TS News : అయ్యో వైశాలి.. మార్కులు తక్కువగా వచ్చాయని ఎంత పని చేశావమ్మా!

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో విషాదం నెలకొంది. రెజొనెన్స్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్న వైశాలి రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాయని తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. వైశాలి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

New Update
TS News : అయ్యో వైశాలి.. మార్కులు తక్కువగా వచ్చాయని ఎంత పని చేశావమ్మా!

Khammam : ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో విషాదం నెలకొంది. మనస్తాపంతో ఇంటర్మీడియట్ విద్యార్థిని(Intermediate Student) వాకదాని వైశాలి(17) దారుణానికి పాల్పడింది. ఖమ్మంలోని రెజొనెన్స్ కళాశాలలో మొదటిసంవత్సరం ఎంపీసీ చదువుతున్న వైశాలి(Vaishali).. ఉదయం వెల్లడైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలతో(Intermediate Exam Results) తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య(Suicide) చేసుకుంది. సంస్కృతం సహా మ్యాథ్స్ 1A , 1B పరీక్షల్లో ఫెయిల్ కావడంతో పరువు పోయినట్లు భావించి ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. వైశాలి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు