Telangana : ఇంటర్ బాలికలపై నలుగురు యువకులు అత్యాచారం కరీనంగర్ జిల్లా చొప్పదండిలో దారుణం వెలుగుచూసింది. ఇంటర్ చదువుతున్న బాలికపై నలుగురు యువకులు బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేయడం కలకలం రేపింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. By B Aravind 15 May 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Karimnagar : కరీనంగర్ జిల్లా చొప్పదండిలో దారుణం వెలుగుచూసింది. ఇంటర్ చదువుతున్న బాలిక(Inter Student) పై నలుగురు యువకులు అత్యాచారం(Rape) చేయడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆ అమ్మాయికి చొప్పదండి యువకుడితో ఇన్స్టా(Instagram)లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత వీళ్లిద్దరు కలిసి తిరిగారు. అయితే ఆ యువకుడు.. ఆమెతో దిగిన ప్రైవేట్ ఫోటోస్ లీక్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం చేశాడు. దీన్ని కూడా సెల్ఫోన్లో చిత్రీకరించి ఈ విషయాన్ని అతడు స్నేహితులకు చెప్పాడు. Also Read: పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల చిన్నారి మృతి దీంతో మరో ముగ్గురు యువకులు కూడా ఆమెను బ్లాక్మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. పదే పదే ఇలా బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో యువతీ తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసింది. చివరికి వారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం(POCSO Act) కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఆ నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. Also read: దోస్త్ వెబ్ ఆప్షన్ల తేదీ వచ్చేసింది.. #telugu-news #inter-student-raped #karimnagar #crime-news సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి