స్పెయిన్‌లో వరదల బీభత్సం.. 140 మంది మృతి

స్పెయిన్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. దీని ప్రభావంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. స్పెయిన్‌లో వరదల ప్రభావానికి 140 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. అలాగే అనేక మంది గల్లంతయ్యారు.

author-image
By B Aravind
New Update
Spain

స్పెయిన్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. దీని ప్రభావంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈ వరదల ప్రభావానికి దాదాపు 140 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. అలాగే అనేక మంది గల్లంతయ్యారు. ఇంకా వాళ్ల వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. వరద ప్రవాహంలో వందలాది కార్లు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు వెయ్యి మంది సైనికులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నారు.  

Also Read: ప్రెసిడెంట్ అయ్యేనాటికి యుద్ధం ముగియాలి–ఇజ్రాయెల్‌కు చెప్పిన ట్రంప్

ఇక దక్షిణ స్పెయిన్‌లో కూడా భారీ వర్షాలు కురిశాయి. దీంతో అక్కడి వీధులన్నీ బురద నీటితో నిండిపోయాయి. వరదల వల్ల తప్పిపోయిన వారి ఆచూకీ కోసం డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు. అలాగే అధికారుల సలహాలను కూడా పాటించాలని ప్రజలను అధికారులు కోరారు. వరదల్లో చిక్కుకున్న వాళ్లని హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. ఈ ఆకస్మిక వరదల వల్ల తీవ్రంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Also Read: అమెరికా ఎన్నికలకు ముందే అణుబాంబు దాడి.. ఇరాన్‌ బిగ్ ప్లాన్!

 ఇదిలాఉండగా ఈ మధ్యకాలంలో అనేక దేశాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారత్, చైనా, అమెరికా, జపాన్ దేశాల్లో వరదలు తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్పెయిన్‌లో కూడా వరదలు అక్కడి ప్రజల జీవన విధానాన్ని అతలాకుతలం చేసింది. మరోవైపు ప్రపంచంలో జరుగుతున్న వాతావరణ మార్పుల వల్లే భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.  

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack: లొంగిపో బిడ్డా.. ఉగ్రవాదిని వేడుకున్న తల్లి.. పరీక్ష రాసేందుకు వెళ్లి!

పహల్గాం అటాక్‌లో భాగమైన ఉగ్రవాది ఆదిల్‌ను లొంగిపోవాలంటూ తన తల్లి షాజా బానో వేడుకుంటోంది. 2018లో ఇంటినుంచి పరీక్ష రాసేందుకు వెళ్లి తిరిగి రాలేదని ఆందోళన వ్యక్తం చేసింది. తన బిడ్డ అమాయకుడని, తప్పుచేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కన్నీటిపర్యంతమైంది. 

New Update
pehalgam

Pahalgam Attack

Pahalgam Attack: పహల్గాం అటాక్‌లో భాగమైన ఉగ్రవాది ఆదిల్‌ను లొంగిపోవాలంటూ తన తల్లి షాజా బానో వేడుకుంటోంది. 2018లో ఇంటినుంచి పరీక్ష రాసేందుకు వెళ్లి తిరిగి రాలేదని ఆందోళన వ్యక్తం చేసింది. తన బిడ్డ అమాయకుడని, తప్పుచేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కన్నీటిపర్యంతమైంది. 

2018లో పరీక్ష రాసేందుకు వెళ్లి..

ఈ మేరకు పాక్ లోకల్ మీడియాతో మాట్లాడిన షాజా బానో.. పహల్గాం దాడిలో నిందితుడిగా ఉంటే ఆదిల్ హుస్సేన్ లొంగిపోవాలని సూచించింది. 'ఆదిల్ మన ఫ్యామిలీ ప్రశాంతంగా జీవించాలనుకుంటుంది. నీవు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడంటే నేను నమ్మట్లేదు. కానీ ఒకవేళ ఈ దాడిలో భాగమస్వాముడివైతే లొంగిపో. నేరం రుజువైతే ఆదిల్ పై ప్రభుత్వాలు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. 2018లో పరీక్ష రాసేందుకు ఆదిల్ ఇంటినుంచి వెళ్లిపోయాడు. ఇప్పటికి తిరిగిరాలేదు' అంటూ షాజా దుఃఖిస్తోంది.

Also read :  Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

ఇదిలా ఉంటే.. జమ్మూకశ్మీర్‌ పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ పౌరులను తిరిగి వెళ్లిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ రోజుతో ముగియనుంది. దీంతో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ పౌరులు అట్టారి సరిహద్దుకు చేరుకుంటున్నారు. ఇందులో భాంగంగానే అట్టారి సరిహద్దు వద్ద ఒక తల్లి, ఇద్దరు పిల్లల ఎమోషనల్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. ఇది అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది. తల్లికి భారతీయ పాస్‌పోర్ట్ ఉండగా ఆమె కూతురు (8), కొడుకు (6)కు పాకిస్తాన్ పాస్‌పోర్ట్ ఉంది. దీంతో తమ పిల్లలను వీడి ఉండలేక కన్నీటిపర్యంతమయ్యారు. కూతురు ఏడుస్తూ 'అమ్మ లేకుండా ఉండలేము' అని ఏడవటం అందరి హృదయాలను కదిలించింది. 

Also Read :   Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!

 

attack in Pahalgam | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment