డానిష్‌ పోస్టు పెట్టాడు. ఇప్పటికే పాక్‌ ఉగ్రవాదులను కాపాడటంతో పాటు ఆశ్రయం కల్పించడం పై డానిష్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తూనే ఉన్నారు.

Also Read: Ap Rain Alert:ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు!

తాను పాక్‌ లేదా ఇక్కడి ప్రజలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం లేదని వివరించారు. ఉగ్రవాదం చేతిలో పాక్‌ తీవ్రంగా బాధపడుతోంది.శాంతి కోసం నిలబడే నాయకత్వం అవసరం ఉంది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించేవారు కాదు.నేను గర్వంగా పాక్‌ క్రికెట్‌  జెర్సీని ధరించా. మైదానంలో నా చెమటను చిందించా.చివరికి నన్ను ట్రీట్ చేసిన విధానం పహల్గాం బాధితులకు భిన్నంగా లేదు.

హిందువుగా ఉన్నందుకే లక్ష్యంగా మారా. ఉగ్రవాదాన్ని సమర్థించేవారు సిగ్గుపడాలి. హంతకులను రక్షించేవారు సిగ్గుపడాలి. నేనెప్పుడైనా మానవత్తం, వాస్తవం వైపే నిలబడతా పాక్‌ ప్రజలు కూడా ఇలానే ఉంటారని భావిస్తున్నా.వారిని తప్పుదోవ పట్టించోద్దు అని సుదీర్ఘమైన పోస్టు పెట్టాడు.

జమ్మూ కశ్మీర్‌ లో చోటు చేసుకున్న ఉగ్రదాడి ఘటన పై పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ స్పందిచకపోవడం పై ఆ దేశ మాజీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా తీవ్ర విమర్శలు కురిపించారు. ప్రధాని షరీఫ్‌ కు వాస్తవం తెలుసంటూ అన్నారు.ఉగ్రవాదులను పెంచి పోషించినట్లు పాక్‌ ఒప్పుకుందని ఆయన అన్నారు.

Also Read: Indian Air Force: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్

Also Read: Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ హస్తం..ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్

pak | danish-kaneria | pahalgam | attack in Pahalgam | usa | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment