మెరైన్‌ రఫేల్‌ డీల్.. తుది ధరలు సమర్పించిన ఫ్రాన్స్

ఇండియన్ నేవీ విమాన వాహన నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ కోసం కొనుగోలు చేయనున్న మెరైన్ రఫేల్స్ యుద్ధ విమానంలో డీల్‌లో ముందడుగులు పడుతున్నాయి. వీటికి సంబంధించిన తుది ధరలను ప్రాన్స్ భారత్‌కు సమర్పించింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి.

New Update
France 2

ఇండియన్ నేవీ విమాన వాహన నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ కోసం కొనుగోలు చేయనున్న మెరైన్ రఫేల్స్ యుద్ధ విమానంలో డీల్‌లో ముందడుగులు పడుతున్నాయి. వీటికి సంబంధించిన తుది ధరలను ప్రాన్స్ భారత్‌కు సమర్పించింది. ఈసారి ధరల విషయంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రయోజనం కనిపించినట్లు ఓ వార్తా సంస్థ వివరించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డొభాల్‌ పర్యటనకు ముందే ఈ వివరాలు బయటపడ్డాయి. గతవారమే ఇరుదేశాలకు చెందిన బృందాలు ఢిల్లీలో చర్చలు జరిపాయి. మంగళవారం నుంచి భారత్ - ఫ్రాన్స్‌ మధ్య వ్యూహాత్మక చర్చలు పారిస్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ చర్చల్లో అజిత్ డోభాల్ పాల్గొననున్నారు. 

Also Read: నందిని నెయ్యితో తిరుపతి లడ్డూ.. ఈ బ్రాండ్ ప్రత్యేకత ఇదే!

భారత నౌకాదళం సరికొత్త విమాన వాహన నౌకను పూర్తిస్థాయిలో ఉపయోగించేందుకు ఈ ఒప్పందం చాలా కీలకమైనదని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త విమానాల్లో భారత్ అభివృద్ధి చేసిన రాడార్‌ను సైతం అనుసంధానించాల్సి ఉంది. మొత్తంగా ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు దాదాపు 8 ఏళ్ల సమయం పడుతుంది. ఇదే సమయంలో ఫ్రాన్స్‌కు చెల్లింపులు చేయాల్సి వస్తుంది. అలాగే దేశీయంగా తయారుచేసిన అస్త్ర, రుద్రం క్షిపణులను కూడా ఈ విమానాలకు  ఇంటిగ్రేట్ చేయాలని కేంద్రం కోరుతోంది. అంతేకాదు వాయుసేనకు అవసరమైన 40 డ్రాప్ ట్యాంక్‌ల కొనుగోలు, తక్కువ సంఖ్యలో వర్క్ స్టేషన్ల ఏర్పాటు వంటి అంశాలను కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 400 మందికి పైగా?

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
Iran Harbor

Iran Harbor

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించిన ఘటన చోటుచేసుకుంది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలో రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ భారీ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

చమురు, పెట్రోకెమికల్స్ కారణంగా..

నౌకాశ్రయంలోని కంటెయినర్ల నుంచి పేలుడు సంభవించిందని భావిస్తున్నారు. ఇక్కడ ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ కంటైయినర్లలో చమురు, పెట్రోకెమికల్స్ ఉన్నాయి. వీటి కారణంగా పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment