BIG BREAKING: ట్రంప్‌కు బిగ్ షాక్.. అమెరికా సీక్రెట్స్ లీక్.. అసలేం జరిగిందంటే?

అమెరికా బలగాలు ఇటీవల యెమెన్‌పై భీకర దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనికంటే ముందే ఈ దాడుల ప్లాన్ ఓ గ్రూప్ చాట్ ద్వారా లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ లీక్స్ ఎలా జరిగిందనే విషయం తనకు కూడా తెలియదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించాడు.

New Update
trumpedu

Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యెమెన్‌పై మార్చి 15వ తేదీన దాడులను ప్రకటించారు. అయితే అమెరికా అనుకోకుండా చేసిన ఓ చిన్న పొరపాటు ఇప్పుడు దేశ భద్రత ఇరకాటంలో పడింది. డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలోని అగ్ర జాతీయ భద్రతా అధికారులు యెమెన్‌లోని హౌతీ గ్రూపుపై సైనిక దాడులను ప్లాన్ చేసి, వాణిజ్య సందేశ సేవలో చర్చించారు. అయితే ఇప్పుడు ఆ చాట్ లీక్ అయ్యింది. ఓ గ్రూప్ చాట్ ద్వారా ఈ విషయం తెలిసినట్లు ద అట్లాంటిక్‌ మ్యాగజైన్ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ జెఫ్రీ గోల్డ్‌బర్గ్‌ తెలిపారు. అయితే  ఈ చాట్ లీక్ కావడానికి రెండు రోజుల ముందే తనని ఆ గ్రూప్‌లో యాడ్ చేశారని వెల్లడించారు.

ఇది కూడా చూడండి: Betting Apps Anvesh: యూట్యూబర్‌ VR రాజాపై అన్వేష్ ఫైర్.. గడ్డి తింటున్నారంటూ ఆగ్రహం!

ఇది కూడా చూడండి: వీడు మగాడ్రా బుజ్జి.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి..జట్టును గెలిపించి!

యూరప్‌కి తిరిగి సాయం చేయాల్సి వస్తుందని..

హెగ్సెత్ గ్రూప్‌ చాట్‌లో టార్గెట్స్‌, అమెరికా ఆయుధాల మోహరింపు, దాడులు చేసే దిశ వంటి అంశాలపై చర్చించినట్లు గోల్డ్‌బర్గ్‌ తెలిపారు. ఈ క్రమంలోనే దాడులు జరిగాయని, వాన్స్‌గా గుర్తించిన వ్యక్తి ఈ దాడులను వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. అయితే నిజంగానే షిప్పింగ్‌పై దాడులు జరిగితే యూఎస్ యూరప్‌కు తిరిగి సాయం చేయాల్సి వస్తుందని కూడా చాట్‌లో ఉంది. అయితే జాతీయ భద్రతా సలహాదారు మైక్‌ వాల్జ్‌, హెగ్సెత్‌లు యెమెన్‌పై దాడులు చేసేంత సామర్థ్యం కేవలం అమెరికాకు మాత్రమే ఉందన్నారని గోల్డ్‌బర్గ్‌ తెలిపారు.

ఇది కూడా చూడండి: Nicholas Pooran : భయంకరమైన హిట్టర్.. 29 ఏళ్లకే 600 సిక్సులు!

గోల్డ్‌బెర్గ్‌‌కు ఈ విషయం ముందే తెలిసినా కూడా బయటకు చెప్పలేదు. అయితే దీనిపై ట్రంప్ కూడా స్పందించారు. ఎలాంటి సమాచారం దీనిపై లేదన్నారు. జాతీయ భద్రతా మండలి ప్రతినిధి బ్రియాన్‌ హ్యూస్ స్పందిస్తూ గ్రూప్‌చాట్‌లోకి అనుకోకుండా జర్నలిస్టు ఎలా వచ్చారనే దానిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. ఈ భద్రతను తీవ్రంగా ఖండించారు. అయితే ట్రంప్ పాలక వర్గం అజాగ్రత్త వల్లే ఇలా జరిగిందని మరికొందరు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: AP Man : అమెరికాలో ఆంక్షలు.. ఏపీ యువకుడు ఆత్మహత్య!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Danish Kaneria: ఉగ్రదాడిలో ప్రమేయం లేకపోతే..పాక్ ఎందుకు ఉలికిపడుతోంది..డానిష్ కనేరియా

పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో సంబంధం లేనప్పుడు పాక్ ప్రభుత్వం ఎందుకు ఉలికిపడుతోందని ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ప్రశ్నించారు. దీనిని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇంకా ఎందుకు ఖండించలేదని అడిగారు. 

New Update
pakistna ex cricketer

Danish Kaneria

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. దీనిపై అన్ని దేశాల నేతలూ స్పందించారు. ఒక్క పాకిస్తాన్ ప్రధాని తప్ప. అంతేకాదు ఇదంతా భారత్ చేసిన తప్పులే అంటూ ఆ దేశ రక్షణ మంత్రి నోటికొచ్చినట్లు మాట్లాడారు. దానికి తోడు పాక్ ప్రభుత్వం తన రక్షణ బలగాలను అలెర్ట్ చేసింది. భారత సరిహద్దు ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు పాక్ పై భారత్ కఠిన నిర్ణయాలను తీసుకుంది. అన్ని వైపుల నుంచీ దిగ్భంధనం చేసేసింది. 

మండిపడుతున్న మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా..

ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ప్రవర్తనపై, కాశ్మీర్ ఉగ్రదాడిపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా మండిపడ్డారు. ఉగ్రదాడిలో సంబంధం లేకుంటే ఎందుకు పాకిస్తాన్ ఉలికిపడుతోందని ప్రశ్నించారు. దాడిని ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎందుకు ఖండించలేదు...కనీసం దాని గురించి మాట్లాడలేదు కూడా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ తప్పూ చేయనప్పుడు భారత సరిహద్దుల్లో బలగాలను ఎందుకు హై అలెర్ట్ చేశారని కనేరియా అడుగుతున్నారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నామని పాక్ ప్రభుత్వానికీ తెలుసు...అందుకే ఇవన్నీ చేస్తోంది. ఇలాంటివి చేయడానికి వారికి సిగ్గుండాలి అని డానిష్ కనేరియా మండిపడుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.  

 

today-latest-news-in-telugu | cricketer

 

Also Read:  Ind-Pak: భారత్ ప్రభుత్వ నిర్ణయాలతో పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ

Advertisment
Advertisment
Advertisment