China Earthquake : చైనాలో తెల్లవారుజామున భూకంపం..!

చైనాలో బుధవారం (మార్చి 26) తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది. ఉత్తర చైనాలోని హెబీ ప్రావిన్స్‌లోని లాంగ్‌ఫాంగ్‌లోని యోంగ్కింగ్ కౌంటీలో భూకంపం సంభవించింది, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైంది.

New Update
china earthquake

china earthquake

భారత్ పొరుగు దేశమైన చైనాలో బుధవారం (మార్చి 26) తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది. ఉత్తర చైనాలోని హెబీ ప్రావిన్స్‌లోని లాంగ్‌ఫాంగ్‌లోని యోంగ్కింగ్ కౌంటీలో భూకంపం సంభవించింది, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైంది. చైనా భూకంప నెట్‌వర్క్ సెంటర్ (CENC) ప్రకారం, భూకంప కేంద్రం భూమికి 20 కిలోమీటర్ల దిగువన ఉంది. భూకంప కేంద్రం బీజింగ్‌కు దగ్గరగా ఉండటంతో అక్కడి నివాసితులు కూడా స్వల్పంగా ప్రకంపనలు సంభవించాయి.  అయితే ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం కానీ జరగలేదు.

Also read :  Suhasini Maniratnam: నాకు టీబీ ఉండేది.. పరువుపోతుందని భయపడి.. ! : సుహాసిని

Also read : Bhatti Vikramarka : కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు .. భట్టి వార్నింగ్!

87 వేల మంది మృతి

భూకంపం పరంగా సున్నితమైన దేశాలలో చైనా ఒకటి.  ఇక్కడ అప్పుడప్పుడు, ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో తేలికపాటి నుండి తీవ్రమైన తీవ్రత వరకు భూకంపాలు సంభవిస్తాయి. 2008 మే 12న సిచువాన్ ప్రావిన్స్‌లో 7.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో  దాదాపు 87 వేల మంది మృతి చెందగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ భూకంపం పాఠశాలలు, ఆసుపత్రులు, ఇళ్ళు సహా అనేక ప్రదేశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. 

Also read :  అప్సర హత్య కేసులో సంచలనం..  కోర్టు కీలక తీర్పు!

Also read :  మాజీ మంత్రి కొడాలి నానికి గుండెపోటు.. సీరియస్?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Canada: కెనడాలో ఊహించని పరిణామం.. పార్లమెంట్‌కు తాళాలు

కెనడా పార్లమెంటు భవనాన్ని ఒట్టావా పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. శనివారం ఆ భవనంలోకి ఓ గుర్తు తెలియని దుండగుడు ప్రవేశించాడని అందుకే మూసివేసినట్లు పోలీసులు చెప్పారు. ఆదివారం ఉదయం అతడిని అందుబాటులోకి తీసుకుని దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Canada parliament briefly put on lockdown

Canada parliament briefly put on lockdown

కెనడాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అక్కడి పార్లమెంటు భవనాన్ని ఒట్టావా పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. శనివారం ఆ భవనంలోకి ఓ గుర్తు తెలియని దుండగుడు ప్రవేశించాడని అందుకే మూసివేసినట్లు పోలీసులు చెప్పారు. పార్లమెంట్‌ హిల్‌లోని తూర్పు బ్లాక్‌లోకి అక్రమంగా వచ్చిన దుండగులు రాత్రంతా లోపలే ఉన్నాడని తెలిపారు. అతడి దగ్గర ఆయుధాలు ఉన్నాయా ? లేదా ? అనేదానిపై స్పష్టత లేదు.  ఇక వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి పార్లమెంటు భవనంలోకి చొరబడచంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. 

Also Read: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం

పార్లమెంటు భవనం చుట్టూ పోలీసులను మోహరించారు. తూర్పు బ్లాక్‌లో ఉన్న సిబ్బంది అందరూ ఒకే గదిలోకి వచ్చి తాళాలు వేసుకోవాలని సూచించారు. భవనంలో ఉన్న పలు ప్రదేశాలపై కూడా లాక్‌డౌన్ పెట్టారు. అలాగే పార్లమెంటుకు దగ్గర్లో ఉన్న రోడ్లని మూసివేస్తున్నామని.. ప్రజలు ఎవరూ కూడా అటువైపు రావొద్దని అధికారులు ఆదేశించారు. చివరికీ ఆదివారం ఉదయం దుండగుడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్లు చెప్పారు. 

ఏప్రిల్ 28న కెనడాలో ముందస్తు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ గత నెల 23వ తేదీన పార్లమెంటును రద్దు చేశారు. వాస్తవానికి అక్కడ అక్టోబర్ 27న ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ దాదాపు ఆరు నెలలకు మందుగానే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్లమెంటులోకి దుండగుడు ప్రవేశించడం కలకలం రేపుతోంది. అందులో ఉండే సున్నితమైన సమాచారాన్ని ఎత్తుకెళ్లడం కోసం దుండగులు వచ్చాడా ? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. 

Also Read: అమ్మో బాబోయ్.. చీతాలకు నీళ్లు తాగించిన యువకుడు.. చివరికీ ఊహించని షాక్

telugu-news | canada | rtv-news 

 

Advertisment
Advertisment
Advertisment